ఇండస్ట్రీలో ఏ కథ ఏ హీరో దగ్గరికి వెళ్తుందో చెప్పలేం. హీరోలు కథలు చాలానే ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందు సాగర్ కే చంద్ర వరుణ్ తేజ్ తో ఓ సినిమా లాక్ చేసుకున్నాడు. దాదాపు రెండు మూడేళ్లు 14 రీల్స్ ఆఫీస్ లోనే ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేశాడు. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ సితార లో ఇంకో కథ చెప్పాడు. ఆ కథను పక్కన పెట్టించి సాగర్ కే చంద్ర కి పవన్ రీమేక్ సినిమా అప్పగించారు.
అయితే పవన్ సినిమా తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ తో సాగర్ సినిమా ఉంటుందనుకునే లోపే బెల్లంకొండ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కోసం వర్క్ చేసిన 14 రీల్స్ సంస్థ లోనే ఈ సినిమా చేస్తున్నాడు సాగర్. దీంతో వరుణ్ తేజ్ కి ప్లాన్ చేసిన కథతోనే ఇప్పుడు దర్శక నిర్మాతలు బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
నిజానికి యంగ్ హీరో కోసం రాసుకున్న కథ సీనియర్ హీరోకి సూటవ్వక పోవచ్చు కానీ అదే ఏజ్ గ్రూప్ హీరో దొరికితే మాత్రం తాను వర్క్ చేసి ఎంతో నమ్మిన కథతోనే దర్శకులు పట్టాలేక్కిస్తుంటారు. సొ సాగర్ కే చంద్ర కూడా అదే చేస్తుండొచ్చు. తాజాగా ఈ కాంబో సినిమా మొదలైంది. జూన్ నుండి రెగ్యులర్ ఘాట్ జరుపుకోనుంది.
This post was last modified on June 1, 2023 10:07 pm
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…