Movie News

నితిన్ పెళ్ళికి గెస్టులు బాగానే వచ్చారే

హైదరాబాదులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటివరకు సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించాలని కంకణం కట్టుకున్న మెగాస్టార్, రాజమౌళి వంటి దిగ్గజాలు కూడా.. కామ్ గా ఇంటికే పరిమితమైపోయారు.

ఈ తరుణంలో కొంతమంది హీరోలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే.. ఇక వారి కుటుంబం సమక్షంలో మాత్రమే అంతా జరుగుతుందని అందరూ ఆశించారు. అయితే రాను రాను మనోళ్ళు కరోనాకు పెద్దగా భయపడట్లేదని అంటున్నారు చూపరులు.

నిజానికి కరోనా ఇప్పుడు ఒక వైరల్‌ ఫీవర్ తరహాలో చాలామంది రావడమే కాదు, చాలామందికి నయం అయిపోతోంది కూడా. అలాగే సదరు వైరస్ న మనం తేలికగా తీసుకోలేం కాని, మన టాలీవుడ్లో మాత్రం నిధానంగా జనాలు భయపడటం అనేది తగ్గుతోందట. ముఖ్యంగా హీరోలు ఒక్కరొక్కరుగా భయాన్ని పక్కనపెడుతున్నారని నితిన్ పెళ్ళికి వచ్చిన గెస్టులను చూస్తుంటే తెలుస్తోంది.

వరుణ్‌ తేజ్, కార్తికేయ, సాయిధరమ్ తేజ్ మొదలగు హీరోలు అలాగే హైదరాబాదులోనే ఉంటున్న కొందరు హీరోయిన్లు నితిన్ పెళ్ళికి వెళ్ళినట్లు టాక్ వస్తోంది. చక్కగా మాస్కు పెట్టుకుని చేతిలో శానిటైజర్ బాటిల్ పెట్టుకుని వీళ్లు నితిన్ కు కంగ్రాట్స్ చెప్పడానికి ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారట.

ఆల్రెడీ కొందరు స్టార్లు పార్టీలు మొదలుపెట్టేశారు. కొందరేమో మీటింగులు కూడా పెడుతున్నారు. ఇక కొందరు షూటింగులు కూడా పెడుతున్నారు కాని ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెనకంజ వేస్తున్నారు. షూటింగుల పరిస్థితి అటుంచితే, తదుపరి రానా పెళ్ళికి అలాగే నిహారిక ఎంగేజ్మెంట్ కు ఎంతమంది వస్తారో చూడాలి మరి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

6 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

8 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

57 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago