హైదరాబాదులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటివరకు సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించాలని కంకణం కట్టుకున్న మెగాస్టార్, రాజమౌళి వంటి దిగ్గజాలు కూడా.. కామ్ గా ఇంటికే పరిమితమైపోయారు.
ఈ తరుణంలో కొంతమంది హీరోలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే.. ఇక వారి కుటుంబం సమక్షంలో మాత్రమే అంతా జరుగుతుందని అందరూ ఆశించారు. అయితే రాను రాను మనోళ్ళు కరోనాకు పెద్దగా భయపడట్లేదని అంటున్నారు చూపరులు.
నిజానికి కరోనా ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ తరహాలో చాలామంది రావడమే కాదు, చాలామందికి నయం అయిపోతోంది కూడా. అలాగే సదరు వైరస్ న మనం తేలికగా తీసుకోలేం కాని, మన టాలీవుడ్లో మాత్రం నిధానంగా జనాలు భయపడటం అనేది తగ్గుతోందట. ముఖ్యంగా హీరోలు ఒక్కరొక్కరుగా భయాన్ని పక్కనపెడుతున్నారని నితిన్ పెళ్ళికి వచ్చిన గెస్టులను చూస్తుంటే తెలుస్తోంది.
వరుణ్ తేజ్, కార్తికేయ, సాయిధరమ్ తేజ్ మొదలగు హీరోలు అలాగే హైదరాబాదులోనే ఉంటున్న కొందరు హీరోయిన్లు నితిన్ పెళ్ళికి వెళ్ళినట్లు టాక్ వస్తోంది. చక్కగా మాస్కు పెట్టుకుని చేతిలో శానిటైజర్ బాటిల్ పెట్టుకుని వీళ్లు నితిన్ కు కంగ్రాట్స్ చెప్పడానికి ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారట.
ఆల్రెడీ కొందరు స్టార్లు పార్టీలు మొదలుపెట్టేశారు. కొందరేమో మీటింగులు కూడా పెడుతున్నారు. ఇక కొందరు షూటింగులు కూడా పెడుతున్నారు కాని ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెనకంజ వేస్తున్నారు. షూటింగుల పరిస్థితి అటుంచితే, తదుపరి రానా పెళ్ళికి అలాగే నిహారిక ఎంగేజ్మెంట్ కు ఎంతమంది వస్తారో చూడాలి మరి.
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…