పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజిలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త వారం క్రితమే లీకైనప్పటికీ కొన్నిసార్లు చివరి నిమిషంలోనూ మార్పులు ఉంటాయి కాబట్టి అలాంటి ట్విస్టు ఏమైనా ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అదేమీ లేకుండా సాఫీగా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మొన్నటి నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇందులో పవన్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ సుజిత్ దీన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారట.
ఇక ప్రియాంకా మోహన్ కి జాక్ పాట్ తగిలినట్టే. గతంలో చేసిన నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ డబ్బింగ్ మూవీస్ శివ కార్తికేయన్ డాక్టర్-డాన్, సూర్య ఈటిలు ఇక్కడ బాగానే ఆడాయి. వాటిలో లుక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే సరైన ఆఫర్ కోసం ఎదురు చూసిన ప్రియాంకకు ఓజి రూపంలో కనక బ్లాక్ బస్టర్ పడితే ఇక్కడ అవకాశాలు క్యూ కడతాయి. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బోలెడుంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నల జోరు తగ్గాక శ్రీలీల తప్ప స్టార్ హీరోలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
అందుకే ఓజి సక్సెస్ కావడం తనకు చాలా కీలకం. ముంబై నుంచి తిరిగి వచ్చాక పవన్ హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ని సమాంతరంగా ప్లాన్ చేశారు కానీ అది వచ్చే నెల నుంచి ఉండొచ్చు. వినోదయ సితం రీమేక్ తాలూకు పాట ఒక్కటి ఫినిష్ చేసి డబ్బింగ్ చెప్పేస్తే దానికి సంబంధించిన టెన్షన్ పవన్ కు ఉండదు. గతంలో గ్యాంగ్ స్టర్ గా నటించిన పంజా తాలూకు గాయాలు దీంతో పూర్తిగా మాసిపోవాలని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2024 వేసవి కన్నా ముందు ఈ ఓజి విడుదలయ్యే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…