దిల్ రాజు కుటుంబంలో ఆయనతో పాటు సోదరుడు శిరీష్, మేనల్లుడు హర్షిత్, కూతురు హన్సిత ప్రొడక్షన్లోనే ఉన్నారు. వీళ్లే డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. ఐతే ఈ కుటుంబం నుంచి గత ఏడాది ఒక నటుడు వచ్చాడు. హీరోగా అరంగేట్రం చేశాడు. అతనే.. ఆశిష్ రెడ్డి. దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఈ ఆశిష్. ‘హషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వంలో అతను హీరోగా నటించిన ‘రౌడీ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఐతే సినిమా తేడా కొట్టినా.. ఆశిష్ పెర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి.
తొలి సినిమా అయినప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా హుషారుగా నటించి మెప్పించాడు ఆశిష్. డ్యాన్సులు, ఫైట్లలోనూ చురుకుదనం చూపించాడు. అతణ్ని చూసి లైవ్ వైర్లా ఉన్నాడు అన్న కామెంట్లు చేశారు ప్రేక్షకులు. సినిమా పోయినా హీరోకు పేరొచ్చిందని సంతోషించింది దిల్ రాజు కుటుంబం.
ఇప్పుడీ కుర్రాడు ‘సెల్ఫిష్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఇది కూడా దిల్ రాజు బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లోనే తెరకెక్కుతోంది. ఐతే దీనికి సుకుమార్ రైటింగ్స్ బేనర్ కూడా తోడవుతుండటం విశేషం. సుక్కు అసిస్టెంట్ అయిన కాశి విశాల్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యులు వరుసగా హిట్లు ఇస్తుండటం.. పోస్టర్ మీద సుకుమార్ రైటింగ్స్ పేరు కనిపిస్తే ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతుండటంతో ఆశిష్కు ‘సెల్ఫిష్’ ఆశించిన విజయాన్నందిస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో అతడికి జోడీగా క్రేజీ హీరోయిన్ని పెట్టారు. తమిళ చిత్రం ‘లవ్ టుడే’తో యూత్లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న ఇవానా ఇందులో కథానాయిక. ఆమె ఫస్ట్ లుక్ను తాజాగా లాంచ్ చేశారు. ‘లవ్ టుడే’ను తెలుగులో కూడా మంచి హిట్ చేశారు ఆడియన్స్. ఇవానాకు ఇక్కడ కూడా మంచి పాపులారిటీనే వచ్చింది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on April 22, 2023 9:19 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…