మాములుగా కొత్త సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఒకే డేట్ మీద పోటీ పడటం సహజం. అది తప్పేమీ కాదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. రిస్క్ కి పూర్తి బాధ్యత తీసుకుని అన్ని లెక్కలు వేసుకుని క్లాష్ కి సిద్ధ పడతారు. కానీ ఎప్పుడో ఆడేసి వెళ్లిపోయిన రీ రిలీజులకు ఇలా చేయడం కరెక్ట్ కాదు. వచ్చే నెల సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా గుడుంబా శంకర్ 4కెని మళ్ళీ విడుదల చేస్తామని నిర్మాత నాగబాబు ఎప్పుడో చెప్పారు. దానికి వచ్చే వసూళ్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఆరంజ్ కు ఈ పద్దతే ఫాలో కావడం తెలిసిందే.
తీరా చూస్తే బండ్ల గణేష్ ఇదే రోజు తన గబ్బర్ సింగ్ వదులుతానని అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ లో అయోమయానికి దారి తీసింది. దీంతో నాగబాబు ఆగస్ట్ 31 నుంచే షోలు ఉంటాయని ప్రకటించడం మరో ట్విస్ట్. ఇలా పరస్పరం పోటీకి దిగడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ మధ్య ఇదే తరహాలో చాలా తక్కువ గ్యాప్ తో తమ్ముడు, జల్సాని వదిలారు. సోలోగా వచ్చి ఉంటే పెద్ద రికార్డులు దక్కేవని బయ్యర్లు ఇప్పటికీ అంటుంటారు. కానీ ఇప్పుడు గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ ని ఒకే టైంలో దించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో లేట్ గా ప్రకటించిన గణేష్ తెలుసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ సెట్ చేసిన బిజినెస్ మెన్ రికార్డులని పవన్ ఫాలోయర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు సినిమాలు ఒకేసారి వస్తే అది జరగదు. మరి బండ్ల గణేష్ రాజీ పడి నెక్స్ట్ టైం అంటాడేమో చూడాలి. సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ ఖుషి ఉంది. మైత్రి సంస్థ భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటోంది. రౌడీ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ జరిగేలా చూస్తోంది. అలాంటప్పుడు రెండు పవన్ పునః విడుదలలు ఉంటే అందరికీ ఇబ్బందే. మధ్యే మార్గంగా ఒకరు డ్రాప్ అంటే అది గబ్బర్ సింగే అవ్వాలని ఫ్యాన్స్ కోరిక. మరి బండ్లన్న వింటాడో లేదో లెట్ వెయిట్ అండ్ సీ.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…