సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే గంటలు కాదు రోజులు సరిపోవు. టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు చిన్నా చితక ఆర్టిస్టులు అందరితోనూ స్క్రీన్ పంచుకున్న సుదీర్ఘ అనుభవం ఆయనది. ఇటీవలే జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో కోట హీరోల రెమ్యునరేషన్ల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ నుంచి శోభన్ బాబు దాకా ఒకప్పుడు ఎవరూ తమ పారితోషికాలను బయటికి చెప్పేవారు కాదని, కానీ ఇప్పుడు మైకు పట్టుకుని నాకు రోజుకు రెండు కోట్లు నాలుగు కోట్లు ఇస్తున్నారని పబ్లిక్ గా ఒప్పేసుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదనే రీతిలో అన్నారు.
ఇక్కడ నెటిజెన్లతో పాటు సాధారణంగా తలెత్తే లాజిక్ ఒకటుంది. హీరోలే కాదు ఏ మనిషైనా తనకు వచ్చే ఆదాయాన్ని చెప్పుకోవడం తప్పేమీ కాదు. దాని కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక మినహాయింపు లేదు. ఫలానా కంపెనీ లేదా సిఈఓ నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని బాహాటంగా చెబుతున్నప్పుడు స్టార్లు ఓపెన్ కావడం రాంగంటే ఎలా. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అన్నదే అయినప్పటికీ రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం నిజం ధైర్యంగా చెప్పడం విశేషమే. వందల కోట్ల బిజినెస్ చేసే సినిమాల్లో నటిస్తున్నప్పుడు నాకు ఇంత ఇస్తున్నారని చెప్పడం ముమ్మాటికీ రైటే
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఇతర బాషల నటీనటులను తీసుకోవడం పట్ల ఓ సందర్భంలో కోట తీవ్రంగా ఆక్షేపించారు. కానీ ఈయనే తమిళంలో సామీ, సెల్యూట్ లాంటి చిత్రాల్లో నటించిన ప్రస్తావిస్తే మాత్రం దాటవేత సమాధానం ఇచ్చేవారు. కార్పొరేట్ బ్రాండ్లకు కేవలం స్టార్లనే తీసుకోవడం పట్ల కూడా కోట అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా క్రికెట్ లో ధోని, కోహ్లీలతో యాడ్స్ చేయిస్తారు కానీ రవిశాస్త్రి, హర్షా భోగ్లేలతో కాదుగా. అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్ మెంట్స్ వార్తల్లో నిలిచే కోట శ్రీనివాసరావుగారు ఆరోగ్యం దృష్ట్యా సినిమాలు తగ్గించారు కానీ అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు
This post was last modified on June 3, 2023 3:18 pm
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…