Movie News

ఏజెంట్ వివాదం భోళాను ఆపగలదా

ఇంకో నలభై ఎనిమిది గంటల్లో మొదటి ప్రీమియర్ పడాల్సిన భోళా శంకర్ మెడకు ఏజెంట్ వివాదం చుట్టుకోవడం ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగిస్తోంది. వైజాగ్ కు చెందిన సతీష్ అనే డిస్ట్రిబ్యూటర్ తనకు ఏజెంట్ సినిమాని ముప్పై కోట్లకు అమ్మి కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే ఇచ్చారని, తర్వాత సామజరగమన విషయంలో ఇలాగే చేసి చివరికి భోళా శంకర్ ఒక్క ఏరియా కూడా తనకివ్వకుండా వేరే వాళ్ళ ద్వారా పంపిణి చేయడం వల్ల తీవ్ర నష్టం వచ్చిందని నిన్నో ప్రెస్ నోట్ వదిలారు. ఇవాళ లాయర్ సమక్షంలో ఒక వీడియో బైట్ కూడా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడీ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది, తనకు న్యాయం జరిగే దాకా భోళా శంకర్ రిలీజ్ మీద స్టే డిమాండ్ చేస్తున్నారు సతీష్. మరోవైపు అనిల్ సుంకర బృందం మాత్రం అతనివి ఫేక్ డాక్యుమెంట్లనే రీతిలో ఆరోపణలు చేసినట్టుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలే ఆశించిన స్థాయిలో బజ్ లేదని తెగ ఫీలవుతున్న అభిమానులకు ఈ సంఘటనలు మింగుడు పడటం లేదు. ఏకె ఎంటర్ టైన్మెంట్ యుద్ధప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల క్రితమే మొదలుకాగా ఏపి బయ్యర్లు ఆన్ లైన్ అమ్మకాలకు రెడీ అవుతున్నారు.

న్యాయస్థానం స్టే ఇవ్వొచ్చా లేదానేది సతీష్ సమర్పించే సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. అల్ట్రా డిజాస్టర్ గా నిలిచిన ఏజెంట్ ప్రభావం అదే సంస్థ నుంచి వస్తున్న భోళా శంకర్ మీద ఉండొచ్చనే అనుమానం గతంలోనే వ్యక్తమయ్యింది. దానికి తగ్గట్టే ఇప్పుడీ వివాదం వచ్చి పడింది. జడ్జ్ మెంట్ ఈ రోజుకి రాకపోతే వాయిదా వేసినా రేపయినా ఖచ్చితంగా ఇవ్వాలి. వ్యవహారం ఫిలిం ఛాంబర్ దాకా తీసుకెళ్లినా లాభం లేకపోయిందని చెబుతున్న సతీష్ కు కౌంటర్ గా అనిల్ సుంకర్ బృందం ఇంకా స్పందించలేదు. రాబోయే గంటల్లో పరిణామాలు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి.

This post was last modified on August 9, 2023 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

17 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago