క్లాసిక్ ఫిలిం మేకర్ గా ఒకప్పుడు ఎందరికో స్ఫూర్తినిచ్చి కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులను ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఏనాడో తన స్థాయికి తగని అట్టడుగు కంటెంట్ తో సినిమాలు సిరీస్ లు తీస్తూ ప్రేక్షకుల్లో గౌరవాన్ని పోగొట్టుకున్న మాట వాస్తవం. సరే ఏదో డబ్బు వ్యామోహంలో పడి కొత్తగా వచ్చేది పోయేది ఏమీ లేదన్న నిర్లక్ష్యంతో ఇలా చేస్తున్నారనుకుని ఆడియన్స్ ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. అయితే రాజకీయ నేపథ్యం ఎంచుకుని ఎప్పుడైతే వైసిపి పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కొత్త రంగులు బయటపడ్డాయి.
తాజాగా వర్మ నిజం అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వాస్తవాలను ఇందులో బయట పెడతారట. అవి ఏ కోణంలో ఎవరిని సమర్థిస్తాయో ఎవరిని టార్గెట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడకుండానే ఈ విషయం మీద నిర్ధారణకు రావొచ్చు. సందర్భం ఉన్నా లేకపోయినా పదే పదే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లను వెటకారంగా విమర్శించే వర్మ ఇప్పుడీ నిజం ద్వారా ఎన్ని అబద్దాలు ప్రచారంలోకి తీసుకొస్తారోనని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇదైతే నిజమే.
చాలా సున్నితమైన కేసు మీద వర్మ ఇలా యూట్యూబ్ వీడియోలు చేయడం తగని పనే అయినా వినే రకం కాదు కాబట్టి వీటి వెనుక ఉద్దేశం అర్థం కావాలంటే అవన్నీ చూశాక మరింత స్ఫష్టంగా క్లారిటీ వస్తుంది. ఎన్టీఆర్ లక్ష్మి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ పూర్తిగా వన్ సైడ్ పొలిటికల్ ఎజెండా సినిమాలు తీసిన వర్మ జగన్ ని కీర్తిస్తూ ఒక మూవీని ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నాడు. వచ్చే ఎన్నికలకు కొన్ని నెలల ముందే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడీ సిరీస్ కి టైటిల్ ఎంత నిజమని పెట్టినా వర్మ గురించి తెలియనిది ఎవరికి.
This post was last modified on April 25, 2023 2:24 pm
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…