టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఆమె అభిమానుల్లో కొంత ఆందోళనకు కారణమైంది. గత ఏడాది మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడి తర్వాత కొంచెం కోలుకున్న సమంత.. మళ్లీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందని.. ఆమెకు విశ్రాంతితో పాటు నిరవధిక చికిత్స అవసరం కావడంతో ఆరు నెలల నుంచి ఏడాది వరకు నటనకు దూరం కాబోతోందని ఈ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి.
సమంత వైపు నుంచి ఈ విషయంలో ఖండనలు కూడా ఏమీ లేవు. దీంతో ఈ ప్రచారం నిజమే కావచ్చని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ వార్తలను మరింత బలపరుస్తూ సమంత తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్టు పెట్టింది. ‘‘మరో మూడు రోజులు మాత్రమే ఉండేది. ఆరు నెలలు కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన అవసరముంది’’ అని సామ్ పేర్కొంది.
ఇంకో మూడు రోజులు మాత్రమే కారవాన్లో ఉండేది అని సమంత అందంటే.. ఆమె కొంత కాలం షూటింగ్ల నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని ఐదారు నెలల నుంచి షూటింగ్ల్లో పాల్గొంటోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాను పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో సమంత పని పూర్తయినట్లే కనిపిస్తోంది.
దీంతో సామ్ కొత్తగా ఏ ప్రాజెక్టులూ ఒప్పుకోవట్లేదు. అంతకుముందు తీసుకున్న అడ్వాన్సులను కూడా ఆమె వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక పూర్తిగా చికిత్స, విశ్రాంతికే సమయం కేటాయించి.. మళ్లీ మునుపటి స్థితికి చేరాకే ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఐతే మరీ గ్యాప్ ఎక్కువ అయితే మాత్రం సమంతను అందరూ మరిచిపోయి ఆమె కెరీర్ ముగింపు దశకు చేరుకుంటుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నప్పటికీ అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో తన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు.
This post was last modified on July 10, 2023 11:58 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…