టాలీవుడ్ లోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లతో ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతూ వేల కోట్ల పెట్టుబడితో దూసుకుపోతోంది. అయితే ఖరీదైన చీర మీద మసాలా మరకలు పడితే దాని విలువ తగ్గిపోయిన తీరుగా. చిన్న చిత్రాల విషయంలో మైత్రి అనుసరిస్తున్న ధోరణి క్రమంగా ఈ దిశగానే తీసుకెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న విడుదలైన మీటర్ కు యునానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఎంత ఆ సంస్థ సిఓఓకు మద్దతుగా భాగస్వామ్యం తీసుకున్నా ఫలితంలో వాటా మైత్రికీ చెందుతుంది.
ఇదే కాదు గత ఏడాది సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తీసిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన హ్యాపీ బర్త్ డే ఎంత పెద్ద ఫ్లాపో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క మత్తు వదలరా మాత్రమే సేఫ్ బెట్ అయ్యిందే తప్ప మిగిలినవన్నీ తేడా కొట్టినవే. వీటికయ్యే బడ్జెట్ ఖర్చు తక్కువే కావొచ్చు. డిజిటల్ శాటిలైట్ తదితర హక్కుల ద్వారా లాభాలే వచ్చి ఉండొచ్చు. కానీ అంతిమంగా బాక్సాఫీస్ రిజల్ట్ నే కొలమానంగా చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే.
సురేష్ ప్రొడక్షన్స్ సైతం ఒకప్పుడు ఇదే సమస్యతో ఇబ్బంది పడి ఆదాయంతో సంబంధం లేకుండా వర్కౌట్ కావని అర్థమైన చిన్న సినిమాలను తీయడం ఆపేసింది. రామానాయుడుగారు కాలం చేశాక సురేష్ బాబు తన నిర్ణయాల విషయంలో క్యాలికులేటెడ్ గా ఉండటం మొదలుపెట్టారు. ఇప్పుడు మైత్రికి ఇలాంటి చేంజోవర్ అవసరమనిపిస్తోంది. పుష్ప 2 ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, ఖుషి, జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇలా ఇంత భారీ లైనప్ పెట్టుకుని రిస్క్ లేదనే కారణం చూపి చిన్న సినిమాలకు టెంప్ట్ అయితే అది బ్రాండ్ ఇమేజ్ కే ఇబ్బందిగా మారుతుంది.
This post was last modified on April 8, 2023 11:31 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…