Movie News

మైత్రి మూవీ మేక‌ర్స్‌-సుకుమార్ ఇళ్ల‌పై ఐటీ దాడులు

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన సంచ‌ల‌న మూవీ.. పుష్ప‌ నిర్మాతలు, ద‌ర్శ‌కుడి ఇళ్లు, ఆఫీసుల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు ఏక‌కాలంలో దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని నిర్మాత‌, ద‌ర్శ‌కుల ఇళ్లు, కార్యాల‌యాల‌కు వ‌చ్చిన ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి.. దాడులు చేస్తున్న‌ట్టు తెలిసింది. దాడుల విష‌యాన్ని అత్యంత ర‌హ‌స్యంగా ఉంచారు.

పుష్ప.. ది రైజ్‌ సినిమా గ‌త ఏడాది బాక్సాఫీసుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన విష‌యం తెలిసిందే. ఎలాంటి అంచ‌నా లు లేకుండానే తెర‌కెక్కిన ఈ సినిమా అనూహ్య విజ‌యాన్ని న‌మోదు చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ సార‌థ్యంలో నిర్మాత‌లు నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ లు పుష్ప‌-1 మూవీని నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను యువ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

175-200 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో తీసిన పుష్ప‌-1 క‌లెక్ష‌న్ల‌లో దూసుకుపోయింది. ఏకంగా.. 350 – 420 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టిన‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇక‌, ఇటీవ‌లే దీనికి సీక్వెల్ గా తీస్తున్న పుష్ప ది రూల‌ర్‌(పుష్ప‌-2) ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇది కూడా అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేసింది. ఈ ఏడాదిలో ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదిలావుంటే.. పుష్ప -2 ట్రైల‌ర్ విడుద‌లైన వారంలోనే ఐటీ అధికారుల క‌న్ను ఈ మూవీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిపై ప‌డింది.

ఈ రోజు(బుధ‌వారం) ఉద‌యం.. వారి కార్యాల‌యాలు, ఇళ్ల‌పై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌ధానంగా విచార‌ణ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆదాయ వ్య‌యాల‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా పుష్ప – 2 బ‌డ్జెట్ ను కూడా అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పుష్ప నిర్మాత‌లు ద‌ర్శ‌కుడి ఇంటిపై ఐటీ దాడుల వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on April 19, 2023 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

2 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

13 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

13 hours ago