తాజాగా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని ఫ్యామిలీస్ తో కలిసి చూడొద్దని రానా ముందే చెప్పినప్పటికీ యథాలాపంగా చూసేసిన కుటుంబాలు ఉన్నాయని సోషల్ మీడియా రియాక్షన్లను బట్టి అర్థమవుతోంది.
ఇలాంటి కంటెంట్ లో రానా నటించడం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నెగటివ్ తో కూడుకుని సోలో హీరోగా దాకా తను అన్ని రకాల పాత్రలు ట్రై చేశాడు. ప్రత్యేకంగా వందల కోట్ల మార్కెట్ అంటూ ఏదీ లేదు. వర్సటైల్ నటుడు అనే పేరు తెచ్చుకున్నాడు.
కానీ వెంకటేష్ సంగతి వేరు. ముప్పై అయిదేళ్ల సుదీర్ఘ అనుభవమున్న దగ్గుబాటి నట అగ్రతార వెంకటేష్ ఇలా చేయడం పట్లే అందరి కంప్లయింట్. బాబాయ్ మీద వస్తున్న కామెంట్లు గమనించిన రానా డ్యామేజ్ రిపేర్ పనిలో పడ్డాడు. ట్విట్టర్ లో ఈ సిరీస్ మీద వ్యక్తమవుతున్న అభిప్రాయాలు అభ్యంతరాలు ఒక్కొక్కటి గమనిస్తూ ముఖ్యమైన వాటికి సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివి చేయోద్దని వాళ్ళ మాటలను గౌరవిస్తూనే ఇందులో బూతుని అసభ్యతను లాజికల్ గా సమర్థిస్తున్న వాళ్ళను కరెక్టేగా అంటూ ప్రోత్సహిస్తున్నాడు.
అతిగా మాత్రం సమర్ధించుకోవడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రానా నాయుడు సెకండ్ సీజన్ కు ఆల్రెడీ బాబాయ్ అబ్బాయ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని ఆధారంగా చేసుకుని కొన్ని కీలక మార్పులు చేయమని దర్శకులు కరణ్ అంశుమన్ – సుపర్న్ వర్మలకు సూచించినట్టు తెలిసింది. అధిక శాతం అభిమానులు సైతం రానా నాయుడు పట్ల హ్యాపీగా లేరు. మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటారో లేక ఫస్ట్ సీజన్ తోనే ముగింపు పలుకుతారో చెప్పలేం. నెగటివ్ అయినా సరే ఇంత రెస్పాన్స్ చూశాక నెట్ ఫ్లిక్స్ ఇక్కడితో ఆగుతుందా
This post was last modified on March 12, 2023 12:39 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…