కరోనా తర్వాత బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలిసిందే. ‘పఠాన్’ లాంటి కొన్ని సినిమాలకు మాత్రమే అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. మిగతా సినిమాలన్నీ దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. బాలీవుడ్లో ఒకప్పుడు ఫ్లాపులు, డిజాస్టర్లు లేవని కాదు. కానీ కరోనా తర్వాత పరిస్థితి బాగా సున్నితంగా తయారై.. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా మినిమం ఓపెనింగ్స్ లేని పరిస్థితి తలెత్తింది. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్ల సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు చూసి బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా పరిస్థితి ఏమవుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ సినిమా ప్రోమోలు చూసి తల పట్టుకున్న ప్రేక్షకులకు.. సినిమా చూశాక తల బొప్పి కట్టింది. హిందీ ప్రేక్షకుల పరిస్థితి ఏమో కానీ.. ఈ సినిమా చూసిన సౌత్ జనాలు, క్రిటిక్స్ బెంబేలెత్తిపోయారు. అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటి అని తీర్మానించారు. 1, 1.5 రేటింగ్స్ ఇచ్చారు. సౌత్లో ఎవ్వరూ కూడా 2 రేటింగ్కు మించి ఇచ్చింది లేదు. ఈ రోజుల్లో ఇంత ముతక సినిమా ఏంటి అంటూ సినిమాను చీల్చి చెండాడారు. హిందీలో కూడా కొందరు క్రిటిక్స్ దీన్ని చెత్త సినిమాగా తీర్మానించారు.
కానీ పేరు గొప్ప క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు మాత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ను మాస్ మసాలా ఎంటర్టైనర్, సూపర్ సినిమా అంటూ కొనియాడారు. 3 ప్లస్ రేటింగ్స్ ఇచ్చారు. సల్మాన్ మాస్ మేనియా అని.. పైసా వసూల్ సినిమా అని సినిమాను లేపాలని చూశారు. ఈ చిత్రానికి తొలి రోజు రూ.15 కోట్ల వసూళ్లే వచ్చినా, సినిమా పట్ల ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేదని అర్థమైనా వీళ్లు తగ్గలేదు. రెండో రోజు కలెక్షన్లు పెంచి ఫిగర్స్ వేయడం.. సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ బాగుందని.. సింగిల్ స్క్రీన్లలో ఇరగాడేస్తోందని హైప్ చేయడం చేశారు.
ఐతే సల్మాన్కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి వీకెండ్ వరకు సింగిల్ స్క్రీన్లలో ఓ మోస్తరుగా ఆడింది. కానీ సోమవారం సినిమా చతికిలపడింది. అయినా సదరు క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు తగ్గట్లేదు. డిజాస్టర్ అని తేలిపోయినా.. సల్మాన్ సినిమాను ఇంకా ఇంకా లేపాలనే చూస్తున్నారు. కానీ ఏం చేసినా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ పరిస్థితి మెరుగుపడేలా కనిపించడం లేదు.
This post was last modified on April 25, 2023 2:03 pm
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…