మెగాస్టార్ చిరంజీవి కొన్ని నెలల కిందటే ఓ ఇంటర్వ్యూలో తన కొత్త చిత్రాల లైనప్ గురించి మాట్లాడాడు. అందులో ఆయన తాను పని చేయబోయే కొత్త దర్శకుల పేర్లు చెప్పాడు. బాబీ, సుజీత్, మెహర్ రమేష్.. ఇవీ ఆయన వెల్లడించిన పేర్లు. ఇవేవీ కూడా మెగా అభిమానులకు అంతగా రుచించిన పేర్లు కావు. ముఖ్యంగా మెహర్ రమేష్ అనే సరికి చాలామంది బెంబేలెత్తిపోయారు.
కంత్రి, శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసిన దర్శకుడతను. ‘షాడో’ తర్వాత ఇన్నేళ్లలో మరో సినిమా చేయలేదు. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటి అని ఆశ్చర్యపోయారు. కానీ చిరు అంత తేలిగ్గా అయితే మీడియాకు మెహర్ పేరు చెప్పే అవకాశం లేదు. వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు సినిమా కూడా ఓకే అయిపోయిందని.. త్వరలోనే ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.
కాకపోతే అభిమానులు మరీ భయపడకుండా స్ట్రెయిట్ మూవీ కాకుండా రీమేక్ కోసం మెహర్తో చిరు జట్టు కడుతున్నట్లు సమాచారం. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా మూవీ ‘వేదాలం’ను చిరు హీరోగా మెహర్ రీమేక్ చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్తో తీయడానికి ఒకప్పుడు సన్నాహాలు జరిగాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు చిరు ఆ రీమేక్ మీద మనసు పడ్డారట.
ఆల్రెడీ చిరు రీఎంట్రీలో ‘కత్తి’ రీమేక్లో నటించారు. అలాగే మలయాళ సినిమా ‘లూసిఫర్’ను రీమేక్ చేయబోతున్నారు. దాని విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మరోవైపు కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కూడా సినిమా దాదాపుగా ఓకే అయినట్లే అంటున్నారు. కానీ అన్నిటికంటే ముందు మెహర్తో ‘వేదాలం’ రీమేక్లో నటించబోతున్నాడని.. ఇదే ఆయన 153వ చిత్రం అని అంటున్నారు. దీనిపై చిరు పుట్టిన రోజు నాడు స్పష్టత వచ్చ అవకాశముంది.
This post was last modified on August 9, 2020 7:40 am
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…