ఎప్పుడో జనవరిలో పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం రాలేదని ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఆశలన్నీ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని మీదే ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా భారీ ఎత్తున గ్రాండ్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రో తాకిడి ఉన్నప్పటికీ దీనికి మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఎక్కువ వచ్చేలా ధర్మా ప్రొడక్షన్స్ వేసిన ప్లానింగ్ స్క్రీన్ల కేటాయింపులో స్పష్టంగా కనిపించింది. నిన్న ఒక్క రోజు పది కోట్లకు పైగా నెట్ వసూలైందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. వీకెండ్ బాగా పికప్ అవుతుందని అంటున్నారు. ఇంతకీ ఈ రాకీ రాణిల ప్రేమకథలో అంత విషయం ఉందా
రాకీ(రణ్వీర్ సింగ్)ది పెద్ద మిఠాయి బిజినెస్ ఉన్న పంజాబీ కుటుంబం. తాతయ్య పేరు కన్వెల్(ధర్మేంద్ర). ఆయనకు తన చిరకాల స్నేహితురాలు జమిని ఛటర్జీ(షబానా అజ్మీ)ని కలవాలనే కోరిక ఉంటుంది. ఇది తెలుసుకున్న రాకీ అది నెరవేర్చాలని బయలుదేరతాడు. ఆమె మనవరాలు జర్నలిస్ట్ రాణి(అలియా భట్)ని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. అయితే పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దీంతో ఈ జంట అవతలి వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వచ్చే చిక్కుముళ్లు, ఎమోషన్ల సమ్మేళనమే అసలు కథ.
దర్శకుడు కరణ్ జోహార్ చాలా గ్రాండియర్ గా తెరకెక్కించారు. అయితే సుదీర్ఘమైన నిడివితో పాటు ఇంటర్వెల్ కు ముందు వరకు కథా కథనాలు మరీ రొటీన్ గా వెళ్లడంతో మరీ స్పెషల్ గా ఏమీ అనిపించదు. సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్, మ్యూజిక్, భావోద్వేగాలు బాగానే కుదిరాయి. అయితే కభీ ఖుషి కభీ ఘం లాంటి నెరేషన్ స్టైల్ ఇష్టమైతే తప్ప సగటు ప్రేక్షకులకు ఈ రాకీ రాణి ప్రేమ్ కహాని అంత సులభంగా కనెక్ట్ అవ్వదు. కాకపోతే ఈ మధ్య వచ్చిన ఎన్నో బాలీవుడ్ డిజాస్టర్స్ తో పోలిస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. తీవ్రంగా నిరాశపరిచే ప్రమాదాన్ని తప్పించుకుంది అంతే.
This post was last modified on July 29, 2023 1:47 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…