తాజాగా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని ఫ్యామిలీస్ తో కలిసి చూడొద్దని రానా ముందే చెప్పినప్పటికీ యథాలాపంగా చూసేసిన కుటుంబాలు ఉన్నాయని సోషల్ మీడియా రియాక్షన్లను బట్టి అర్థమవుతోంది.
ఇలాంటి కంటెంట్ లో రానా నటించడం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నెగటివ్ తో కూడుకుని సోలో హీరోగా దాకా తను అన్ని రకాల పాత్రలు ట్రై చేశాడు. ప్రత్యేకంగా వందల కోట్ల మార్కెట్ అంటూ ఏదీ లేదు. వర్సటైల్ నటుడు అనే పేరు తెచ్చుకున్నాడు.
కానీ వెంకటేష్ సంగతి వేరు. ముప్పై అయిదేళ్ల సుదీర్ఘ అనుభవమున్న దగ్గుబాటి నట అగ్రతార వెంకటేష్ ఇలా చేయడం పట్లే అందరి కంప్లయింట్. బాబాయ్ మీద వస్తున్న కామెంట్లు గమనించిన రానా డ్యామేజ్ రిపేర్ పనిలో పడ్డాడు. ట్విట్టర్ లో ఈ సిరీస్ మీద వ్యక్తమవుతున్న అభిప్రాయాలు అభ్యంతరాలు ఒక్కొక్కటి గమనిస్తూ ముఖ్యమైన వాటికి సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివి చేయోద్దని వాళ్ళ మాటలను గౌరవిస్తూనే ఇందులో బూతుని అసభ్యతను లాజికల్ గా సమర్థిస్తున్న వాళ్ళను కరెక్టేగా అంటూ ప్రోత్సహిస్తున్నాడు.
అతిగా మాత్రం సమర్ధించుకోవడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రానా నాయుడు సెకండ్ సీజన్ కు ఆల్రెడీ బాబాయ్ అబ్బాయ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని ఆధారంగా చేసుకుని కొన్ని కీలక మార్పులు చేయమని దర్శకులు కరణ్ అంశుమన్ – సుపర్న్ వర్మలకు సూచించినట్టు తెలిసింది. అధిక శాతం అభిమానులు సైతం రానా నాయుడు పట్ల హ్యాపీగా లేరు. మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటారో లేక ఫస్ట్ సీజన్ తోనే ముగింపు పలుకుతారో చెప్పలేం. నెగటివ్ అయినా సరే ఇంత రెస్పాన్స్ చూశాక నెట్ ఫ్లిక్స్ ఇక్కడితో ఆగుతుందా
This post was last modified on March 12, 2023 12:39 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…