ఇండస్ట్రీలో ఏ కథ ఏ హీరో దగ్గరికి వెళ్తుందో చెప్పలేం. హీరోలు కథలు చాలానే ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందు సాగర్ కే చంద్ర వరుణ్ తేజ్ తో ఓ సినిమా లాక్ చేసుకున్నాడు. దాదాపు రెండు మూడేళ్లు 14 రీల్స్ ఆఫీస్ లోనే ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేశాడు. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ సితార లో ఇంకో కథ చెప్పాడు. ఆ కథను పక్కన పెట్టించి సాగర్ కే చంద్ర కి పవన్ రీమేక్ సినిమా అప్పగించారు.
అయితే పవన్ సినిమా తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ తో సాగర్ సినిమా ఉంటుందనుకునే లోపే బెల్లంకొండ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కోసం వర్క్ చేసిన 14 రీల్స్ సంస్థ లోనే ఈ సినిమా చేస్తున్నాడు సాగర్. దీంతో వరుణ్ తేజ్ కి ప్లాన్ చేసిన కథతోనే ఇప్పుడు దర్శక నిర్మాతలు బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
నిజానికి యంగ్ హీరో కోసం రాసుకున్న కథ సీనియర్ హీరోకి సూటవ్వక పోవచ్చు కానీ అదే ఏజ్ గ్రూప్ హీరో దొరికితే మాత్రం తాను వర్క్ చేసి ఎంతో నమ్మిన కథతోనే దర్శకులు పట్టాలేక్కిస్తుంటారు. సొ సాగర్ కే చంద్ర కూడా అదే చేస్తుండొచ్చు. తాజాగా ఈ కాంబో సినిమా మొదలైంది. జూన్ నుండి రెగ్యులర్ ఘాట్ జరుపుకోనుంది.
This post was last modified on June 1, 2023 10:07 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…