అవసరం లేని గతాన్ని తవ్వడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. లేదూ ఏదైనా ప్రయోజనం ఉంటుందంటే ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. సీనియర్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గురించి చేసిన కామెంట్స్ బాగానే రచ్చ చేశాయి. తాజాగా ఎప్పుడో జరిగిన సంఘటనని దేనికో ముడిపెట్టబోయి సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు పరిశ్రమకు సంబంధించిన ఇష్యూస్ లో ఎందుకు కనిపించరన్న ప్రశ్నకు ఓ వింత సమాధానం ఇచ్చారు.
2004లో అర్జున్ సినిమా పైరసీకి గురైనప్పుడు మహేష్ స్వయంగా దాన్ని పట్టుకున్నా సరే ఎవరూ అండగా నిలబడలేదని, పవన్ మాట అన్నారు కానీ వచ్చారో లేదో గుర్తు లేదని సెలవిచ్చారు. ఇంత నిస్సహాయతను అనుభవించాడు కాబట్టే అప్పటి నుంచి మహేష్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారని అన్నారు. నిజానికి అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు సుమంత్, సురేష్ బాబు, నాగబాబు, అశ్వినీదత్, బూరుగుపల్లి శివరామకృష్ణ, నటుడు అశోక్ కుమార్ తదితరులంతా ప్రెస్ మీట్ లో పాల్గొని మరీ సంఘీభావం తెలిపారు. ఆ ఫోటో కూడా ఫ్యాన్స్ బయటికి తీశారు.
అదంతా మర్చిపోయి మహేష్ సినిమాకు అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీలో ఏ మగాడు బయటికి రాలేదనే రీతిలో తమ్మారెడ్డి మాట్లాడ్డం విమర్శలకు దారి తీసింది. ఆ మాటకొస్తే అత్తారింటికి దారేది రిలీజ్ కు ముందే ఆన్ లైన్ హెచ్డి ప్రింట్ వచ్చినప్పుడు ఎవరేం చేయలేకపోయారు. బాహుబలిని ఎక్కడో మహారాష్ట్రలో పైరసీ చేస్తే అక్కడిదాకా వెళ్లిన రాజమౌళి, అల్లుఅరవింద్ థియేటర్ ని సీజ్ చేయించగలిగారు కానీ తర్వాత ఆ భూతాన్ని ఆపలేదు. ఇది నిరంతర సమస్య. ఇప్పుడూ ఉంది. ఏదో ఫ్లో వెళ్ళిపోతోందని పెద్దాయన అనేశారు కానీ అభిమానులు ఎందుకు ఊరుకుంటారు. కౌంటర్లు ఇచ్చేశారు
This post was last modified on July 4, 2023 2:29 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…