సోలో హీరోగా విడుదలయ్యింది ఒక్క సినిమానే అయినప్పటికీ శ్రీకాంత్ కొడుకు రోషన్ డిమాండ్ మాములుగా లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన నిర్మల కాన్వెంట్, కథానాయకుడిగా మేకప్ వేసుకున్న పెళ్లి సందD రెండూ విజయం సాధించలేదు. అయితేనేం మైత్రి లాంటి పెద్ద బ్యానర్లు తనతో ప్రాజెక్టులను లైన్ లో పెట్టాయి. తాజాగా అదిరిపోయే రేంజ్ లో ఓ పెద్ద ఆఫర్ పట్టేశాడు. మోహన్ లాల్ హీరోగా మలయాళం, తెలుగు బైలింగ్వల్ గా ఒకేసారి తెరకెక్కబోతున్న వృషభలో కీలకమైన కొడుకు క్యారెక్టర్ పట్టేశాడు. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు.
ఇది ఫాదర్ ఎమోషన్ మీద నడిచే కథగా చాలా గొప్పగా ఉంటుందని మల్లువుడ్ టాక్. నటి సిమ్రాన్ తల్లిగా కనిపించనుంది. కెజిఎఫ్ లో గరుడగా భయపెట్టిన రామచంద్రరాజుని ఒక విలన్ గా ఎంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఈ నెలాఖరు నుంచి లండన్ లో షూటింగ్ మొదలుపెడతారు. వందల కోట్ల బడ్జెట్ అంటున్నారు కానీ ఎంతనేది బయటికి చెప్పడం లేదు. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న వృషభని ఎపిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పేర్కొంటున్నారు. అయితే పీరియాడిక్ డ్రామానా లేక వర్తమానమా అనేది మాత్రం చెప్పడం లేదు.
జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మోహన్ లాల్ ఆ తర్వాత మళ్ళీ తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయలేదు.ఇప్పుడు రోషన్ కు ఆ ఛాన్స్ దక్కింది. వృషభలో కంప్లీట్ యాక్టర్ తో సమానంగా సాగే క్యారెక్టర్ కాబట్టే శ్రీకాంత్ ఒప్పుకున్నట్టుగా తెలిసింది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు రావడం అరుదు. అందులోనూ అంత సీనియర్ మోస్ట్ హీరోతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు. ఎలాగూ లేలేత టీనేజ్ లోనే నాగార్జునతో పాఠాలు చెప్పించుకున్న రోషన్ ఇప్పుడు సెట్స్ లో మోహన్ లాల్ తో కొత్త అనుభూతి దక్కించుకోబోతున్నాడు
This post was last modified on July 13, 2023 1:50 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…