అల్లు అర్జున్ హీరోగా నటించిన సంచలన మూవీ.. పుష్ప
నిర్మాతలు, దర్శకుడి ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని నిర్మాత, దర్శకుల ఇళ్లు, కార్యాలయాలకు వచ్చిన ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి.. దాడులు చేస్తున్నట్టు తెలిసింది. దాడుల విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు.
పుష్ప.. ది రైజ్ సినిమా గత ఏడాది బాక్సాఫీసులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనా లు లేకుండానే తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ లు పుష్ప-1 మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను యువ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు.
175-200 కోట్ల రూపాయల వ్యయంతో తీసిన పుష్ప-1 కలెక్షన్లలో దూసుకుపోయింది. ఏకంగా.. 350 – 420 కోట్ల రూపాయలు రాబట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక, ఇటీవలే దీనికి సీక్వెల్ గా తీస్తున్న పుష్ప ది రూలర్(పుష్ప-2) ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఇది కూడా అంచనాలు మరింతగా పెంచేసింది. ఈ ఏడాదిలో ఈ మూవీ విడుదల కానుంది. ఇదిలావుంటే.. పుష్ప -2 ట్రైలర్ విడుదలైన వారంలోనే ఐటీ అధికారుల కన్ను ఈ మూవీ నిర్మాతలు, దర్శకుడిపై పడింది.
ఈ రోజు(బుధవారం) ఉదయం.. వారి కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఆదాయ వ్యయాలను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా పుష్ప – 2 బడ్జెట్ ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం పుష్ప నిర్మాతలు దర్శకుడి ఇంటిపై ఐటీ దాడుల వ్యవహారం సంచలనంగా మారింది.
This post was last modified on April 19, 2023 10:33 am
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…