ఇండస్ట్రీలో ఏ కథ ఏ హీరో దగ్గరికి వెళ్తుందో చెప్పలేం. హీరోలు కథలు చాలానే ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందు సాగర్ కే చంద్ర వరుణ్ తేజ్ తో ఓ సినిమా లాక్ చేసుకున్నాడు. దాదాపు రెండు మూడేళ్లు 14 రీల్స్ ఆఫీస్ లోనే ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేశాడు. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ సితార లో ఇంకో కథ చెప్పాడు. ఆ కథను పక్కన పెట్టించి సాగర్ కే చంద్ర కి పవన్ రీమేక్ సినిమా అప్పగించారు.
అయితే పవన్ సినిమా తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ తో సాగర్ సినిమా ఉంటుందనుకునే లోపే బెల్లంకొండ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కోసం వర్క్ చేసిన 14 రీల్స్ సంస్థ లోనే ఈ సినిమా చేస్తున్నాడు సాగర్. దీంతో వరుణ్ తేజ్ కి ప్లాన్ చేసిన కథతోనే ఇప్పుడు దర్శక నిర్మాతలు బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
నిజానికి యంగ్ హీరో కోసం రాసుకున్న కథ సీనియర్ హీరోకి సూటవ్వక పోవచ్చు కానీ అదే ఏజ్ గ్రూప్ హీరో దొరికితే మాత్రం తాను వర్క్ చేసి ఎంతో నమ్మిన కథతోనే దర్శకులు పట్టాలేక్కిస్తుంటారు. సొ సాగర్ కే చంద్ర కూడా అదే చేస్తుండొచ్చు. తాజాగా ఈ కాంబో సినిమా మొదలైంది. జూన్ నుండి రెగ్యులర్ ఘాట్ జరుపుకోనుంది.
This post was last modified on June 1, 2023 10:07 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…