తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త దర్శకులు తీసిన చిత్రాల్లో అతి పెద్ద సెన్సేషన్స్లో ఒకటిగా నిలిచే సినిమా గులాబి. టాలీవుడ్ గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన కృష్ణవంశీ.. ఈ చిత్రంతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ ప్రేమకథ అప్పట్లో యువతను ఒక ఊపు ఊపేసి బ్లాక్బస్టర్ అయింది. ఐతే ఇందులో హీరో పాత్రలో జేడీని కాకుండా ఇంకొకరిని ఊహించుకోవడం కష్టమే.
ఆ పాత్రకు అంత పర్ఫెక్ట్ అనిపించాడతను. ఐతే నిజానికి ముందు ఈ సినిమాకు హీరో జేడీ కాదట. వేరే హీరోతో సినిమాను మొదలుపెట్టి ఆపేశాడట కృష్ణవంశీ. అతనలా స్ట్రగులవుతున్న సమయంలో తనే అప్పటి స్టార్ హీరోల్లో ఒకడైన రాజశేఖర్ పేరు చెప్పి ఆయనకు కథ చెప్పించేందుకు కృష్ణవంశీని తీసుకెళ్లినట్లు జేడీ తాజాగా వెల్లడించాడు.
రాజశేఖర్ దగ్గరికి వెళ్లాక కృష్ణవంశీ వేరే కథ చెప్పాడని.. ఐతే తానే మధ్యలో ఆపి గులాబి కథ చెప్పమని బలవంతం చేశానని జేడీ తెలిపాడు. గులాబి కథ చెప్పగా.. హీరో పాత్ర నచ్చి రాజశేఖర్ తాను లీడ్ రోల్ చేస్తానని అన్నాడని.. అలాగే బ్రహ్మాజీ చేసిన పాత్రలో తనను నటించమని కూడా చెప్పాడని జేడీ వెల్లడించాడు.
కానీ కథ చెప్పి బయటికి వచ్చాక ఈ కథను తాను హీరోగా అయితేనే చేస్తానని కృష్ణవంశీ పట్టుబట్టాడని.. అలా తాను ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశానని జేడీ తెలిపాడు. తాను ముఖ్య పాత్ర పోషించిన వెబ్ సిరీస్ దయా రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో జేడీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనను హీరోగా పరిచయం చేసి మంచి స్థాయికి వెళ్లడానికి కారణమైంది కృష్ణవంశీ అని, అందుకే తన డెబ్యూ వెబ్ సిరీస్ ఈవెంట్కు కృష్ణవంశీని పట్టుబట్టి పిలిపించానని జేడీ తెలిపాడు.
This post was last modified on July 17, 2023 10:43 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…