గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రాబోతుంది. మైథాలాజికల్ డ్రామాతో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ వచ్చింది సమంత. అనారోగ్యం నుండి కోలుకోవడంతో మీడియా ముందు కాస్త యాక్టివ్ గా కనిపించింది.
అయితే ఈ సినిమాకు రెండ్రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. చూసిన అందరూ సమంత నటన గురించి చెప్తున్నారు. శకుంతల దేవిగా సామ్ ఆకట్టుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరో లేరు. దుష్యంత్ మహారాజ్ గా నటించిన మలయాళం హీరో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. దీంతో శాకుంతలం కి ఓపెనింగ్స్ తెచ్చే భారమంతా సమంత పైనే పడింది.
ఓ బేబీ , యశోద సినిమాలతో సమంత మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మూడు, నాలుగు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ అనాలసిస్ తోనే ఇప్పుడు గుణ శేఖర్, దిల్ రాజు ధీమాగా ఉన్నారు. ఏదేమైనా ఈ సినిమాకి ప్రేక్షకులను తీసుకొచ్చే మొత్తం భాద్యత సమంత మీదే ఉంది. మరి సమంతను నమ్ముకొని ఈ భారీ బడ్జెట్ 3d సినిమా తీసిన గుణ శేఖర్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ?
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…