తాజాగా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని ఫ్యామిలీస్ తో కలిసి చూడొద్దని రానా ముందే చెప్పినప్పటికీ యథాలాపంగా చూసేసిన కుటుంబాలు ఉన్నాయని సోషల్ మీడియా రియాక్షన్లను బట్టి అర్థమవుతోంది.
ఇలాంటి కంటెంట్ లో రానా నటించడం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నెగటివ్ తో కూడుకుని సోలో హీరోగా దాకా తను అన్ని రకాల పాత్రలు ట్రై చేశాడు. ప్రత్యేకంగా వందల కోట్ల మార్కెట్ అంటూ ఏదీ లేదు. వర్సటైల్ నటుడు అనే పేరు తెచ్చుకున్నాడు.
కానీ వెంకటేష్ సంగతి వేరు. ముప్పై అయిదేళ్ల సుదీర్ఘ అనుభవమున్న దగ్గుబాటి నట అగ్రతార వెంకటేష్ ఇలా చేయడం పట్లే అందరి కంప్లయింట్. బాబాయ్ మీద వస్తున్న కామెంట్లు గమనించిన రానా డ్యామేజ్ రిపేర్ పనిలో పడ్డాడు. ట్విట్టర్ లో ఈ సిరీస్ మీద వ్యక్తమవుతున్న అభిప్రాయాలు అభ్యంతరాలు ఒక్కొక్కటి గమనిస్తూ ముఖ్యమైన వాటికి సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివి చేయోద్దని వాళ్ళ మాటలను గౌరవిస్తూనే ఇందులో బూతుని అసభ్యతను లాజికల్ గా సమర్థిస్తున్న వాళ్ళను కరెక్టేగా అంటూ ప్రోత్సహిస్తున్నాడు.
అతిగా మాత్రం సమర్ధించుకోవడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రానా నాయుడు సెకండ్ సీజన్ కు ఆల్రెడీ బాబాయ్ అబ్బాయ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని ఆధారంగా చేసుకుని కొన్ని కీలక మార్పులు చేయమని దర్శకులు కరణ్ అంశుమన్ – సుపర్న్ వర్మలకు సూచించినట్టు తెలిసింది. అధిక శాతం అభిమానులు సైతం రానా నాయుడు పట్ల హ్యాపీగా లేరు. మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటారో లేక ఫస్ట్ సీజన్ తోనే ముగింపు పలుకుతారో చెప్పలేం. నెగటివ్ అయినా సరే ఇంత రెస్పాన్స్ చూశాక నెట్ ఫ్లిక్స్ ఇక్కడితో ఆగుతుందా
This post was last modified on March 12, 2023 12:39 pm
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…