టాలీవుడ్లో అత్యధికంగా కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సంగీత దర్శకుడు ఎవరు అంటే.. మరో మాట లేకుండా అందరూ తమన్ పేరే చెప్పేస్తారు. తాను అసలు కాపీయే కొట్టని.. కొట్టినా అది దర్శకుల కోరిక మేరకే అయి ఉంటుందని.. తమన్ ఎంత వివరణ ఇచ్చుకున్నా.. ఎంత కవర్ చేసినా.. సోషల్ మీడియాలో మాత్రం తనపై ట్రోలింగ్ ఆగదు.
యూట్యూబ్లోకి వెళ్లి తమన్ కాపీ మ్యూజిక్, ట్యూన్స్ అని కొడితే.. పెద్ద లిస్టే వస్తుంది. ఒరిజినల్స్, అతను చేసిన పాటలు పక్క పక్కన పెట్టి పోల్చి మరీ.. తన తప్పుల్ని బయటపెట్టేస్తుంటారు నెటిజన్లు. పాటల ట్యూన్స్ అనే కాదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ తమన్ మీద పలు కాపీ ఆరోపణలు ఉన్నాయి. ఉన్నదున్నట్లు దించేయకున్నా.. వేరే పాటలు, స్కోర్ను గుర్తుకు తెచ్చేలా అతడి వర్క్ ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ‘వీర సింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్యా’ పాట.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాటకు దగ్గరగా ఉండటం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
కట్ చేస్తే ఇప్పుడు తమన్ పని చేస్తున్న కొత్త సినిమా టీజర్కు ఇచ్చిన స్కోర్ విషయంలోనూ కాపీ ఆరోపణలు తప్పట్లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన కొత్త చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఈ రోజు రామ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో బ్యాగ్రౌండ్లో వినిపించిన సాంగ్, స్కోర్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.
కానీ కాసేపటికే ఆ ట్యూన్ ఒరిజినల్ కాదంటూ నెటిజన్లు ఆరోపణలు మొదలుపెట్టారు. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘వేటైకారన్’ సినిమాలో హీరోకు ఎలివేషన్ ఇస్తూ ఒక బిట్ సాంగ్ ఉండగా దాని స్ఫూర్తితోనే తమన్.. బోయపాటి-రామ్ సినిమా టీజర్కు స్కోర్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. రెండూ వింటే పోలికలు కచ్చితంగా ఉన్నాయనిపిస్తోంది. ఈ విషయంలో నెటిజన్లు ఆల్రెడీ తమన్ను టార్గెట్ చేసి వాయించేస్తున్నారు. మరి తమన్ ఈ ఆరోపణలపై ఏమని బదులిస్తాడో చూడాలి.
This post was last modified on May 15, 2023 4:27 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…