హైదరాబాదులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటివరకు సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించాలని కంకణం కట్టుకున్న మెగాస్టార్, రాజమౌళి వంటి దిగ్గజాలు కూడా.. కామ్ గా ఇంటికే పరిమితమైపోయారు.
ఈ తరుణంలో కొంతమంది హీరోలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే.. ఇక వారి కుటుంబం సమక్షంలో మాత్రమే అంతా జరుగుతుందని అందరూ ఆశించారు. అయితే రాను రాను మనోళ్ళు కరోనాకు పెద్దగా భయపడట్లేదని అంటున్నారు చూపరులు.
నిజానికి కరోనా ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ తరహాలో చాలామంది రావడమే కాదు, చాలామందికి నయం అయిపోతోంది కూడా. అలాగే సదరు వైరస్ న మనం తేలికగా తీసుకోలేం కాని, మన టాలీవుడ్లో మాత్రం నిధానంగా జనాలు భయపడటం అనేది తగ్గుతోందట. ముఖ్యంగా హీరోలు ఒక్కరొక్కరుగా భయాన్ని పక్కనపెడుతున్నారని నితిన్ పెళ్ళికి వచ్చిన గెస్టులను చూస్తుంటే తెలుస్తోంది.
వరుణ్ తేజ్, కార్తికేయ, సాయిధరమ్ తేజ్ మొదలగు హీరోలు అలాగే హైదరాబాదులోనే ఉంటున్న కొందరు హీరోయిన్లు నితిన్ పెళ్ళికి వెళ్ళినట్లు టాక్ వస్తోంది. చక్కగా మాస్కు పెట్టుకుని చేతిలో శానిటైజర్ బాటిల్ పెట్టుకుని వీళ్లు నితిన్ కు కంగ్రాట్స్ చెప్పడానికి ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారట.
ఆల్రెడీ కొందరు స్టార్లు పార్టీలు మొదలుపెట్టేశారు. కొందరేమో మీటింగులు కూడా పెడుతున్నారు. ఇక కొందరు షూటింగులు కూడా పెడుతున్నారు కాని ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెనకంజ వేస్తున్నారు. షూటింగుల పరిస్థితి అటుంచితే, తదుపరి రానా పెళ్ళికి అలాగే నిహారిక ఎంగేజ్మెంట్ కు ఎంతమంది వస్తారో చూడాలి మరి.
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…