సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న వార్త నిజమే అనిపిస్తోంది. తమన్ మీద వేటు పడ్డట్లు వచ్చిన వార్తలను ఖండించిన చిత్ర బృందం.. పూజా విషయంలో గప్ చుప్గా ఉండటం.. పూజా వైపు నుంచి కూడా సౌండ్ లేకపోవడంతో ఈ వార్త నిజమే అని తేలిపోయింది.
ఈ చిత్రంలో రెండో హీరోయిన్గా ఎంపికైన శ్రీలీలనే లీడ్ హీరోయిన్గా ప్రమోట్ చేసినట్లు తెలుస్తుండగా.. శ్రీలీల కోసం అనుకన్న పాత్రను ఇప్పుడు ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ కూడా మొదలైన నేపథ్యంలో ఈ విషయంలో ఆలస్యం చేసే పరిస్థితి లేదు. ఈ మధ్య త్రివిక్రమ్కు ఫేవరెట్ హీరోయిన్గా మారిన మలయాళ భామ సంయుక్త పేరు బలంగా వినిపించింది కానీ.. ఆమెను కాకుండా ఎవరూ ఊహించిన ఓ అమ్మాయిని ఈ పాత్రకు ఎంచుకున్నట్లు సమాచారం.
సుశాంత్ మూవీ ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని మహేష్ సరసన రెండో కథానాయికగా ఎంచుకున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒడ్డూ పొడవు బాగా ఉన్న మీనాక్షి మహేష్ పక్కన బాగా సూటవుతుందనడంలో సందేహం లేదు. ఆమెకిది బంపరాఫర్ అనే చెప్పాలి.
సుశాంత్ లాంటి చిన్న హీరో పక్కన కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి, అడివి శేష్తో హిట్-2లో నటించింది. ఇప్పుడు ఒక్కసారిగా మహేష్ లాంటి టాప్ స్టార్ సినిమా అంటే పెద్ద ప్రమోషన్ వచ్చినట్లే. ఈ విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.
This post was last modified on June 24, 2023 8:24 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…