క్లాసిక్ ఫిలిం మేకర్ గా ఒకప్పుడు ఎందరికో స్ఫూర్తినిచ్చి కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులను ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఏనాడో తన స్థాయికి తగని అట్టడుగు కంటెంట్ తో సినిమాలు సిరీస్ లు తీస్తూ ప్రేక్షకుల్లో గౌరవాన్ని పోగొట్టుకున్న మాట వాస్తవం. సరే ఏదో డబ్బు వ్యామోహంలో పడి కొత్తగా వచ్చేది పోయేది ఏమీ లేదన్న నిర్లక్ష్యంతో ఇలా చేస్తున్నారనుకుని ఆడియన్స్ ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. అయితే రాజకీయ నేపథ్యం ఎంచుకుని ఎప్పుడైతే వైసిపి పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కొత్త రంగులు బయటపడ్డాయి.
తాజాగా వర్మ నిజం అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వాస్తవాలను ఇందులో బయట పెడతారట. అవి ఏ కోణంలో ఎవరిని సమర్థిస్తాయో ఎవరిని టార్గెట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడకుండానే ఈ విషయం మీద నిర్ధారణకు రావొచ్చు. సందర్భం ఉన్నా లేకపోయినా పదే పదే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లను వెటకారంగా విమర్శించే వర్మ ఇప్పుడీ నిజం ద్వారా ఎన్ని అబద్దాలు ప్రచారంలోకి తీసుకొస్తారోనని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇదైతే నిజమే.
చాలా సున్నితమైన కేసు మీద వర్మ ఇలా యూట్యూబ్ వీడియోలు చేయడం తగని పనే అయినా వినే రకం కాదు కాబట్టి వీటి వెనుక ఉద్దేశం అర్థం కావాలంటే అవన్నీ చూశాక మరింత స్ఫష్టంగా క్లారిటీ వస్తుంది. ఎన్టీఆర్ లక్ష్మి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ పూర్తిగా వన్ సైడ్ పొలిటికల్ ఎజెండా సినిమాలు తీసిన వర్మ జగన్ ని కీర్తిస్తూ ఒక మూవీని ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నాడు. వచ్చే ఎన్నికలకు కొన్ని నెలల ముందే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడీ సిరీస్ కి టైటిల్ ఎంత నిజమని పెట్టినా వర్మ గురించి తెలియనిది ఎవరికి.
This post was last modified on April 25, 2023 2:24 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…