సహజంగా కొందరు దర్శకులు రెండో సినిమాకి చాలా టైమ్ తీసుకుంటారు. కథ రెడీ గా ఉన్నా హీరోల డేట్స్ , నిర్మాత సెట్ అవ్వకపోవడం ఇలాంటి కారణాల చేత కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే ఒక దర్శకుడు మాత్రం రెండో సినిమాకి ఏకంగా ఎనిమిదేళ్లు తీసుకున్నాడు. అతనే కార్తీక్ వర్మ దండు.
‘విరూపాక్ష’ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ దండు మొదటి సినిమా వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. నవదీప్ , నవీన్ చంద్ర లతో కార్తీక్ 2015 లో ‘భమ్ బోలేనాథ్’ అనే సినిమా చేశాడు. రేసీ స్క్రీన్ ప్లే తో ఎంటర్టైనింగ్ కేరెక్టర్స్ తో ఆ సినిమా బాగానే తీశాడు కానీ తొలి సినిమా దర్శకుడిగా గుర్తింపు తీసుకోలేదు.
దాంతో రెండు మూడేళ్లు కథలపై వర్క్ చేసి ఫైనల్ గా మూడేళ్ళ క్రితం సుకుమార్ దగ్గర చేరి విరూపాక్ష కథ చెప్పి ఆయన నుండి మంచి మార్కులు అందుకున్నాడు. ఇక మధ్యలో కార్తీక్ ఓ వ్యాధి తో బాధ పడ్డాడు. అది కూడా ఇన్నేళ్ల గ్యాప్ కి ఓ రీజన్. ఏదేమైనా కుర్ర దర్శకుడు బ్లాక్ మేజిక్ కథను మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చాలా కాలం తర్వాత చూపించి సూపర్ హిట్ కొట్టేశాడు. ఈ జానర్ లో తేజ్ కి ఓ హిట్ ఇచ్చి అతని కం బ్యాక్ కి మంచి ఎనర్జీ ఇచ్చాడు.
ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా విరూపాక్ష ఇచ్చిన సక్సెస్ తో కార్తీక్ వెంటనే మూడో సినిమా మొదలు పెట్టేసి వచ్చే ఏడాది మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ రైటర్ కం డైరెక్టర్ మూడో సినిమాకు మరో డిఫరెంట్ కథ ఎంచుకొని ఇంకో హిట్టు కొడితే సక్సెస్ ఫుల్ దర్శకుల లిస్టులో చేరిపోయినట్టే.
This post was last modified on April 23, 2023 7:47 am
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…