అదేంటి త్రివిక్రమ్ సినిమాల పాటలు క్రమం తప్పకుండా వింటున్నాం కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా. మాటల రచయితగా తన పదాల కనికట్టుతో మాయ చేసే ఈయనలో ఓ లిరిక్ రైటర్ ఉన్నారన్న విషయం వీర ఫ్యాన్స్ కు మాత్రమే గుర్తుంటుంది. నిన్న రిలీజైన గుంటూరు కారం టీజర్ లో వచ్చే బిట్ సాంగ్ రాసింది గురూజీనే. గత ఏడాది భీమ్లా నాయక్ లో లాలా అడవి పులి వచ్చింది కూడా ఈ కలం నుంచే. అయితే త్రివిక్రమ్ పాటలు రాయడం ఇది మొదటిసారి కాదు. ఇరవై ఏళ్ళ క్రితమే తన ప్రాసల మేజిక్ ని ప్రేక్షకులకు రుచి చూపించారు. కానీ జనానికి చేరలేదు
2003లో రవితేజ నమిత హీరో హీరోయిన్లుగా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సినిమా ఒక రాజు ఒక రాణి. దర్శకుడు యోగి. చక్రి సంగీతం సమకూర్చారు. అందులో మంచి పాటలు పడ్డాయి. స్వరాల వీణ ఈ వేళలోనా అంటూ క్యాచీగా ఉండే సాంగ్స్ తో చక్కని ఆల్బమ్ ఇచ్చారు. అయితే మాస్ మహారాజాకు అప్పుడున్న ఇమేజ్ కి ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీలో ఆడియన్స్ చూడలేకపోయారు. దీంతో ఎంత పబ్లిసిటీ ఇచ్చి ప్రమోషన్లు చేసినా ఫలితం దక్కలేదు. పెద్ద క్యాస్టింగ్ ఉన్నా లాభం లేకపోయింది. రామోజీరావు సంస్థ అనే కారణంతో రవితేజ ఎక్కువ ఆలోచించకుండా చేసిన మూవీ ఇదే
పాటలు త్రివిక్రమ్ రాశారన్న టాక్ ఆ టైంలో పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఇక అప్పటి నుంచి ఆయన కేవలం మాటలు దర్శకత్వానికి మాత్రమే పరిమితమయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం లిరిక్ రైటర్ కి పని చెప్పడం విశేషం. ఎడాపెడా చూడం ఇది ఎర్రెక్కించే బేరం, సరా సరా శూలం సుర్రాంటాది కారం, ఇనుప చువ్వ కౌకు దెబ్బ ఇరగదీసే రవ్వలదెబ్బ అంటూ తన మార్కు ఇందులోనూ చూపించడం విశేషం. దీనికొకటే పరిమితమవుతారా లేక ఇంకో రెండు మూడు పాటలకు కలం విదిలిస్తారా చూడాలి
This post was last modified on June 2, 2023 8:52 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…