Movie News

కొంపముంచిన నిర్మాతల తొందరపాటు

బ్లాక్ బస్టర్స్ విషయంలో నిర్మాతలు వాటి నిర్మాణ సమయంలోనే ఓటిటి డీల్స్ కి టెంప్ట్ కావడం వల్ల థియేట్రికల్ రెవిన్యూ దెబ్బ తింటోంది. ముఖ్యంగా ఆలస్యంగా డబ్బింగ్ జరుపుకున్న వాటికి ఈ సమస్య మరింత తీవ్రం. ఇటీవలి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 2018 కేరళలో మే 5 రిలీజయ్యింది. కేవలం మూడు వారాల్లోపే నూటా యాభై కోట్లతో  మోహన్ లాల్ ఆల్ టైం టాప్ 2ని పెద్ద మార్జిన్ తో దాటేసింది. రెండు వందల కోట్లు ఖాయమని బయ్యర్లు గట్టి నమ్మకంగాతో ఉన్నారు. ఈలోగా సోనీ లైవ్ దీని డిజిటల్ స్ట్రీమింగ్ ని జూన్ 7 చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది.

తెలుగు ఆడియో ఇవ్వకపోవచ్చు కానీ ఇక్కడ రిలీజై పట్టుమని అయిదు రోజులు కాలేదు. ఈలోగా ఓటిటి వార్త తెలిస్తే థియేటర్ కు వెళదామనుకున్న ఆడియన్స్ ఆగిపోతారు. ఒరిజినల్ వెర్షన్ నే సబ్ టైటిల్స్ తో చూసేద్దామనే బాపతు లేకపోలేదు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో 2018కి స్లో పికప్ ఉంది. నాలుగు రోజులకు అయిదు కోట్లు దాటేసి మేం ఫేమస్ ని డామినేట్ చేస్తోంది. అలాంటప్పుడు డిజిటల్ అనౌన్స్ మెంట్లు రాకపోతేనే బెటర్. సరే ఇప్పుడు దాన్ని ఎలాగూ వెనక్కు తీసుకోలేరు కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా దీన్ని తీసుకోవాలి

మల్లువుడ్ డిస్ట్రిబ్యూటర్లు దీని మీద భగ్గుమంటున్నారు. మంచి రన్ లో సినిమాని ఇలా ఓటిటిలకు ఇస్తే భవిష్యత్తులో తమ నుంచి నిరసన ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే నెలల తరబడి డల్లుగా ఉన్న కేరళ బాక్సాఫీస్ కు జవసత్వాలు తీసుకొచ్చింది 2018నే. చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్ బోర్డులు చూసి ఎగ్జిబిటర్ల సంతోషం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే ఇప్పుడీ ఓటిటి న్యూస్ తో 33 రోజులకే సినిమాని కిల్ చేస్తున్నారని వాపోతున్నారు. అంతా అయిపోయాక ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది 

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

24 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago