ఈ మధ్య కాలంలో పొన్నియిన్ సెల్వన్ 2 తప్ప పెద్దగా బజ్ ఉన్న కోలీవుడ్ సినిమాలేవీ రాలేదు. పోర్ తొజిల్ మౌత్ టాక్ తో హిట్టయ్యింది. అయితే పోస్టర్ల దశ నుంచే విపరీతమైన ఆసక్తి రేపి, క్రేజీ కాంబినేషన్ తో రూపొందిన మామన్నన్ మీద ఇక్కడి మూవీ లవర్స్ లోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఉదయ నిధి స్టాలిన్ కి టాలీవుడ్ మార్కెట్ లేకపోవడంతో డబ్బింగ్ లాంటి సాహసాలు చేయలేదు. కీర్తి సురేష్, ఫహద్ ఫాసిల్ తో పాటు చాలా సీరియస్ రోల్ పోషించిన కమెడియన్ వడివేలు దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ప్రధాన బలం. మొన్న శుక్రవారం రిలీజయ్యింది
కథేంటో చూద్దాం. కాశీపురం అనే ఊరికి మామన్నన్|(వడివేలు)ఎమ్మెల్యే. వెనుకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్)అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ నడిపే లీల(కీర్తిసురేష్)కు రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహద్ ఫాసిల్)అన్నయ్య వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో అదివీరన్, మామన్నన్ లు కలిసి రత్నవేల్ కు ఎదురు తిరిగి అతని పతనం కోసం పని చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో జరిగే రాజకీయ పరిణామాలు, అనూహ్య సంఘటనలు తెరమీద చూస్తేనే కిక్కు
పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన మారి సెల్వరాజ్ ఇందులోనూ పేద వర్సెస్ ధనిక కాన్సెప్ట్ ని తీసుకున్నాడు కానీ దానికి పొలిటికల్ టచ్ ఎక్కువ జోడించడంతో సెకండ్ హాఫ్ కాస్తా రొటీన్ ఫ్లేవర్ లోకి వెళ్లిపోయింది. పాత్రల పరిచయాలు, కాంఫ్లిక్ట్ పాయింట్, అదివీరన్ ధైర్యంగా రత్నవేల్ ని కొట్టే ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా వచ్చినప్పటికీ ద్వితీయార్థం నెరేషన్ నిరాశ పరుస్తుంది. హై మూమెంట్స్ తగ్గిపోయాయి. ఏ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు అద్భుతంగా కుదిరాయి. వడివేలు, ఫహద్ ఫాసిల్ నటన ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. వీళ్ళ కోసం మాత్రమే మామన్నన్ చూడొచ్చు.
This post was last modified on June 30, 2023 11:59 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…