గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రాబోతుంది. మైథాలాజికల్ డ్రామాతో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ వచ్చింది సమంత. అనారోగ్యం నుండి కోలుకోవడంతో మీడియా ముందు కాస్త యాక్టివ్ గా కనిపించింది.
అయితే ఈ సినిమాకు రెండ్రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. చూసిన అందరూ సమంత నటన గురించి చెప్తున్నారు. శకుంతల దేవిగా సామ్ ఆకట్టుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరో లేరు. దుష్యంత్ మహారాజ్ గా నటించిన మలయాళం హీరో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. దీంతో శాకుంతలం కి ఓపెనింగ్స్ తెచ్చే భారమంతా సమంత పైనే పడింది.
ఓ బేబీ , యశోద సినిమాలతో సమంత మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మూడు, నాలుగు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ అనాలసిస్ తోనే ఇప్పుడు గుణ శేఖర్, దిల్ రాజు ధీమాగా ఉన్నారు. ఏదేమైనా ఈ సినిమాకి ప్రేక్షకులను తీసుకొచ్చే మొత్తం భాద్యత సమంత మీదే ఉంది. మరి సమంతను నమ్ముకొని ఈ భారీ బడ్జెట్ 3d సినిమా తీసిన గుణ శేఖర్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ?
This post was last modified on April 12, 2023 4:23 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…