స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తీసుకున్న దాస్ కా ధమ్కీ అంచనాలకు తగ్గట్టు సక్సెస్ కాకపోవడంతో విశ్వక్ సేన్ కొత్త మేకోవర్ చేసుకుని నటిస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ స్టైల్ లో దీనికి పేరు నిర్ణయించడం గమనార్హం. డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న ఈ మాఫియా డ్రామాలో నేహా శెట్టి హీరోయిన్ కాగా యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చడం విశేషం.
టీజర్ లో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. గోదావరి ప్రాంతంలో పరస్పరం వైరుధ్య భావాలున్న ముఠాలు, రాజకీయ నాయకుల మధ్య జీవనోపాధి కోసం పోరాటం చేసే యువకులు. మంచిగా మాట్లాడ్డమే కాదు తేడా వస్తే నవ్వుతు నరం లాగేసే తత్వం వీరిది. స్వార్థ శక్తుల ఆటలో పావులుగా మారిన ఈ చదరంగంలో ఓ కుర్రాడు(విశ్వక్ సేన్) కత్తి పట్టాల్సి వస్తుంది. నాయకుడిగా మారే క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదురుకుంటాడు. అవేంటనేది తెరమీద చూడాలి. విశ్వక్ రఫ్, రస్టిక్ గా నటించాడు. కురచగా మార్చుకున్న హెయిర్ స్టయిల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది.
విజువల్స్ లో డెప్త్ ఉంది. మెయిన్ క్యాస్టింగ్ ని రివీల్ చేశారు. సాయికుమార్, నాజర్, గోపరాజు రమణ, అంజలితో పాటు నేహా శెట్టిని కూడా చూపించారు. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం ఎలివేట్ చేసింది. ఇలాంటి రా డ్రామాలు అరుదుగా వస్తున్న తరుణంలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి అంచనాలు పెంచేలా ఉంది. తుపాకుల మోత, ఆధిపత్య గొడవల మధ్య గోదావరి అందాలను దర్శకుడు కృష్ణ చైతన్య ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ డేట్ ని లాక్ చేయలేదు కానీ ఆ నెలలో రావడం పక్కానే.
This post was last modified on July 31, 2023 12:31 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…