పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజిలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త వారం క్రితమే లీకైనప్పటికీ కొన్నిసార్లు చివరి నిమిషంలోనూ మార్పులు ఉంటాయి కాబట్టి అలాంటి ట్విస్టు ఏమైనా ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అదేమీ లేకుండా సాఫీగా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మొన్నటి నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇందులో పవన్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ సుజిత్ దీన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారట.
ఇక ప్రియాంకా మోహన్ కి జాక్ పాట్ తగిలినట్టే. గతంలో చేసిన నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ డబ్బింగ్ మూవీస్ శివ కార్తికేయన్ డాక్టర్-డాన్, సూర్య ఈటిలు ఇక్కడ బాగానే ఆడాయి. వాటిలో లుక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే సరైన ఆఫర్ కోసం ఎదురు చూసిన ప్రియాంకకు ఓజి రూపంలో కనక బ్లాక్ బస్టర్ పడితే ఇక్కడ అవకాశాలు క్యూ కడతాయి. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బోలెడుంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నల జోరు తగ్గాక శ్రీలీల తప్ప స్టార్ హీరోలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
అందుకే ఓజి సక్సెస్ కావడం తనకు చాలా కీలకం. ముంబై నుంచి తిరిగి వచ్చాక పవన్ హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ని సమాంతరంగా ప్లాన్ చేశారు కానీ అది వచ్చే నెల నుంచి ఉండొచ్చు. వినోదయ సితం రీమేక్ తాలూకు పాట ఒక్కటి ఫినిష్ చేసి డబ్బింగ్ చెప్పేస్తే దానికి సంబంధించిన టెన్షన్ పవన్ కు ఉండదు. గతంలో గ్యాంగ్ స్టర్ గా నటించిన పంజా తాలూకు గాయాలు దీంతో పూర్తిగా మాసిపోవాలని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2024 వేసవి కన్నా ముందు ఈ ఓజి విడుదలయ్యే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.
This post was last modified on April 19, 2023 12:23 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…