మెగాస్టార్ చిరంజీవి కొన్ని నెలల కిందటే ఓ ఇంటర్వ్యూలో తన కొత్త చిత్రాల లైనప్ గురించి మాట్లాడాడు. అందులో ఆయన తాను పని చేయబోయే కొత్త దర్శకుల పేర్లు చెప్పాడు. బాబీ, సుజీత్, మెహర్ రమేష్.. ఇవీ ఆయన వెల్లడించిన పేర్లు. ఇవేవీ కూడా మెగా అభిమానులకు అంతగా రుచించిన పేర్లు కావు. ముఖ్యంగా మెహర్ రమేష్ అనే సరికి చాలామంది బెంబేలెత్తిపోయారు.
కంత్రి, శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసిన దర్శకుడతను. ‘షాడో’ తర్వాత ఇన్నేళ్లలో మరో సినిమా చేయలేదు. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటి అని ఆశ్చర్యపోయారు. కానీ చిరు అంత తేలిగ్గా అయితే మీడియాకు మెహర్ పేరు చెప్పే అవకాశం లేదు. వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు సినిమా కూడా ఓకే అయిపోయిందని.. త్వరలోనే ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.
కాకపోతే అభిమానులు మరీ భయపడకుండా స్ట్రెయిట్ మూవీ కాకుండా రీమేక్ కోసం మెహర్తో చిరు జట్టు కడుతున్నట్లు సమాచారం. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా మూవీ ‘వేదాలం’ను చిరు హీరోగా మెహర్ రీమేక్ చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్తో తీయడానికి ఒకప్పుడు సన్నాహాలు జరిగాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు చిరు ఆ రీమేక్ మీద మనసు పడ్డారట.
ఆల్రెడీ చిరు రీఎంట్రీలో ‘కత్తి’ రీమేక్లో నటించారు. అలాగే మలయాళ సినిమా ‘లూసిఫర్’ను రీమేక్ చేయబోతున్నారు. దాని విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మరోవైపు కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కూడా సినిమా దాదాపుగా ఓకే అయినట్లే అంటున్నారు. కానీ అన్నిటికంటే ముందు మెహర్తో ‘వేదాలం’ రీమేక్లో నటించబోతున్నాడని.. ఇదే ఆయన 153వ చిత్రం అని అంటున్నారు. దీనిపై చిరు పుట్టిన రోజు నాడు స్పష్టత వచ్చ అవకాశముంది.
This post was last modified on August 9, 2020 7:40 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…