తాజాగా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని ఫ్యామిలీస్ తో కలిసి చూడొద్దని రానా ముందే చెప్పినప్పటికీ యథాలాపంగా చూసేసిన కుటుంబాలు ఉన్నాయని సోషల్ మీడియా రియాక్షన్లను బట్టి అర్థమవుతోంది.
ఇలాంటి కంటెంట్ లో రానా నటించడం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నెగటివ్ తో కూడుకుని సోలో హీరోగా దాకా తను అన్ని రకాల పాత్రలు ట్రై చేశాడు. ప్రత్యేకంగా వందల కోట్ల మార్కెట్ అంటూ ఏదీ లేదు. వర్సటైల్ నటుడు అనే పేరు తెచ్చుకున్నాడు.
కానీ వెంకటేష్ సంగతి వేరు. ముప్పై అయిదేళ్ల సుదీర్ఘ అనుభవమున్న దగ్గుబాటి నట అగ్రతార వెంకటేష్ ఇలా చేయడం పట్లే అందరి కంప్లయింట్. బాబాయ్ మీద వస్తున్న కామెంట్లు గమనించిన రానా డ్యామేజ్ రిపేర్ పనిలో పడ్డాడు. ట్విట్టర్ లో ఈ సిరీస్ మీద వ్యక్తమవుతున్న అభిప్రాయాలు అభ్యంతరాలు ఒక్కొక్కటి గమనిస్తూ ముఖ్యమైన వాటికి సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివి చేయోద్దని వాళ్ళ మాటలను గౌరవిస్తూనే ఇందులో బూతుని అసభ్యతను లాజికల్ గా సమర్థిస్తున్న వాళ్ళను కరెక్టేగా అంటూ ప్రోత్సహిస్తున్నాడు.
అతిగా మాత్రం సమర్ధించుకోవడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రానా నాయుడు సెకండ్ సీజన్ కు ఆల్రెడీ బాబాయ్ అబ్బాయ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని ఆధారంగా చేసుకుని కొన్ని కీలక మార్పులు చేయమని దర్శకులు కరణ్ అంశుమన్ – సుపర్న్ వర్మలకు సూచించినట్టు తెలిసింది. అధిక శాతం అభిమానులు సైతం రానా నాయుడు పట్ల హ్యాపీగా లేరు. మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటారో లేక ఫస్ట్ సీజన్ తోనే ముగింపు పలుకుతారో చెప్పలేం. నెగటివ్ అయినా సరే ఇంత రెస్పాన్స్ చూశాక నెట్ ఫ్లిక్స్ ఇక్కడితో ఆగుతుందా
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…