ఒకప్పుడు కమర్షియల్ మార్కెట్ లో మంచి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టుకునే స్థాయిలో ఉన్న మాచో స్టార్ గోపిచంద్ ను గత కొన్నేళ్లుగా పరాజయాల వెంటాడుతున్నాయి. ఏ దర్శకుడితో చేసినా కనీసం యావరేజ్ దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తనతో మూడుసార్లు జట్టు కట్టిన దర్శకుడు శ్రీవాస్ తో చేతులు కలిపి రామబాణంతో వస్తున్నాడు. వచ్చే నెల 5న విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ మీద మెల్లగా బజ్ పెరుగుతోంది. మాస్ లో ఇమేజ్ ని తిరిగి వెనక్కు తెచ్చుకునే నమ్మకంతో గోపీచంద్ ఉన్నాడు. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది.
కథేంటో గుట్టు దాచకుండా చెప్పేశారు. విదేశాల నుంచి ఒక ముఖ్యమైన పని మీద వస్తాడో యువకుడు(గోపీచంద్). నాణ్యమైన తిండి మంచి సమాజానికి దారి తీస్తుందని నమ్మి ఫుడ్డు బిజినెస్ లో ఉండే అన్నయ్య(జగపతిబాబు)కు చేదోడు వాదోడుగా ఉండటం మొదలుపెడతాడు. అయితే కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాలతో ఆడుకునే పోటీదారు(తరుణ్ ఆరోరా) వల్ల వీళ్ళ ఫ్యామిలీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. అన్నీ పనులు మాటలతోనే జరగవని గుర్తించి చేతలతో శత్రువులకు సమాధానం చెప్పడం షురూ చేస్తాడు. లక్ష్మణుడిలా ఉండే వాడు రామబాణం ఎలా అయ్యాడనేది స్టోరీ.
వీడియో మొత్తం టిపికల్ గోపీచంద్ మసాలా స్టైల్ లో ఉంది. శ్రీవాస్ ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, మాస్ అంశాలు, గ్లామర్ అన్నీ కలగలిపి ఈ రామబాణం రూపొందించినట్టు కనిపిస్తోంది. డింపుల్ హయాతి హీరోయిన్. చాలా గ్యాప్ తర్వాత భూపతిరాజా కథనందించడం విశేషం. రెగ్యులర్ ఫార్ములాలో కనిపిస్తున్నప్పటికీ కంటెంట్ కనక టైం పాస్ చేయిస్తే గోపిచంద్ కి చాలా గ్యాప్ తర్వాత హిట్ పడ్డట్టే. మే 5న అల్లరి నరేష్ ఉగ్రంతో పాటు థియేటర్లలో అడుగు పెడుతున్న రామబాణం గురి ఎలా కుదురుతుందో ఇంకో రెండు వారాల్లో తేలిపోతుంది.
This post was last modified on April 21, 2023 6:20 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…