Movie News

ఆమిర్ అన్నారు.. షారుఖ్ అన్నారు.. చివరికి

బయోపిక్స్ తీయడంలో బాలీవుడ్ ఫిలిం మేకర్ల స్టయిలే వేరు. ఇందులో మంచి నైపుణ్యం సాధించి.. ఎన్నో క్లాసిక్స్ అందించారు. భారీ విజయాలందుకున్నారు. ఈ కోవలోనే చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి కొన్నేళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. ముందుగా ఈ చిత్రానికి కథానాయకుడిగా వినిపించిన పేరు ఆమిర్‌ ఖాన్‌దే. అతను కూడా సానుకూలంగానే కనిపించాడు. కానీ కారణాలేంటో తెలియదు కానీ అతడి స్థానంలోకి షారుఖ్ వచ్చినట్లు అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మించనున్న యూటీవీ పిక్చర్స్ అధినేత సిద్దార్థ్ రాయ్ కపూర్ కూడా గతంలో ఇందులో షారుఖే హీరో అని ధ్రువీకరించాడు. ఈ చిత్రానికి ‘సెల్యూట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు చెప్పుకున్నారు. ఇది రెండేళ్ల కిందటి మాట.

కానీ తర్వాత రకరకాల మార్పులు జరిగాయి. షారుఖ్ ఈ సినిమా చేయలేనంటూ తప్పుకునేశాడు. తర్వాత రణబీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. అతనూ ఖరారవ్వలేదు. ఆపై విక్కీ కౌశల్ పేరు వినిపించింది. కానీ అతనూ ఓకే చేయలేదు. చివరికిప్పుడు డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్‌తో ఈ సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. ఇంతకుముందు అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’లో ఫర్హాన్ అదరగొట్టాడు. మరోసారి అలాంటి సవాల్ స్వీకరించడానికి ఫర్హాన్ రెడీ అయ్యాడు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, బ్రోకెన్ థ్రెడ్ లాంటి గొప్ప సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మహేష్ మథాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది యూటీవీ పిక్చర్స్. వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారట.

This post was last modified on July 30, 2020 9:20 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

1 hour ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

2 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

3 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

4 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

4 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

5 hours ago