యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కొత్త చిత్రం ‘స్పై’పై మంచి అంచనాలే ఉన్నాయి ప్రేక్షకుల్లో. దేశభక్తితో ముడిపడ్డ ఈ కథ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కనెక్టవుతుందని.. ‘కార్తికేయ-2’ స్థాయిలో ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 29న రిలీజ్ చేయాలని చాన్నాళ్ల కిందటే నిర్ణయించారు. ఆ దిశగానే సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు.
కానీ ఉన్నట్లుండి టీంలో రిలీజ్ విషయమై భేదాభిప్రాయాలు నెలకొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను సమయానికి పూర్తి చేసి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం తేలిక కాదని హీరో సిద్దార్థ్ అభిప్రాయపడుతుంటే.. నిర్మాత, కథకుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం జూన్ 29 రిలీజ్కే పట్టుబడుతున్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ఇటీవల సినిమా నుంచి ఒక పాటను నిర్మాణ సంస్థ రిలీజ్ చేయగా.. నిఖిల్ దాని గురించి కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు.
దీంతో హీరో, నిర్మాత మధ్య గొడవలు నిజమే అన్న సందేహాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కావడం కష్టమే అనుకున్నారు. కానీ నిఖిల్కు నిర్మాత సర్దిచెప్పాడా.. లేక ఆయన మొండిగా రిలీజ్కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడా అని తెలియదు కానీ.. జూన్ 29నే సినిమా విడుదలవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని యుఎస్లో రిలీజ్ చేస్తున్న ప్రత్యంగిర సినిమాస్.. జూన్ 28న యుఎస్ ప్రిమియర్స్ కన్ఫమ్ చేస్తూ ట్విట్టర్లో కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టింది. రిలీజ్ డౌట్ ఉంటే మూడు రెండు వారాల ముందు ఇలా కౌంట్ డౌన్ ఇవ్వరు. కాబట్టి 29నే సినిమా వస్తున్నట్లే భావించాలి. మరి హీరో సహకారం లేకుండా ఇలాంటి క్రేజీ సినిమాను నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకోవడం అంటే కష్టమే. కాబట్టి నిఖిల్ను ఒప్పించి.. మెప్పించి సినిమాను రిలీజ్కు తీసుకెళ్లాలి. మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలి.
This post was last modified on June 13, 2023 7:51 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…