మాములుగా కొత్త సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఒకే డేట్ మీద పోటీ పడటం సహజం. అది తప్పేమీ కాదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. రిస్క్ కి పూర్తి బాధ్యత తీసుకుని అన్ని లెక్కలు వేసుకుని క్లాష్ కి సిద్ధ పడతారు. కానీ ఎప్పుడో ఆడేసి వెళ్లిపోయిన రీ రిలీజులకు ఇలా చేయడం కరెక్ట్ కాదు. వచ్చే నెల సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా గుడుంబా శంకర్ 4కెని మళ్ళీ విడుదల చేస్తామని నిర్మాత నాగబాబు ఎప్పుడో చెప్పారు. దానికి వచ్చే వసూళ్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఆరంజ్ కు ఈ పద్దతే ఫాలో కావడం తెలిసిందే.
తీరా చూస్తే బండ్ల గణేష్ ఇదే రోజు తన గబ్బర్ సింగ్ వదులుతానని అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ లో అయోమయానికి దారి తీసింది. దీంతో నాగబాబు ఆగస్ట్ 31 నుంచే షోలు ఉంటాయని ప్రకటించడం మరో ట్విస్ట్. ఇలా పరస్పరం పోటీకి దిగడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ మధ్య ఇదే తరహాలో చాలా తక్కువ గ్యాప్ తో తమ్ముడు, జల్సాని వదిలారు. సోలోగా వచ్చి ఉంటే పెద్ద రికార్డులు దక్కేవని బయ్యర్లు ఇప్పటికీ అంటుంటారు. కానీ ఇప్పుడు గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ ని ఒకే టైంలో దించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో లేట్ గా ప్రకటించిన గణేష్ తెలుసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ సెట్ చేసిన బిజినెస్ మెన్ రికార్డులని పవన్ ఫాలోయర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు సినిమాలు ఒకేసారి వస్తే అది జరగదు. మరి బండ్ల గణేష్ రాజీ పడి నెక్స్ట్ టైం అంటాడేమో చూడాలి. సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ ఖుషి ఉంది. మైత్రి సంస్థ భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటోంది. రౌడీ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ జరిగేలా చూస్తోంది. అలాంటప్పుడు రెండు పవన్ పునః విడుదలలు ఉంటే అందరికీ ఇబ్బందే. మధ్యే మార్గంగా ఒకరు డ్రాప్ అంటే అది గబ్బర్ సింగే అవ్వాలని ఫ్యాన్స్ కోరిక. మరి బండ్లన్న వింటాడో లేదో లెట్ వెయిట్ అండ్ సీ.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…