ఎన్నో ఆశలు పెట్టుకుని మూడేళ్ళ విలువైన కాలాన్ని ఖర్చు పెట్టుకుని మరీ చేసిన హిందీ ఛత్రపతి రీమేక్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కి ఊహించని చేదు ఫలితాన్ని ఇచ్చింది. యావరేజ్ అన్నా అంత ఫీలింగ్ ఉండేది కాదు కానీ మొదటి రోజే నార్త్ ఆడియన్స్ మొహమాటం లేకుండా తిరస్కరించడం బాధ పెట్టి ఉంటుంది. తనకు టాలీవుడ్డే కరెక్టని గుర్తించిన సాయిశ్రీనివాస్ ఆలస్యం చేయకుండా వెంటనే తెలుగు సినిమా మొదలుపెట్టాడు. భీమ్లా నాయక్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న దర్శకుడు సాగర్ కె చంద్ర పక్కా యాక్షన్ కమర్షియల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు.
దీని పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. దీనికి టైసన్ నాయుడు టైటిల్ పరిశీలనలో ఉంది. ఫిలిం ఛాంబర్ లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారని ఇన్ సైడ్ టాక్. ఇది పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. బెల్లం హీరో ఇప్పటిదాకా రెండు సార్లు ఖాకీ యునిఫార్మ్ వేసుకున్నాడు. మొదటిసారి కవచంలో కనిపిస్తే ఫెయిల్యూర్ ఎదురయ్యింది. తర్వాత రాక్షసుడు రూపంలో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పోలీస్ దుస్తులు వేసుకుంటున్నాడు. అయితే వాటిలోలా ఈ క్యారెక్టర్ ఓవర్ సీరియస్ గా ఉండదట.
మంచి మాస్ అంశాలతో గబ్బర్ సింగ్, పటాస్ తరహా క్యారెక్టరైజేషన్ ని సాగర్ చంద్ర డిజైన్ చేసినట్టు తెలిసింది. ఎలాగూ భీమ్లాలో పవన్ ని హ్యాండిల్ చేసిన అనుభవం వచ్చేసింది. అంత పెద్ద స్టార్ ని ఆ స్థాయిలో ప్రెజెంట్ చేయగలిగినప్పుడు సాయిశ్రీనివాస్ విషయంలో ఇబ్బంది ఏముంటుంది. టైసన్ నాయుడు కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు. కాకపోతే ఇంకా హీరోయిన్ లాక్ చేయలేదు. శ్రీలీల కోసం ట్రై చేశారట కానీ డేట్ల సమస్య వల్ల డ్రాప్ అయ్యారట. టాలీవుడ్ లో ఆప్షన్స్ తగ్గిపోవడంతో నార్త్ భామని లేదా కొత్తమ్మాయిని పరిచయం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…