గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రాబోతుంది. మైథాలాజికల్ డ్రామాతో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ వచ్చింది సమంత. అనారోగ్యం నుండి కోలుకోవడంతో మీడియా ముందు కాస్త యాక్టివ్ గా కనిపించింది.
అయితే ఈ సినిమాకు రెండ్రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. చూసిన అందరూ సమంత నటన గురించి చెప్తున్నారు. శకుంతల దేవిగా సామ్ ఆకట్టుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరో లేరు. దుష్యంత్ మహారాజ్ గా నటించిన మలయాళం హీరో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. దీంతో శాకుంతలం కి ఓపెనింగ్స్ తెచ్చే భారమంతా సమంత పైనే పడింది.
ఓ బేబీ , యశోద సినిమాలతో సమంత మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మూడు, నాలుగు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ అనాలసిస్ తోనే ఇప్పుడు గుణ శేఖర్, దిల్ రాజు ధీమాగా ఉన్నారు. ఏదేమైనా ఈ సినిమాకి ప్రేక్షకులను తీసుకొచ్చే మొత్తం భాద్యత సమంత మీదే ఉంది. మరి సమంతను నమ్ముకొని ఈ భారీ బడ్జెట్ 3d సినిమా తీసిన గుణ శేఖర్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ?
This post was last modified on April 12, 2023 4:23 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…