గత ఏడాది డీజే టిల్లు రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుని ఒక్కసారిగా యూత్ లో ఫాలోయింగ్ పెంచేసుకున్న సిద్దు జొన్నలగడ్డ దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ తప్ప ఇంకో కమిట్ మెంట్ అధికారికంగా ఇవ్వలేదు. మరీ ఇంత గ్యాప్ తీసుకున్నా ఇబ్బందే. అసలే కెరీర్ ఇన్నింగ్స్ చాలా ఆలస్యంగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సరైన ప్లానింగ్ అవసరం. ఇప్పుడు తన చేతిలో మూడు ఆప్షన్లున్నాయి. మొదటిది చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కబోయే మూవీ. అందులో శ్రీలీల జోడిగా సిద్దుని లాక్ చేసినట్టుగా వచ్చిన వార్త ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.
నందిని రెడ్డితో ఒక ప్రాజెక్టుకి సిద్దు ఇంతకు ముందే ఓకే చెప్పాడు. అయితే అన్నీ మంచి శకునములే ఫలితం చూశాక స్క్రిప్ట్ ని మరోసారి జాగ్రత్తగా వడబోసే పని పెట్టుకున్నారట. దీని వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కామెడీ తగ్గించి మరీ ఓవర్ ఎమోషనల్ గా వెళ్లిపోతున్న నందిని రెడ్డిని తన పాత ఎంటర్ టైన్మెంట్ స్టైల్ కి రమ్మని సిద్దు పర్సనల్ గా అడిగినట్టు వినికిడి. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తర్వాత చాలా విరామం తీసుకుని కీడా కోలాతో మళ్ళీ డైరెక్టర్ టోపీ పెట్టుకున్న తరుణ్ భాస్కర్ కి సిద్దు ఓకే చెప్పినట్టు తాజా అప్డేట్.
కీడా కోలా రిలీజ్ వరకు తాను నెక్స్ట్ ఎవరితో చేసేది తరుణ్ భాస్కర్ గుట్టుగా ఉంచాలనుకున్నాడు కానీ లీకైతే జరిగిపోయింది. లైనప్ చూస్తే సిద్దు జొన్నలగడ్డ చేయబోయే ముగ్గురు దర్శకులూ సీనియర్లే. టిల్లులో చూసిన బాడీ లాంగ్వేజ్ టైమింగ్ కి బాగా కనెక్ట్ అయిపోయిన యువతను మెప్పించాలంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. సిద్దు మాత్రం బయట ఎక్కడ కనిపించినా, ఇతర హీరోల సినిమాల ప్రమోషన్ల పాల్గొంటున్నా తన కొత్త కమిట్ మెంట్స్ గురించి మాత్రం చెప్పడం లేదు. టిల్లు స్క్వేర్ వచ్చాకే ఓపెనయ్యేలా ఉన్నాడు. చూద్దాం
This post was last modified on June 23, 2023 8:08 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…