బ్లాక్ బస్టర్స్ విషయంలో నిర్మాతలు వాటి నిర్మాణ సమయంలోనే ఓటిటి డీల్స్ కి టెంప్ట్ కావడం వల్ల థియేట్రికల్ రెవిన్యూ దెబ్బ తింటోంది. ముఖ్యంగా ఆలస్యంగా డబ్బింగ్ జరుపుకున్న వాటికి ఈ సమస్య మరింత తీవ్రం. ఇటీవలి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 2018 కేరళలో మే 5 రిలీజయ్యింది. కేవలం మూడు వారాల్లోపే నూటా యాభై కోట్లతో మోహన్ లాల్ ఆల్ టైం టాప్ 2ని పెద్ద మార్జిన్ తో దాటేసింది. రెండు వందల కోట్లు ఖాయమని బయ్యర్లు గట్టి నమ్మకంగాతో ఉన్నారు. ఈలోగా సోనీ లైవ్ దీని డిజిటల్ స్ట్రీమింగ్ ని జూన్ 7 చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది.
తెలుగు ఆడియో ఇవ్వకపోవచ్చు కానీ ఇక్కడ రిలీజై పట్టుమని అయిదు రోజులు కాలేదు. ఈలోగా ఓటిటి వార్త తెలిస్తే థియేటర్ కు వెళదామనుకున్న ఆడియన్స్ ఆగిపోతారు. ఒరిజినల్ వెర్షన్ నే సబ్ టైటిల్స్ తో చూసేద్దామనే బాపతు లేకపోలేదు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో 2018కి స్లో పికప్ ఉంది. నాలుగు రోజులకు అయిదు కోట్లు దాటేసి మేం ఫేమస్ ని డామినేట్ చేస్తోంది. అలాంటప్పుడు డిజిటల్ అనౌన్స్ మెంట్లు రాకపోతేనే బెటర్. సరే ఇప్పుడు దాన్ని ఎలాగూ వెనక్కు తీసుకోలేరు కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా దీన్ని తీసుకోవాలి
మల్లువుడ్ డిస్ట్రిబ్యూటర్లు దీని మీద భగ్గుమంటున్నారు. మంచి రన్ లో సినిమాని ఇలా ఓటిటిలకు ఇస్తే భవిష్యత్తులో తమ నుంచి నిరసన ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే నెలల తరబడి డల్లుగా ఉన్న కేరళ బాక్సాఫీస్ కు జవసత్వాలు తీసుకొచ్చింది 2018నే. చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్ బోర్డులు చూసి ఎగ్జిబిటర్ల సంతోషం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే ఇప్పుడీ ఓటిటి న్యూస్ తో 33 రోజులకే సినిమాని కిల్ చేస్తున్నారని వాపోతున్నారు. అంతా అయిపోయాక ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది
This post was last modified on May 30, 2023 10:37 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…