నిన్న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన వేడుక వల్ల చిరంజీవి ప్రసంగం మొదలుపెట్టే టైంకే రాత్రి పది దాటేసింది. వర్షాలు గట్రా లేకపోవడంతో వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వచ్చిన అతిథులు, కాస్ట్ అండ్ క్రూ అందరూ ఓ రేంజ్ లో చిరు మీద పొగడ్తల వర్షం కురిపించారు. చిన్న వేషం వేసిన లోబో దగ్గరి నుంచి కీర్తి సురేష్ దాకా ఎవరూ మినహాయింపుగా నిలవలేదు. అయితే అందరికంటే ఎక్కువ హైలైట్ అయ్యింది మాత్రం హైప్ ఆదినే. సుమారు పావు గంట ఆడిటోరియంని ఊపేశాడు. బండ్ల గణేష్ రాని లోటుని మరిపించేశాడు
చిరంజీవి కెరీర్ ప్రారంభంలో జరిగిన అవమానాలతో మొదలుపెట్టి కోటి రూపాయల తీసుకున్న తొలి హీరో వరకు పేరు తెచ్చుకోవడం దాకా, ఫస్ట్ పది కోట్ల సినిమా ఘరానా మొగుడు ప్రస్తావం తేవడం, రంగస్థలంతో రామ్ చరణ్ అందరి విమర్శలకు సమాధానం చెప్పి గ్లోబల్ స్టార్ గా ఎదగడం ఇలా అన్ని అంశాలను తీసుకొచ్చాడు. ఠాగూర్ లో అన్నయ్యకి నచ్చని పదం క్షమించడం అయితే, నిజ జీవితంలో అందరిని క్షమించడమే పనిగా పెట్టుకున్నారని ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. చిరుని ఎవరేమైనా భరిస్తాడని అయితే తమ్ముడు పవన్ మాత్రం అందరి లెక్క తేలుస్తాడని చెప్పి ఈలలతో మోతెక్కించాడు.
మొత్తానికి చిరంజీవిని ఎమోషనల్ గా ఫీలయ్యేలా చేయడం ఆదికే సాధ్యమయ్యింది. పక్కనే కూర్చున్న అల్లు అరవింద్ సైతం ఆశ్చర్యపోతూ స్పీచ్ వినడం గమనార్హం. సోషల్ మీడియాలో మాత్రం బండ్ల గణేష్ లేని లోటు ఇప్పుడు హైపర్ ఆదితో తీరుతోందని, గూస్ బంప్స్ ఇచ్చేలా ఎలా మాట్లాడాలో ఈ ఇద్దరి తర్వాతే ఎవరైనా అంటూ వీడియోలను వైరల్ చేస్తున్నారు. భోళా శంకర్ లో కమెడియన్ బ్యాచ్ లో ముఖ్యమైన పాత్ర వేసిన హైపర్ ఆదికి ఈ దెబ్బతో మెగాస్టార్ ఏ మూవీ అయినా సరే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని వేరే చెప్పాలా. మొత్తానికి తనలో మెగా ఫ్యానిజంని ఓ రేంజ్ లో బయటపెట్టుకున్నాడు
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…