సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న వార్త నిజమే అనిపిస్తోంది. తమన్ మీద వేటు పడ్డట్లు వచ్చిన వార్తలను ఖండించిన చిత్ర బృందం.. పూజా విషయంలో గప్ చుప్గా ఉండటం.. పూజా వైపు నుంచి కూడా సౌండ్ లేకపోవడంతో ఈ వార్త నిజమే అని తేలిపోయింది.
ఈ చిత్రంలో రెండో హీరోయిన్గా ఎంపికైన శ్రీలీలనే లీడ్ హీరోయిన్గా ప్రమోట్ చేసినట్లు తెలుస్తుండగా.. శ్రీలీల కోసం అనుకన్న పాత్రను ఇప్పుడు ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ కూడా మొదలైన నేపథ్యంలో ఈ విషయంలో ఆలస్యం చేసే పరిస్థితి లేదు. ఈ మధ్య త్రివిక్రమ్కు ఫేవరెట్ హీరోయిన్గా మారిన మలయాళ భామ సంయుక్త పేరు బలంగా వినిపించింది కానీ.. ఆమెను కాకుండా ఎవరూ ఊహించిన ఓ అమ్మాయిని ఈ పాత్రకు ఎంచుకున్నట్లు సమాచారం.
సుశాంత్ మూవీ ఇచట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని మహేష్ సరసన రెండో కథానాయికగా ఎంచుకున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒడ్డూ పొడవు బాగా ఉన్న మీనాక్షి మహేష్ పక్కన బాగా సూటవుతుందనడంలో సందేహం లేదు. ఆమెకిది బంపరాఫర్ అనే చెప్పాలి.
సుశాంత్ లాంటి చిన్న హీరో పక్కన కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి, అడివి శేష్తో హిట్-2లో నటించింది. ఇప్పుడు ఒక్కసారిగా మహేష్ లాంటి టాప్ స్టార్ సినిమా అంటే పెద్ద ప్రమోషన్ వచ్చినట్లే. ఈ విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.
This post was last modified on June 24, 2023 8:24 am
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…