ఇండస్ట్రీలో ఏ కథ ఏ హీరో దగ్గరికి వెళ్తుందో చెప్పలేం. హీరోలు కథలు చాలానే ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందు సాగర్ కే చంద్ర వరుణ్ తేజ్ తో ఓ సినిమా లాక్ చేసుకున్నాడు. దాదాపు రెండు మూడేళ్లు 14 రీల్స్ ఆఫీస్ లోనే ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేశాడు. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ సితార లో ఇంకో కథ చెప్పాడు. ఆ కథను పక్కన పెట్టించి సాగర్ కే చంద్ర కి పవన్ రీమేక్ సినిమా అప్పగించారు.
అయితే పవన్ సినిమా తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ తో సాగర్ సినిమా ఉంటుందనుకునే లోపే బెల్లంకొండ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కోసం వర్క్ చేసిన 14 రీల్స్ సంస్థ లోనే ఈ సినిమా చేస్తున్నాడు సాగర్. దీంతో వరుణ్ తేజ్ కి ప్లాన్ చేసిన కథతోనే ఇప్పుడు దర్శక నిర్మాతలు బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
నిజానికి యంగ్ హీరో కోసం రాసుకున్న కథ సీనియర్ హీరోకి సూటవ్వక పోవచ్చు కానీ అదే ఏజ్ గ్రూప్ హీరో దొరికితే మాత్రం తాను వర్క్ చేసి ఎంతో నమ్మిన కథతోనే దర్శకులు పట్టాలేక్కిస్తుంటారు. సొ సాగర్ కే చంద్ర కూడా అదే చేస్తుండొచ్చు. తాజాగా ఈ కాంబో సినిమా మొదలైంది. జూన్ నుండి రెగ్యులర్ ఘాట్ జరుపుకోనుంది.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…