మనం ఇప్పటికీ వందల వేల సార్లు చూసేసి అరగేసిన సినిమా కాబట్టి ఛత్రపతి హిందీ రీమేక్ వెర్షన్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏమంత భారీ స్థాయిలో రిలీజ్ చేయలేదు .కేవలం నార్త్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అక్కడ మాత్రమే ఎక్కువ ప్రమోట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. పెన్ స్టూడియోస్ నిర్మాణం కావడంతో ప్రత్యేకంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఒక షో కూడా వేశారు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన ఐబి 71 తప్ప నార్త్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పోటీ లేదు. పూర్తిగా ఉత్తరాది మాస్ ని టార్గెట్ చేసిన బెల్లం ఛత్రపతి ఎంతవరకు మెప్పించాడనే ఆసక్తి జనాల్లో ఉండటం సహజం.
కథ పరంగా మళ్ళీ చెప్పడానికి ఏమి లేదు. కొన్ని మార్పులతో విజయేంద్ర ప్రసాద్ స్టోరీని యథాతథంగా తీసుకున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే నలభై నిమిషాలకు పైగానే కోత వేసి కేవలం 2 గంటల 3 నిమిషాలకే ఛత్రపతిని కుదించడం విశేషం. సాయి శ్రీనివాస్ ని మాస్ యాక్షన్ అవతారంలో చూపించడంలో దర్శకుడు వివి వినాయక్ సక్సెస్ అయ్యాడు. అయితే ప్రభాస్ సినిమాకు ఏదైతే ఆయువుపట్టుగా నిలిచిందో ఆ మదర్ సెంటిమెంట్ ని ఇందులో పూర్తిగా కట్ షార్ట్ చేసి హీరోయిజం ఎలివేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం కామం ఆడియన్స్ కు అంతగా రుచించదు.
హీరోయిన్ నుస్రత్ బరుచా పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. మనకు కీరవాణి సంగీతం ప్రాణంగా నిలిచింది. అయితే అక్కడ తనిష్క్ బాగ్చి పాటలు క్లిక్ అయ్యేలా లేవు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సౌండ్ ఎక్కువ సోల్ తక్కువగా మిగిలింది. ఫోకస్ మొత్తం హీరో పాత్రకు షిఫ్ట్ చేయడంతో మన ఛత్రపతిలో కీలకంగా నిలిచిన భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, కోట లాంటి క్యారెక్టర్లు స్కోప్ తగ్గిపోవడంతో పాటు సరైన ఆర్టిస్టులు కుదరక తేలిపోయాయి. ఓవరాల్ గా సాయిశ్రీనివాస్ లో మాస్ మెటీరియల్ ఉందని చెప్పడానికి మాత్రమే ఛత్రపతి ఉపయోగపడింది కానీ పర్ఫెక్ట్ రీమేక్ అనిపించుకోవడానికి కాదు.
This post was last modified on May 12, 2023 9:24 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…