స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తీసుకున్న దాస్ కా ధమ్కీ అంచనాలకు తగ్గట్టు సక్సెస్ కాకపోవడంతో విశ్వక్ సేన్ కొత్త మేకోవర్ చేసుకుని నటిస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ స్టైల్ లో దీనికి పేరు నిర్ణయించడం గమనార్హం. డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న ఈ మాఫియా డ్రామాలో నేహా శెట్టి హీరోయిన్ కాగా యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చడం విశేషం.
టీజర్ లో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. గోదావరి ప్రాంతంలో పరస్పరం వైరుధ్య భావాలున్న ముఠాలు, రాజకీయ నాయకుల మధ్య జీవనోపాధి కోసం పోరాటం చేసే యువకులు. మంచిగా మాట్లాడ్డమే కాదు తేడా వస్తే నవ్వుతు నరం లాగేసే తత్వం వీరిది. స్వార్థ శక్తుల ఆటలో పావులుగా మారిన ఈ చదరంగంలో ఓ కుర్రాడు(విశ్వక్ సేన్) కత్తి పట్టాల్సి వస్తుంది. నాయకుడిగా మారే క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదురుకుంటాడు. అవేంటనేది తెరమీద చూడాలి. విశ్వక్ రఫ్, రస్టిక్ గా నటించాడు. కురచగా మార్చుకున్న హెయిర్ స్టయిల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది.
విజువల్స్ లో డెప్త్ ఉంది. మెయిన్ క్యాస్టింగ్ ని రివీల్ చేశారు. సాయికుమార్, నాజర్, గోపరాజు రమణ, అంజలితో పాటు నేహా శెట్టిని కూడా చూపించారు. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం ఎలివేట్ చేసింది. ఇలాంటి రా డ్రామాలు అరుదుగా వస్తున్న తరుణంలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి అంచనాలు పెంచేలా ఉంది. తుపాకుల మోత, ఆధిపత్య గొడవల మధ్య గోదావరి అందాలను దర్శకుడు కృష్ణ చైతన్య ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ డేట్ ని లాక్ చేయలేదు కానీ ఆ నెలలో రావడం పక్కానే.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…