Movie News

2 దశాబ్దాల తర్వాత గురూజీ పాటలు

అదేంటి త్రివిక్రమ్ సినిమాల పాటలు క్రమం తప్పకుండా వింటున్నాం కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా. మాటల రచయితగా తన పదాల కనికట్టుతో మాయ చేసే ఈయనలో ఓ లిరిక్ రైటర్ ఉన్నారన్న విషయం వీర ఫ్యాన్స్ కు మాత్రమే గుర్తుంటుంది. నిన్న రిలీజైన గుంటూరు కారం టీజర్ లో వచ్చే బిట్ సాంగ్ రాసింది గురూజీనే. గత ఏడాది భీమ్లా నాయక్ లో లాలా అడవి పులి వచ్చింది కూడా ఈ కలం నుంచే. అయితే త్రివిక్రమ్ పాటలు రాయడం ఇది మొదటిసారి కాదు. ఇరవై ఏళ్ళ క్రితమే తన ప్రాసల మేజిక్ ని ప్రేక్షకులకు రుచి చూపించారు. కానీ జనానికి చేరలేదు

2003లో రవితేజ నమిత హీరో హీరోయిన్లుగా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సినిమా ఒక రాజు ఒక రాణి. దర్శకుడు యోగి. చక్రి సంగీతం సమకూర్చారు. అందులో మంచి పాటలు పడ్డాయి. స్వరాల వీణ ఈ వేళలోనా అంటూ క్యాచీగా ఉండే సాంగ్స్ తో చక్కని ఆల్బమ్ ఇచ్చారు. అయితే మాస్ మహారాజాకు అప్పుడున్న ఇమేజ్ కి ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీలో ఆడియన్స్ చూడలేకపోయారు. దీంతో ఎంత పబ్లిసిటీ ఇచ్చి ప్రమోషన్లు చేసినా ఫలితం దక్కలేదు. పెద్ద క్యాస్టింగ్ ఉన్నా లాభం లేకపోయింది. రామోజీరావు సంస్థ అనే కారణంతో రవితేజ ఎక్కువ ఆలోచించకుండా చేసిన మూవీ ఇదే

పాటలు త్రివిక్రమ్ రాశారన్న టాక్ ఆ టైంలో పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఇక అప్పటి నుంచి ఆయన కేవలం మాటలు దర్శకత్వానికి మాత్రమే పరిమితమయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం లిరిక్ రైటర్ కి పని చెప్పడం విశేషం. ఎడాపెడా చూడం ఇది ఎర్రెక్కించే బేరం,  సరా సరా శూలం సుర్రాంటాది కారం, ఇనుప చువ్వ కౌకు దెబ్బ ఇరగదీసే రవ్వలదెబ్బ అంటూ తన మార్కు ఇందులోనూ చూపించడం విశేషం. దీనికొకటే పరిమితమవుతారా లేక ఇంకో రెండు మూడు పాటలకు కలం విదిలిస్తారా చూడాలి 

This post was last modified on June 2, 2023 8:52 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

14 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

57 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago