Movie News

తెలంగాణ టికెట్ల పెంపు – కండీషన్స్ అప్లై

నిముషాలు గంటల్లా మార్చుకుని తెలుగు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అనుమతులు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేశాయి. అయితే ముందే ఊహించినట్టు కొన్ని మెలికలైతే పెట్టారు. 50 రూపాయల పెంపుని కేవలం సింగల్ స్క్రీన్లకు పరిమితం చేస్తూ జిఓ జారీ చేసింది. అంటే మల్టీప్లెక్సులకు గరిష్ట ధర 295 ఉంటుంది. దీనికి త్రీడి ఛార్జీలు ప్లస్. దీన్ని బట్టి ఆర్ఆర్ఆర్ లాగా విపరీత రేట్లకు ఆస్కారం లేకపోవడం నైజామ్ ప్రేక్షకులకు ఒక రకంగా శుభవార్తే. సింగల్ హాళ్లకు సైతం 225 మించే ఛాన్స్ లేదు. ఏ క్షణమైనా బుక్ మై షో, పేటిఎంలో సేల్స్ మొదలుపెడతారు

మరో శుభవార్త ఏంటంటే ఫస్ట్ డే ఆరో ఆటకు పర్మిషన్ ఇవ్వడం. ఉదయం 4 గంటలతో మొదలుపెట్టి ఈ రోజు మొత్తం ఆరు షోలు వేసుకోవచ్చు. ఇది సానుకూల నిర్ణయం. పైన చెప్పిన పెంపు కేవలం మూడు రోజులు అంటే ఆదివారం వరకే పరిమితం చేశారు. మండే నుంచి పాత రేట్లే ఉంటాయి. నిజానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ స్లాట్ నే కోరుకున్నారు. ఎంత ఆదిపురుష్ మీద క్రేజ్ ఉన్నా స్కూళ్ళు తెరిచేసి సెలవులు పూర్తయిన టైంలో మరీ ఎక్కువ రేట్లు పెడితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆశించిందే వచ్చింది. సో హైదరాబాద్ లో తెల్లవారకుండానే షోలు షురూ అన్నమాట

ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఇదే 50 రూపాయల అనుమతి రానుంది. కాకపోతే అక్కడ మల్టీప్లెక్స్ బేసిక్ ప్రైస్ 177 కాబట్టి తెలంగాణతో పోలిస్తే మరీ తీవ్రంగా ఉండబోదు. సింగల్ స్క్రీన్లలో అక్కడ అమలులో ఉన్న ధర 110. సో ఫైనల్ గా 160 మించదు. మొత్తం 185 కోట్లకు హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆదిపురుష్ ఫలితం మీద చాలా నమ్మకంగా ఉంది. ఉదయం ఆటకు పాజిటివ్ టాక్ వస్తే చాలు వసూళ్ల సునామి ఖాయం. నార్త్ లోనే ఆ రేంజ్ భీభత్సం కనిపిస్తుంటే ప్రభాస్ హోమ్ గ్రౌండ్ అయిన తెలుగు రాష్ట్రాల్లో అరాచకం గురించి వేరే చెప్పాలా  

This post was last modified on June 13, 2023 6:22 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

5 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

25 mins ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

10 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

14 hours ago