అదేంటి ఒక్క రూపాయికి చాక్లెట్ రావడమే కష్టమనుకుంటే థియేటర్ కంటెంట్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. పెద్దగా ఆడియన్స్ రాని డ్రై సీజన్ లో మల్టీప్లెక్సులకు రెవిన్యూ రావడం పెద్ద సవాల్ గా మారిపోయింది. అప్పుడప్పుడు టికెట్ ధరలు 110 రూపాయలు పెట్టినా, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇచ్చినా సరిపోవడం లేదు. అందుకే ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో కార్పొరేట్ సంస్థలు ఎంబిఏలో చదివే మార్కెటింగ్ ఎత్తుగడలను ఎంచుకుంటున్నాయి. సుప్రసిద్ధ పివిఆర్ చైన్ ఇప్పుడదే దారిపట్టి కొత్త ట్రెండ్ ని పరిచయం చేయాలని చూస్తోంది.
ఇదేంటంటే కేవలం ఒక్క రూపాయి చెల్లించి పివిఆర్ స్క్రీన్ లో 30 నిమిషాల పాటు బాలీవుడ్ హాలీవుడ్ తో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించిన సరికొత్త ట్రైలర్లు వెండితెర మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు. పూర్తి ఏసీ గాలిని ఎంజాయ్ చేయడంతో పాటు తోచినవి కొనుక్కుని తినొచ్చు. అయితే ఫ్రీగా యూట్యూబ్ లో దొరికే వాటిని ఇలా స్క్రీన్ మీద అదే పనిగా చూసేందుకు ఎవరొస్తారనే సందేహం కలగొచ్చు. కానీ ఇక్కడో స్ట్రాటజీ ఉంది. అదే పనిగా ఎవరు రారు నిజమే. అయితే షాపింగ్ కోసం వచ్చి కాసేపు బ్రేక్ కావాలని చూస్తున్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది.
దీంతో తమ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో కొత్త ఆడియన్స్ కి కేవలం ఒక్క రూపాయికే చూపించినట్టు అవుతుంది. కోట్లు పెట్టి టీవీలో పేపర్లలో యాడ్స్ ఇవ్వడం కన్నా కరెంట్ ఖర్చుని భరించి ఇలా ట్రైలర్లు వేయడం వల్ల వచ్చే నష్టం తక్కువ కదా. పైగా ఇలా వేస్తున్నందుకు సదరు నిర్మాతల దగ్గర నుంచి ఎలాగూ డబ్బులు ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ స్క్రీనింగ్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో అమలవుతోంది. త్వరలో హైదరాబాద్ కు రానుంది. ఎప్పుడో జెమిని ఛానల్ లో బయోస్కోప్ పేరుతో వచ్చే ట్రైలర్లని జనం కళ్లప్పగించి చూసేవాళ్ళు. ఇప్పుడదే మల్టీప్లెక్సులో చూసుకోవచ్చు.
This post was last modified on April 6, 2023 6:54 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…