ఎన్నో ఆశలు పెట్టుకుని మూడేళ్ళ విలువైన కాలాన్ని ఖర్చు పెట్టుకుని మరీ చేసిన హిందీ ఛత్రపతి రీమేక్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కి ఊహించని చేదు ఫలితాన్ని ఇచ్చింది. యావరేజ్ అన్నా అంత ఫీలింగ్ ఉండేది కాదు కానీ మొదటి రోజే నార్త్ ఆడియన్స్ మొహమాటం లేకుండా తిరస్కరించడం బాధ పెట్టి ఉంటుంది. తనకు టాలీవుడ్డే కరెక్టని గుర్తించిన సాయిశ్రీనివాస్ ఆలస్యం చేయకుండా వెంటనే తెలుగు సినిమా మొదలుపెట్టాడు. భీమ్లా నాయక్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న దర్శకుడు సాగర్ కె చంద్ర పక్కా యాక్షన్ కమర్షియల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు.
దీని పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. దీనికి టైసన్ నాయుడు టైటిల్ పరిశీలనలో ఉంది. ఫిలిం ఛాంబర్ లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఇది పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. బెల్లం హీరో ఇప్పటిదాకా రెండు సార్లు ఖాకీ యునిఫార్మ్ వేసుకున్నాడు. మొదటిసారి కవచంలో కనిపిస్తే ఫెయిల్యూర్ ఎదురయ్యింది. తర్వాత రాక్షసుడు రూపంలో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పోలీస్ దుస్తులు వేసుకుంటున్నాడు. అయితే వాటిలోలా ఈ క్యారెక్టర్ ఓవర్ సీరియస్ గా ఉండదట.
మంచి మాస్ అంశాలతో గబ్బర్ సింగ్, పటాస్ తరహా క్యారెక్టరైజేషన్ ని సాగర్ చంద్ర డిజైన్ చేసినట్టు తెలిసింది. ఎలాగూ భీమ్లాలో పవన్ ని హ్యాండిల్ చేసిన అనుభవం వచ్చేసింది. అంత పెద్ద స్టార్ ని ఆ స్థాయిలో ప్రెజెంట్ చేయగలిగినప్పుడు సాయిశ్రీనివాస్ విషయంలో ఇబ్బంది ఏముంటుంది. టైసన్ నాయుడు కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు. కాకపోతే ఇంకా హీరోయిన్ లాక్ చేయలేదు. శ్రీలీల కోసం ట్రై చేశారట కానీ డేట్ల సమస్య వల్ల డ్రాప్ అయ్యారట. టాలీవుడ్ లో ఆప్షన్స్ తగ్గిపోవడంతో నార్త్ భామని లేదా కొత్తమ్మాయిని పరిచయం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం
This post was last modified on June 13, 2023 6:25 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…