ఫ్యామిలీ హీరో శర్వానంద్ నిన్న రాత్రి ఓ ఇంటివాడైపోయాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ టాప్ ఫైవ్ లిస్టులో ఉన్న శర్వా ఫైనల్ గా రక్షిత మెడలో మూడు ముళ్ళు వేయడంతో ఒంటరి జీవితానికి శుభం కార్డు ఇచ్చేశాడు. జైపూర్ లీలా ప్యాలెస్ లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు స్నేహితులు రామ్ చరణ్, సిద్దార్థ్, అదితి రావు హైదరి తదితరులు హాజరయ్యారు. యువి క్రియేషన్స్, ఎస్విసి క్రియేషన్ల తరఫున ప్రత్యేక అతిథులు వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి హాజరు పరిమితంగా ఉంది. రెండు కుటుంబాల మధ్య సాంప్రదాయ పద్దతులతో వివాహం జరిగింది.
హైదరాబాద్ లో రిసెప్షన్ జూన్ 9న జరగనుంది. దీనికి టాలీవుడ్ తారాతోరణం మొత్తం హాజరవుతుంది. చిరంజీవి బాలయ్యతో మొదలుపెట్టి అడవి శేష్ లాంటి ఇప్పటి హీరోల దాకా అందరితోనూ మంచి బాండింగ్ ఉన్న శర్వా కోసం ఆ రోజు భారీ ఎత్తున కలర్ ఫుల్ కాంబినేషన్లు ఉండబోతున్నాయి. ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంట మాత్రం క్యూట్ గా ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన శర్వానంద్ తిరిగి జూలై నుంచి అందులో పాల్గొనబోతున్నాడు. కొత్త పెళ్ళకొడుక్కి ఆ మాత్రం గ్యాప్ ఇవ్వాలి
కెరీర్ పరంగా చూస్తే శర్వానంద్ బ్లాక్ బస్టర్ ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఒకే ఒక జీవితం విజయం సాధించి రిలీఫ్ ఇచ్చింది కానీ రన్ రాజా రన్ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ మధ్య డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లు కొంత ప్రభావం చూపించినప్పటికీ ఒక పెద్ద హిట్టు పడితే ఇవన్నీ సర్దుకుంటాయి. జీవిత భాగస్వామి వచ్చిన వేళ ఆ రకంగా కలిసి వస్తుందేమో చూడాలి. భర్తగా కొత్త పాత్ర కోసం కొంత టైం తీసుకున్నప్పటికీ చివరికి కుదురుకున్నాడు. ఇక బ్రహ్మచారుల లిస్టులో నెక్స్ట్ ఉన్నది ప్రభాసే. ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వింటామో
This post was last modified on June 4, 2023 4:36 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…