టాలీవుడ్లో చరిత్రలోనే చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా ‘బేబి’ని చెప్పొచ్చు. పెద్దగా పేరు లేని హీరో హీరోయిన్లను పెట్టి దర్శకుడిగా ఒక సినిమా అనుభవం ఉన్న సాయి రాజేష్ తీసిన ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అన్నీ కలిసొస్తే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా నిడివి దాదాపు 3 గంటలు కావడం విశేషం. ‘రంగస్థలం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి చిత్రాలు మూడు గంటల
నిడివితోనే ఘనవిజయాన్నందుకున్న మాట వాస్తవమే కానీ.. ‘బేబి’ లాంటి చిన్న చిత్రం ఇంత రన్ టైంతో మెప్పిస్తుందా అనే ప్రశ్నలు విడుదలకు ముందు తలెత్తాయి. కానీ ఆ అనుమానాలేమీ పెట్టుకోకుండా టీం ముందుకు వెళ్లిపోయింది. మంచి ఫలితాన్నందుకుంది. కానీ ఈ సినిమా షూట్ అయ్యాక తేలిన నిడివి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. అది ఏకంగా.. 5 గంటల 25 నిమిషాలట. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేషే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.
‘బేబి’ చిత్రానికి ముందు వేరే ఎడిటర్ ఉండేవారని.. అతనున్న సమయానికి రష్ చూస్తే 5 గంటలు దాటిపోయిందని.. అది చూసి నిర్మాత ఎస్కేఎన్కు గుండె బద్దలైపోయిందని సాయి రాజేష్ తెలిపాడు. అప్పుడు ఈ సినిమాను ఎలా కట్ చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి అందరం వచ్చామని.. ఆ టైంలో ఈ ప్రాజెక్టులోకి ఎడిటర్ నైషద్ వచ్చాడని.. అతనొచ్చి లాంగ్ షాట్లు అన్ని కట్ చేస్తూ వెళ్లినా సరే ఫస్టాఫ్ గంటా 50 నిమిషాలకు పైగా, సెకండాఫ్ 2 గంటలకు పైగా వచ్చిందని సాయిరాజేష్ తెలిపాడు.
అప్పుడు చూసుకున్నా ప్రతి సీన్ బాగుందనే అనిపించిందని.. ఈ సినిమా రన్ టైం ఎలా తగ్గించాలో తెలియక అందరం తలలు పట్టుకున్నామని సాయి రాజేష్ వెల్లడించాడు. చివరికి ఎస్కేఎన్, మారుతి కలిసి కూర్చుని వీలైనంత మేర సినిమాను కట్ చేస్తూ వెళ్లారని.. చివరికి 3 గంటల రన్ టైం ఫైనలైజ్ అయిందని.. మారుతితో పాటు బన్నీ వాసు కూడా ఇంతకుమించి తగ్గించకూడదని.. సినిమాను ఆ రన్ టైంతోనే రిలీజ్ చేయాల్సిందే అని నిర్ణయించుకుని రిలీజ్కు వెళ్లామని సాయిరాజేష్ వెల్లడించాడు.
This post was last modified on August 2, 2023 8:03 pm
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…