దిల్ రాజు కుటుంబంలో ఆయనతో పాటు సోదరుడు శిరీష్, మేనల్లుడు హర్షిత్, కూతురు హన్సిత ప్రొడక్షన్లోనే ఉన్నారు. వీళ్లే డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. ఐతే ఈ కుటుంబం నుంచి గత ఏడాది ఒక నటుడు వచ్చాడు. హీరోగా అరంగేట్రం చేశాడు. అతనే.. ఆశిష్ రెడ్డి. దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఈ ఆశిష్. ‘హషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వంలో అతను హీరోగా నటించిన ‘రౌడీ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఐతే సినిమా తేడా కొట్టినా.. ఆశిష్ పెర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి.
తొలి సినిమా అయినప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా హుషారుగా నటించి మెప్పించాడు ఆశిష్. డ్యాన్సులు, ఫైట్లలోనూ చురుకుదనం చూపించాడు. అతణ్ని చూసి లైవ్ వైర్లా ఉన్నాడు అన్న కామెంట్లు చేశారు ప్రేక్షకులు. సినిమా పోయినా హీరోకు పేరొచ్చిందని సంతోషించింది దిల్ రాజు కుటుంబం.
ఇప్పుడీ కుర్రాడు ‘సెల్ఫిష్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఇది కూడా దిల్ రాజు బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లోనే తెరకెక్కుతోంది. ఐతే దీనికి సుకుమార్ రైటింగ్స్ బేనర్ కూడా తోడవుతుండటం విశేషం. సుక్కు అసిస్టెంట్ అయిన కాశి విశాల్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యులు వరుసగా హిట్లు ఇస్తుండటం.. పోస్టర్ మీద సుకుమార్ రైటింగ్స్ పేరు కనిపిస్తే ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతుండటంతో ఆశిష్కు ‘సెల్ఫిష్’ ఆశించిన విజయాన్నందిస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో అతడికి జోడీగా క్రేజీ హీరోయిన్ని పెట్టారు. తమిళ చిత్రం ‘లవ్ టుడే’తో యూత్లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న ఇవానా ఇందులో కథానాయిక. ఆమె ఫస్ట్ లుక్ను తాజాగా లాంచ్ చేశారు. ‘లవ్ టుడే’ను తెలుగులో కూడా మంచి హిట్ చేశారు ఆడియన్స్. ఇవానాకు ఇక్కడ కూడా మంచి పాపులారిటీనే వచ్చింది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on April 22, 2023 9:19 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…