తమిళ కథానాయిక త్రిషకు ఈ మధ్యే 40 ఏళ్లు నిండాయి. ఈ వయసులో హీరోయిన్ వేషాలు పక్కన పెట్టి.. క్యారెక్టర్ రోల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కానీ త్రిష మాత్రం ఇంకా చెక్కు చెదరని అందంతో.. భారీ సినిమాల్లో లీడ్ రోల్స్తో అభిమానులను అలరిస్తోంది. ఈ మధ్యే పొన్నియన్ సెల్వన్-2లో తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మైమరిచిపోయారు.
మధ్యలో కెరీర్ డౌన్ అయి ఇక సినిమాలే మానేయాల్సిన స్థితిలో కనిపించిన త్రిష.. ఈ మధ్య చేస్తున్న, చేయబోతున్న సినిమాల వరుస చూస్తే షాకవ్వక తప్పదు. ఆల్రెడీ విజయ్ లాంటి టాప్ స్టార్తో లియో సినిమాలో కథానాయికగా నటిస్తోంది త్రిష. ఇప్పుడు అజిత్తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు సమాచారం.
అజిత్ హీరోగా మగిల్ తిరుమణి ఓ సినిమా రూపొందించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఇందులో కథానాయికగా త్రిష దాదాపుగా ఓకే అయినట్లు సమాచారం. ఒక తరం స్టార్ హీరోయిన్లతో నటించాక స్టార్ హీరోలు.. కొత్త తరం హీరోయిన్ల వైపు మొగ్గుతుంటారు.
హీరోలకు ఎంత వయసొచ్చినా పర్వాలేదు కానీ.. హీరోయిన్ల విషయంలో అలా ఉండదు. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటుంది. కానీ నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు మాత్రం ఇంకా తమ హవా నడిపిస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ చేయనున్న కొత్త చిత్రంలోనూ త్రిష కథానాయికగా నటించనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 25, 2023 5:51 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…