కెరీర్ ఓ మోస్తరుగా నడుస్తుంటే హీరోయిన్లు పెళ్లి మాటే ఎత్తరు. మీడియా వాళ్లు అడిగినా కూడా పెళ్లి సంగతి దాట వేస్తారు. అలాంటిది వేరే హీరోయిన్లెవరైనా పెళ్లి చేసుకోవాలని ఉంది అని తమకు తాముగా అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిది పురుషాధిక్యతను ఎప్పుడూ ప్రశ్నిస్తూ.. హీరోలకు తనేం తక్కువ అన్నట్లుగా వ్యవహరించే కంగనా రనౌత్ తనకు తానుగా పెళ్లి చేసుకోవాలని ఉంది అని మీడియాతో అంటే షాకవ్వాల్సిందే.
ఆమె తాజాగా ఈ వ్యాఖ్యలే చేసి ఆశ్చర్యపరిచింది. ప్రతి దానికీ ఒక సమయం అని ఉంటుంది. నా జీవితంలో అలాంటి సమయం వచ్చినపుడు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశగా ఉంది. సరైన సమయంలోనే అది జరుగుతుందని ఆశిస్తున్నా అని కంగనా ఒక ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించింది.
రెండేళ్ల కిందటే కంగనా ఓ సందర్భంలో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని.. సమయం వచ్చినపుడు అందరికీ తనను పరిచయం చేస్తానని ఆమె అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉందని ఆమె అప్పుడు వ్యాఖ్యానించింది. కానీ తర్వాత దాని ఊసు ఎత్తలేదు.
ఐతే ఇప్పుడు తన నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం టీకూ వెడ్స్ షేరు ప్రమోషన్లలో భాగంగా మీడియా వాళ్లు పెళ్లి గురించి ప్రస్తావిస్తే.. దాని పట్ల ఆసక్తిని ప్రదర్శించింది కంగనా. ఆమె మాటల్ని బట్టి చూస్తే త్వరలోనే పెళ్లి కూతురు అవుతుందేమో చూడాలి. ఇక కెరీర్ విషయానికి వస్తే కంగనా.. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి దర్శకురాలు కూడా కంగనానే కావడం విశేషం.
This post was last modified on June 17, 2023 9:50 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…