టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు రోజుల కిందట ఒక ప్రెస్ మీట్లో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీశాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని.. ఆ డబ్బు ఇస్తే 8-10 సినిమాలు తీసి ఇచ్చేవాళ్లమని ఆయన ఎద్దేవా చేశారు. ఐతే ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమాను ఆస్కార్ అవార్డుల కొంత బడ్జెట్ పెట్టి ప్రమోట్ చేస్తే తప్పేంటని.. అయినా ఆ బడ్జెట్ రూ.80 కోట్లని ఎవరు చెప్పారు అంటూ ఆయన గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.
రాజమౌళి గురువు అయిన లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సహా పలువురు తమ్మారెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ జాబితాలోకి మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరారు. ఆయన కూడా తమ్మారెడ్డిని కౌంటర్ చేస్తే ఒక ట్వీట్ వేశారు.
కాకపోతే ఆ ట్వీట్లో భాగంగా నాగబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి లాగడం తమ్మారెడ్డిని చాలా పెద్ద మాట అనేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. “To Whomever It May Concern : “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం).. ఇదీ నాగబాబు ట్వీట్. ఐతే ఆయన విమర్శించాలంటే తమ్మారెడ్డిని నేరుగా విమర్శించవచ్చు కానీ.. మధ్యలో వైసీపీ వారి భాష అంటూ నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ భాష అంటూ తమ్మారెడ్డిని అంత మాట అనడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విమర్శ వైసీపీ వాళ్లు ఎవరైనా చేసి ఉంటే.. వాళ్లకు వైసీపీ భాషలోనే సమాధానం అంటూ నాగబాబు ఇలా కౌంటర్ వేసి ఉంటే బాగుండేదని.. కానీ తమ్మారెడ్డిని వైసీపీ భాషలో తిట్టడం ఏంటని అంటున్నారు నెటిజన్లు. తమ్మారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘సార్’ సినిమాను కొనియాడుతూ జగన్ సర్కారు ఏపీలో స్కూళ్లను బాగు చేస్తున్నట్లుగా మాట్లాడిన నేపథ్యంలో ఆయన్ని వైసీపీ మద్దతుదారుగా భావించి నాగబాబు ఇలా అని ఉండొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on March 10, 2023 2:48 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…