Movie News

ఒక్క రూపాయికి మల్టీప్లెక్స్ అనుభూతి

అదేంటి ఒక్క రూపాయికి చాక్లెట్ రావడమే కష్టమనుకుంటే థియేటర్ కంటెంట్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. పెద్దగా ఆడియన్స్ రాని డ్రై సీజన్ లో మల్టీప్లెక్సులకు రెవిన్యూ రావడం పెద్ద సవాల్ గా మారిపోయింది. అప్పుడప్పుడు టికెట్ ధరలు 110 రూపాయలు పెట్టినా, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇచ్చినా సరిపోవడం లేదు. అందుకే ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో కార్పొరేట్ సంస్థలు ఎంబిఏలో చదివే మార్కెటింగ్ ఎత్తుగడలను ఎంచుకుంటున్నాయి. సుప్రసిద్ధ పివిఆర్ చైన్ ఇప్పుడదే దారిపట్టి కొత్త ట్రెండ్ ని పరిచయం చేయాలని చూస్తోంది.

ఇదేంటంటే కేవలం ఒక్క రూపాయి చెల్లించి పివిఆర్ స్క్రీన్ లో 30 నిమిషాల పాటు బాలీవుడ్ హాలీవుడ్ తో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించిన సరికొత్త ట్రైలర్లు వెండితెర మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు. పూర్తి ఏసీ గాలిని ఎంజాయ్ చేయడంతో పాటు తోచినవి కొనుక్కుని తినొచ్చు. అయితే ఫ్రీగా యూట్యూబ్ లో దొరికే వాటిని ఇలా స్క్రీన్ మీద అదే పనిగా చూసేందుకు ఎవరొస్తారనే సందేహం కలగొచ్చు. కానీ ఇక్కడో స్ట్రాటజీ ఉంది. అదే పనిగా ఎవరు రారు నిజమే. అయితే షాపింగ్ కోసం వచ్చి కాసేపు బ్రేక్ కావాలని చూస్తున్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది.

దీంతో తమ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో కొత్త ఆడియన్స్ కి కేవలం ఒక్క రూపాయికే చూపించినట్టు అవుతుంది. కోట్లు పెట్టి టీవీలో పేపర్లలో యాడ్స్ ఇవ్వడం కన్నా కరెంట్ ఖర్చుని భరించి ఇలా ట్రైలర్లు వేయడం వల్ల వచ్చే నష్టం తక్కువ కదా. పైగా ఇలా వేస్తున్నందుకు సదరు నిర్మాతల దగ్గర నుంచి ఎలాగూ డబ్బులు ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ స్క్రీనింగ్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో అమలవుతోంది. త్వరలో హైదరాబాద్ కు రానుంది. ఎప్పుడో జెమిని ఛానల్ లో బయోస్కోప్ పేరుతో వచ్చే ట్రైలర్లని జనం కళ్లప్పగించి చూసేవాళ్ళు. ఇప్పుడదే మల్టీప్లెక్సులో చూసుకోవచ్చు.

This post was last modified on April 6, 2023 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

11 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

34 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

44 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago