మావయ్య పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ తో సముతిరఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సితం రీమేక్ తాలూకు కీలక భాగం షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. పవన్ టాకీ పార్ట్ ఎప్పుడో ఫినిష్ చేశారు. ఒక పాట చిత్రీకరణ పెండింగ్ ఉంది కానీ సమయానుకూలాన్ని బట్టి తీయాలా వద్దానేది తర్వాత నిర్ణయించబోతున్నారు. ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేకుండా స్క్రిప్ట్ ప్లాన్ చేశారట. ఇక దీని టైటిల్ గురించి పలురకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. పవన్ తేజుల మొదటి అక్షరాలాను కలిపి ప్రస్తుతానికి హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు.
దేవర, దేవుడు అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయనే టాక్ నెలక్రితమే వచ్చింది. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే సినిమా రిలీజయ్యాక టైటిల్ పెట్టే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ సూచనప్రాయంగా ఓ ఇంటర్వ్యూలో ఇది చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిజానికి ఇలాంటి ప్రయోగం గతంలో పవన్ రేంజ్ స్టార్ హీరో చేయలేదు. 1998లో జెడి చక్రవర్తి, మీనా జంటగా ఓ మూవీని ముందు పేరు లేని సినిమాగా రిలీజ్ చేశారు. తర్వాత ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు తీసుకుని పాపే నా ప్రాణంని ఫిక్స్ చేసి పబ్లిసిటీ చేశారు.
అప్పట్లో మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. తర్వాత మళ్ళీ ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఒక మల్టీ స్టారర్ కి ఇలాంటి ఆలోచన చేయడం సాహసమే. నిజంగా ఇలా చేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ విడుదలకు ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి తాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు సమకూరుస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశామని సాయిధరమ్ తేజ్ చెప్పడం చూస్తుంటే ఫ్యాన్స్ ఊహించని కంటెంటే ఉండబోతోంది.
This post was last modified on April 18, 2023 1:36 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…