విజువల్ గ్రాండియర్ గా తెగ పబ్లిసిటీ చేస్తూ వచ్చిన శాకుంతలం ఫలితం దర్శక నిర్మాతలకే కాదు అభిమానులకూ షాక్ ఇచ్చేలా ఉంది. దానికి మొదటి రోజు వసూళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ డే గ్రాస్ కేవలం 4 కోట్ల 70 లక్షలు మాత్రమేనట. షేర్ రూపంలో చూసుకుంటే 2 కోట్ల 22 లక్షల దాకా తేలుతుంది. ఇది మాములుగా చిన్న బడ్జెట్ సినిమాలకు డీసెంట్ ఫిగర్. కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో హంగామా చేసి వివిధ భాషల్లో ఒకేరోజు గ్రాండ్ రిలీజ్ జరుపుకున్న శాకుంతలం స్థాయికి ఏ మాత్రం సరితూగని నెంబర్లు ఇవి.
ఇందులో సగం తెలుగు రాష్ట్రాల నుంచి రాగా అడ్వాన్స్ బుకింగ్స్ పుణ్యమాని ఓవర్సీస్ లో డెబ్భై లక్షల దాకా వసూలు కావడం కొంత ఊరట కలిగించింది. ఇప్పుడొచ్చిన టాక్ కి పికప్ ఆశించడం కష్టమే కానీ వీకెండ్ ని ఏ మేరకు వాడుకుంటుందనే దాన్ని బట్టి నష్టాల శాతం పెరగడం తగ్గడం ఆధారపడి ఉంది. థియేట్రికల్ హక్కులను 18 కోట్ల దాకా అమ్మారట. అంటే దీనిపైనా ఇంకో కోటి వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కాదు. కానీ పరిస్థితులు చూస్తే ఇది అసాధ్యమే. ఎందుకంటే అంత మొత్తం రావాలంటే ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావాలి. పది రోజులు స్ట్రాంగ్ రన్ కొనసాగాలి.
శాకుంతలం విషయంలో అన్నీ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. సామ్ అనారోగ్యంతో రెండు రోజులు ముందే ప్రమోషన్లకు చెక్ పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ మీట్ లు పెట్టినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. పైగా తెలంగాణలో మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో మల్టీప్లెక్సుల టికెట్ ధరలు గరిష్టంగా 295 రూపాయలతో పాటు అదనంగా 35 రూపాయలు త్రీడి చార్జీలు పెట్టేయడంతో ఇప్పుడిది బూమరాంగ్ లా రివర్స్ అయ్యేలా ఉంది. అలా అని తక్కువ రేట్లున్న ఏపిలో కలెక్షన్ల వర్షం కురవడం లేదు కానీ నైజామ్ ఎఫెక్ట్ మాత్రం తీవ్రంగా ఉంటుంది.
This post was last modified on April 15, 2023 3:38 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…