టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు రోజుల కిందట ఒక ప్రెస్ మీట్లో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీశాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని.. ఆ డబ్బు ఇస్తే 8-10 సినిమాలు తీసి ఇచ్చేవాళ్లమని ఆయన ఎద్దేవా చేశారు. ఐతే ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమాను ఆస్కార్ అవార్డుల కొంత బడ్జెట్ పెట్టి ప్రమోట్ చేస్తే తప్పేంటని.. అయినా ఆ బడ్జెట్ రూ.80 కోట్లని ఎవరు చెప్పారు అంటూ ఆయన గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.
రాజమౌళి గురువు అయిన లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సహా పలువురు తమ్మారెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ జాబితాలోకి మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరారు. ఆయన కూడా తమ్మారెడ్డిని కౌంటర్ చేస్తే ఒక ట్వీట్ వేశారు.
కాకపోతే ఆ ట్వీట్లో భాగంగా నాగబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి లాగడం తమ్మారెడ్డిని చాలా పెద్ద మాట అనేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. “To Whomever It May Concern : “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం).. ఇదీ నాగబాబు ట్వీట్. ఐతే ఆయన విమర్శించాలంటే తమ్మారెడ్డిని నేరుగా విమర్శించవచ్చు కానీ.. మధ్యలో వైసీపీ వారి భాష అంటూ నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ భాష అంటూ తమ్మారెడ్డిని అంత మాట అనడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విమర్శ వైసీపీ వాళ్లు ఎవరైనా చేసి ఉంటే.. వాళ్లకు వైసీపీ భాషలోనే సమాధానం అంటూ నాగబాబు ఇలా కౌంటర్ వేసి ఉంటే బాగుండేదని.. కానీ తమ్మారెడ్డిని వైసీపీ భాషలో తిట్టడం ఏంటని అంటున్నారు నెటిజన్లు. తమ్మారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘సార్’ సినిమాను కొనియాడుతూ జగన్ సర్కారు ఏపీలో స్కూళ్లను బాగు చేస్తున్నట్లుగా మాట్లాడిన నేపథ్యంలో ఆయన్ని వైసీపీ మద్దతుదారుగా భావించి నాగబాబు ఇలా అని ఉండొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on March 10, 2023 2:48 pm
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…
ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా అందుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను ప్రభుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…
హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…