టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు రోజుల కిందట ఒక ప్రెస్ మీట్లో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీశాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని.. ఆ డబ్బు ఇస్తే 8-10 సినిమాలు తీసి ఇచ్చేవాళ్లమని ఆయన ఎద్దేవా చేశారు. ఐతే ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమాను ఆస్కార్ అవార్డుల కొంత బడ్జెట్ పెట్టి ప్రమోట్ చేస్తే తప్పేంటని.. అయినా ఆ బడ్జెట్ రూ.80 కోట్లని ఎవరు చెప్పారు అంటూ ఆయన గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.
రాజమౌళి గురువు అయిన లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సహా పలువురు తమ్మారెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ జాబితాలోకి మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరారు. ఆయన కూడా తమ్మారెడ్డిని కౌంటర్ చేస్తే ఒక ట్వీట్ వేశారు.
కాకపోతే ఆ ట్వీట్లో భాగంగా నాగబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి లాగడం తమ్మారెడ్డిని చాలా పెద్ద మాట అనేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. “To Whomever It May Concern : “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం).. ఇదీ నాగబాబు ట్వీట్. ఐతే ఆయన విమర్శించాలంటే తమ్మారెడ్డిని నేరుగా విమర్శించవచ్చు కానీ.. మధ్యలో వైసీపీ వారి భాష అంటూ నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ భాష అంటూ తమ్మారెడ్డిని అంత మాట అనడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విమర్శ వైసీపీ వాళ్లు ఎవరైనా చేసి ఉంటే.. వాళ్లకు వైసీపీ భాషలోనే సమాధానం అంటూ నాగబాబు ఇలా కౌంటర్ వేసి ఉంటే బాగుండేదని.. కానీ తమ్మారెడ్డిని వైసీపీ భాషలో తిట్టడం ఏంటని అంటున్నారు నెటిజన్లు. తమ్మారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘సార్’ సినిమాను కొనియాడుతూ జగన్ సర్కారు ఏపీలో స్కూళ్లను బాగు చేస్తున్నట్లుగా మాట్లాడిన నేపథ్యంలో ఆయన్ని వైసీపీ మద్దతుదారుగా భావించి నాగబాబు ఇలా అని ఉండొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on March 10, 2023 2:48 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…