తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త దర్శకులు తీసిన చిత్రాల్లో అతి పెద్ద సెన్సేషన్స్లో ఒకటిగా నిలిచే సినిమా గులాబి. టాలీవుడ్ గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన కృష్ణవంశీ.. ఈ చిత్రంతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ ప్రేమకథ అప్పట్లో యువతను ఒక ఊపు ఊపేసి బ్లాక్బస్టర్ అయింది. ఐతే ఇందులో హీరో పాత్రలో జేడీని కాకుండా ఇంకొకరిని ఊహించుకోవడం కష్టమే.
ఆ పాత్రకు అంత పర్ఫెక్ట్ అనిపించాడతను. ఐతే నిజానికి ముందు ఈ సినిమాకు హీరో జేడీ కాదట. వేరే హీరోతో సినిమాను మొదలుపెట్టి ఆపేశాడట కృష్ణవంశీ. అతనలా స్ట్రగులవుతున్న సమయంలో తనే అప్పటి స్టార్ హీరోల్లో ఒకడైన రాజశేఖర్ పేరు చెప్పి ఆయనకు కథ చెప్పించేందుకు కృష్ణవంశీని తీసుకెళ్లినట్లు జేడీ తాజాగా వెల్లడించాడు.
రాజశేఖర్ దగ్గరికి వెళ్లాక కృష్ణవంశీ వేరే కథ చెప్పాడని.. ఐతే తానే మధ్యలో ఆపి గులాబి కథ చెప్పమని బలవంతం చేశానని జేడీ తెలిపాడు. గులాబి కథ చెప్పగా.. హీరో పాత్ర నచ్చి రాజశేఖర్ తాను లీడ్ రోల్ చేస్తానని అన్నాడని.. అలాగే బ్రహ్మాజీ చేసిన పాత్రలో తనను నటించమని కూడా చెప్పాడని జేడీ వెల్లడించాడు.
కానీ కథ చెప్పి బయటికి వచ్చాక ఈ కథను తాను హీరోగా అయితేనే చేస్తానని కృష్ణవంశీ పట్టుబట్టాడని.. అలా తాను ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశానని జేడీ తెలిపాడు. తాను ముఖ్య పాత్ర పోషించిన వెబ్ సిరీస్ దయా రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో జేడీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనను హీరోగా పరిచయం చేసి మంచి స్థాయికి వెళ్లడానికి కారణమైంది కృష్ణవంశీ అని, అందుకే తన డెబ్యూ వెబ్ సిరీస్ ఈవెంట్కు కృష్ణవంశీని పట్టుబట్టి పిలిపించానని జేడీ తెలిపాడు.
This post was last modified on July 17, 2023 10:43 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…