పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజిలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త వారం క్రితమే లీకైనప్పటికీ కొన్నిసార్లు చివరి నిమిషంలోనూ మార్పులు ఉంటాయి కాబట్టి అలాంటి ట్విస్టు ఏమైనా ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అదేమీ లేకుండా సాఫీగా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మొన్నటి నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇందులో పవన్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ సుజిత్ దీన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారట.
ఇక ప్రియాంకా మోహన్ కి జాక్ పాట్ తగిలినట్టే. గతంలో చేసిన నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ డబ్బింగ్ మూవీస్ శివ కార్తికేయన్ డాక్టర్-డాన్, సూర్య ఈటిలు ఇక్కడ బాగానే ఆడాయి. వాటిలో లుక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే సరైన ఆఫర్ కోసం ఎదురు చూసిన ప్రియాంకకు ఓజి రూపంలో కనక బ్లాక్ బస్టర్ పడితే ఇక్కడ అవకాశాలు క్యూ కడతాయి. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బోలెడుంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నల జోరు తగ్గాక శ్రీలీల తప్ప స్టార్ హీరోలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
అందుకే ఓజి సక్సెస్ కావడం తనకు చాలా కీలకం. ముంబై నుంచి తిరిగి వచ్చాక పవన్ హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ని సమాంతరంగా ప్లాన్ చేశారు కానీ అది వచ్చే నెల నుంచి ఉండొచ్చు. వినోదయ సితం రీమేక్ తాలూకు పాట ఒక్కటి ఫినిష్ చేసి డబ్బింగ్ చెప్పేస్తే దానికి సంబంధించిన టెన్షన్ పవన్ కు ఉండదు. గతంలో గ్యాంగ్ స్టర్ గా నటించిన పంజా తాలూకు గాయాలు దీంతో పూర్తిగా మాసిపోవాలని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2024 వేసవి కన్నా ముందు ఈ ఓజి విడుదలయ్యే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.
This post was last modified on April 19, 2023 12:23 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…