బ్లాక్ బస్టర్స్ విషయంలో నిర్మాతలు వాటి నిర్మాణ సమయంలోనే ఓటిటి డీల్స్ కి టెంప్ట్ కావడం వల్ల థియేట్రికల్ రెవిన్యూ దెబ్బ తింటోంది. ముఖ్యంగా ఆలస్యంగా డబ్బింగ్ జరుపుకున్న వాటికి ఈ సమస్య మరింత తీవ్రం. ఇటీవలి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 2018 కేరళలో మే 5 రిలీజయ్యింది. కేవలం మూడు వారాల్లోపే నూటా యాభై కోట్లతో మోహన్ లాల్ ఆల్ టైం టాప్ 2ని పెద్ద మార్జిన్ తో దాటేసింది. రెండు వందల కోట్లు ఖాయమని బయ్యర్లు గట్టి నమ్మకంగాతో ఉన్నారు. ఈలోగా సోనీ లైవ్ దీని డిజిటల్ స్ట్రీమింగ్ ని జూన్ 7 చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది.
తెలుగు ఆడియో ఇవ్వకపోవచ్చు కానీ ఇక్కడ రిలీజై పట్టుమని అయిదు రోజులు కాలేదు. ఈలోగా ఓటిటి వార్త తెలిస్తే థియేటర్ కు వెళదామనుకున్న ఆడియన్స్ ఆగిపోతారు. ఒరిజినల్ వెర్షన్ నే సబ్ టైటిల్స్ తో చూసేద్దామనే బాపతు లేకపోలేదు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో 2018కి స్లో పికప్ ఉంది. నాలుగు రోజులకు అయిదు కోట్లు దాటేసి మేం ఫేమస్ ని డామినేట్ చేస్తోంది. అలాంటప్పుడు డిజిటల్ అనౌన్స్ మెంట్లు రాకపోతేనే బెటర్. సరే ఇప్పుడు దాన్ని ఎలాగూ వెనక్కు తీసుకోలేరు కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా దీన్ని తీసుకోవాలి
మల్లువుడ్ డిస్ట్రిబ్యూటర్లు దీని మీద భగ్గుమంటున్నారు. మంచి రన్ లో సినిమాని ఇలా ఓటిటిలకు ఇస్తే భవిష్యత్తులో తమ నుంచి నిరసన ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే నెలల తరబడి డల్లుగా ఉన్న కేరళ బాక్సాఫీస్ కు జవసత్వాలు తీసుకొచ్చింది 2018నే. చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్ బోర్డులు చూసి ఎగ్జిబిటర్ల సంతోషం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే ఇప్పుడీ ఓటిటి న్యూస్ తో 33 రోజులకే సినిమాని కిల్ చేస్తున్నారని వాపోతున్నారు. అంతా అయిపోయాక ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది
This post was last modified on May 30, 2023 10:37 am
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…