సహజంగా కొందరు దర్శకులు రెండో సినిమాకి చాలా టైమ్ తీసుకుంటారు. కథ రెడీ గా ఉన్నా హీరోల డేట్స్ , నిర్మాత సెట్ అవ్వకపోవడం ఇలాంటి కారణాల చేత కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే ఒక దర్శకుడు మాత్రం రెండో సినిమాకి ఏకంగా ఎనిమిదేళ్లు తీసుకున్నాడు. అతనే కార్తీక్ వర్మ దండు.
‘విరూపాక్ష’ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ దండు మొదటి సినిమా వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. నవదీప్ , నవీన్ చంద్ర లతో కార్తీక్ 2015 లో ‘భమ్ బోలేనాథ్’ అనే సినిమా చేశాడు. రేసీ స్క్రీన్ ప్లే తో ఎంటర్టైనింగ్ కేరెక్టర్స్ తో ఆ సినిమా బాగానే తీశాడు కానీ తొలి సినిమా దర్శకుడిగా గుర్తింపు తీసుకోలేదు.
దాంతో రెండు మూడేళ్లు కథలపై వర్క్ చేసి ఫైనల్ గా మూడేళ్ళ క్రితం సుకుమార్ దగ్గర చేరి విరూపాక్ష కథ చెప్పి ఆయన నుండి మంచి మార్కులు అందుకున్నాడు. ఇక మధ్యలో కార్తీక్ ఓ వ్యాధి తో బాధ పడ్డాడు. అది కూడా ఇన్నేళ్ల గ్యాప్ కి ఓ రీజన్. ఏదేమైనా కుర్ర దర్శకుడు బ్లాక్ మేజిక్ కథను మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చాలా కాలం తర్వాత చూపించి సూపర్ హిట్ కొట్టేశాడు. ఈ జానర్ లో తేజ్ కి ఓ హిట్ ఇచ్చి అతని కం బ్యాక్ కి మంచి ఎనర్జీ ఇచ్చాడు.
ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా విరూపాక్ష ఇచ్చిన సక్సెస్ తో కార్తీక్ వెంటనే మూడో సినిమా మొదలు పెట్టేసి వచ్చే ఏడాది మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ రైటర్ కం డైరెక్టర్ మూడో సినిమాకు మరో డిఫరెంట్ కథ ఎంచుకొని ఇంకో హిట్టు కొడితే సక్సెస్ ఫుల్ దర్శకుల లిస్టులో చేరిపోయినట్టే.
This post was last modified on April 23, 2023 7:47 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…