గత ఏడాది వరస డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరైన పూజా హెగ్డే కొత్త సంవత్సరంలో కిసీకా భాయ్ కిసీకా జాన్ హిట్ తో తొలిబోణీ జరగాలని కోరుకుంటోంది. 2022లో రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇవేవి హిట్ అనిపించుకోలేకపోయాయి. హిందీలో రణ్వీర్ సింగ్ తో చేసిన సర్కస్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఫలితాల్లో తన ప్రమేయం లేకపోయినా అవన్నీ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చేసినవి కావడం వల్ల ఎంత లేదన్నా సక్సెస్ రాలేదనే బాధ ఉంటుంది. అందుకే సరిజోడి, వయసు ఇవేవి చూసుకోకుండా సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ హీరోతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది.
తీరా చూస్తే కిసీకా భాయ్ కిసీకా జాన్ కు బాలీవుడ్ లోనూ ఏమంత హైప్ కనిపించడం లేదు. సాధారణంగా కండల వీరుడి సినిమా రంజాన్ పండక్కు వస్తుందంటే ఓ రేంజ్ లో హడావిడి జరుగుతుంది. ముస్లింలతో పాటు ఇతర మతాలకు చెందిన అభిమానులు మొదటి రోజు చూసేందుకు ఎగబడతారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ దానికి తగ్గట్టు లేవు. పరిస్థితి ఎలా ఉందంటే భోళా, తూ ఝూటి మై మక్కర్ లాంటి సల్లు భాయ్ స్థాయి సినిమాలు కానివాటితో భాయ్ జాన్ ని పోలుస్తున్నారు విశ్లేషకులు. రేపు తేడా ఏమైనా వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద పడే దెబ్బ మాములుగా ఉండదు.
ఇప్పటిదాకా ఈ సినిమాకు చేసిన ప్రమోషన్ ఏ మాత్రం హైప్ ని తీసుకురాలేదు. వెంకటేష్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని తెలుగు మార్కెట్ లో వాడుకోలేదు. పూజా హెగ్డే గ్లామర్ ని గుంపులో కలిపేశారు. పాటలు ట్రోలింగ్ కి దారిచ్చాయి. నిన్న వదిలిన లుంగీ పాట మరీ అన్యాయంగా కామెంట్లకు గురయ్యింది. పిల్లల రైమ్స్ ని తీసుకుని ఖంగాళీగా ఉన్న ఈ సాంగ్ లో కండల వీరుడి స్టెప్పులు దారుణంగా ఉన్నాయి. పఠాన్ లో కనీసం సగమైనా వసూలు చేస్తుందని అసలు పెట్టుకున్న సల్మాన్ ఫ్యాన్స్ రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. అజిత్ వీరం రీమేకనే ప్రచారం ఆసక్తిని తగ్గిస్తోంది.
This post was last modified on April 20, 2023 10:52 am
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…