ఇంతకుముందులా దక్షిణాది నటీనటులను, టెక్నీషియన్లను బాలీవుడ్ వాళ్లు తక్కువగా చూసే పరిస్థితే లేదు. బాలీవుడ్ మూవీస్ను దాటి దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుండటంతో వాళ్లు మన వాళ్ల ముందు తగ్గిపోతున్నారు. దక్షిణాది నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి, ఇక్కడి టెక్నీషియన్లతో పని చేయడానికి వాళ్లెంతో ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీతో ‘జవాన్’ సినిమా చేశాడు. ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ తరహా ప్రివ్యూ ఆ అంచనాలను ఇంకా పెంచింది. ఇప్పటిదాకా తాను తీసిన సినిమాలన్నింటినీ తలదన్నేలా అట్లీ ఈ చిత్రాన్ని రూపొందించాడని.. బాక్సాఫీస్ దగ్గర ‘జవాన్’ వసూళ్ల మోత మోగించడం ఖాయమని ప్రివ్యూ చూస్తే అర్థమైంది. అంత యాక్షన్ ప్యాక్డ్గా ట్రైలర్ కనిపించింది.
ఇక ట్రైలర్ మొత్తం చూస్తే షారుఖ్ ఖాన్ నటించాడు కాబట్టి పేరుకు ఇది బాలీవుడ్ మూవీ కానీ.. ఎటు చూసినా తమిళ టచ్యే కనిపిస్తోంది. ఆ ఇండస్ట్రీ నుంచి ఎదిగిన నటీనటులు టెక్నీషియన్లే ఈ సినిమాకు చాలా వరకు పని చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన నయనతార మలయాళీనే అయినా ఆమె హోమ్ ఇండస్ట్రీ కోలీవుడ్డే.
ముఖ్య పాత్ర (బహుశా విలన్ అయి ఉండొచ్చు) పోషించిన విజయ్ సేతుపతి తమిళుడే. మరో ముఖ్య పాత్ర చేసిన ప్రియమణి కూడా కథానాయికగా ఎదిగింది తమిళం నుంచే. ఇంకా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్.. ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించిన జీకే విష్ణు ఇద్దరూ కూడా తమిళులే. రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా అందరూ తమిళులే ఉన్నట్లున్నారు. మిగతా చిన్న చిన్న టెక్నీషియన్లందరూ కూడా తనకు కంఫర్ట్ అనిపించే తమిళులనే పెట్టుకున్నట్లున్నాడు అట్లీ. ఇలా ఒక బాలీవుడ్ మూవీలో తమిళులు ఇంతగా డామినేట్ చేయడం.. అది కూడా షారుఖ్ మూవీలో కావడం విశేషమే.
This post was last modified on July 11, 2023 12:18 am
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…