సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న వార్త నిజమే అనిపిస్తోంది. తమన్ మీద వేటు పడ్డట్లు వచ్చిన వార్తలను ఖండించిన చిత్ర బృందం.. పూజా విషయంలో గప్ చుప్గా ఉండటం.. పూజా వైపు నుంచి కూడా సౌండ్ లేకపోవడంతో ఈ వార్త నిజమే అని తేలిపోయింది.
ఈ చిత్రంలో రెండో హీరోయిన్గా ఎంపికైన శ్రీలీలనే లీడ్ హీరోయిన్గా ప్రమోట్ చేసినట్లు తెలుస్తుండగా.. శ్రీలీల కోసం అనుకన్న పాత్రను ఇప్పుడు ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ కూడా మొదలైన నేపథ్యంలో ఈ విషయంలో ఆలస్యం చేసే పరిస్థితి లేదు. ఈ మధ్య త్రివిక్రమ్కు ఫేవరెట్ హీరోయిన్గా మారిన మలయాళ భామ సంయుక్త పేరు బలంగా వినిపించింది కానీ.. ఆమెను కాకుండా ఎవరూ ఊహించిన ఓ అమ్మాయిని ఈ పాత్రకు ఎంచుకున్నట్లు సమాచారం.
సుశాంత్ మూవీ ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని మహేష్ సరసన రెండో కథానాయికగా ఎంచుకున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒడ్డూ పొడవు బాగా ఉన్న మీనాక్షి మహేష్ పక్కన బాగా సూటవుతుందనడంలో సందేహం లేదు. ఆమెకిది బంపరాఫర్ అనే చెప్పాలి.
సుశాంత్ లాంటి చిన్న హీరో పక్కన కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి, అడివి శేష్తో హిట్-2లో నటించింది. ఇప్పుడు ఒక్కసారిగా మహేష్ లాంటి టాప్ స్టార్ సినిమా అంటే పెద్ద ప్రమోషన్ వచ్చినట్లే. ఈ విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.
This post was last modified on June 24, 2023 8:24 am
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…