గత ఏడాది డీజే టిల్లు రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుని ఒక్కసారిగా యూత్ లో ఫాలోయింగ్ పెంచేసుకున్న సిద్దు జొన్నలగడ్డ దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ తప్ప ఇంకో కమిట్ మెంట్ అధికారికంగా ఇవ్వలేదు. మరీ ఇంత గ్యాప్ తీసుకున్నా ఇబ్బందే. అసలే కెరీర్ ఇన్నింగ్స్ చాలా ఆలస్యంగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సరైన ప్లానింగ్ అవసరం. ఇప్పుడు తన చేతిలో మూడు ఆప్షన్లున్నాయి. మొదటిది చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కబోయే మూవీ. అందులో శ్రీలీల జోడిగా సిద్దుని లాక్ చేసినట్టుగా వచ్చిన వార్త ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.
నందిని రెడ్డితో ఒక ప్రాజెక్టుకి సిద్దు ఇంతకు ముందే ఓకే చెప్పాడు. అయితే అన్నీ మంచి శకునములే ఫలితం చూశాక స్క్రిప్ట్ ని మరోసారి జాగ్రత్తగా వడబోసే పని పెట్టుకున్నారట. దీని వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కామెడీ తగ్గించి మరీ ఓవర్ ఎమోషనల్ గా వెళ్లిపోతున్న నందిని రెడ్డిని తన పాత ఎంటర్ టైన్మెంట్ స్టైల్ కి రమ్మని సిద్దు పర్సనల్ గా అడిగినట్టు వినికిడి. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తర్వాత చాలా విరామం తీసుకుని కీడా కోలాతో మళ్ళీ డైరెక్టర్ టోపీ పెట్టుకున్న తరుణ్ భాస్కర్ కి సిద్దు ఓకే చెప్పినట్టు తాజా అప్డేట్.
కీడా కోలా రిలీజ్ వరకు తాను నెక్స్ట్ ఎవరితో చేసేది తరుణ్ భాస్కర్ గుట్టుగా ఉంచాలనుకున్నాడు కానీ లీకైతే జరిగిపోయింది. లైనప్ చూస్తే సిద్దు జొన్నలగడ్డ చేయబోయే ముగ్గురు దర్శకులూ సీనియర్లే. టిల్లులో చూసిన బాడీ లాంగ్వేజ్ టైమింగ్ కి బాగా కనెక్ట్ అయిపోయిన యువతను మెప్పించాలంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. సిద్దు మాత్రం బయట ఎక్కడ కనిపించినా, ఇతర హీరోల సినిమాల ప్రమోషన్ల పాల్గొంటున్నా తన కొత్త కమిట్ మెంట్స్ గురించి మాత్రం చెప్పడం లేదు. టిల్లు స్క్వేర్ వచ్చాకే ఓపెనయ్యేలా ఉన్నాడు. చూద్దాం
This post was last modified on June 23, 2023 8:08 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…