హైదరాబాదులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటివరకు సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించాలని కంకణం కట్టుకున్న మెగాస్టార్, రాజమౌళి వంటి దిగ్గజాలు కూడా.. కామ్ గా ఇంటికే పరిమితమైపోయారు.
ఈ తరుణంలో కొంతమంది హీరోలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే.. ఇక వారి కుటుంబం సమక్షంలో మాత్రమే అంతా జరుగుతుందని అందరూ ఆశించారు. అయితే రాను రాను మనోళ్ళు కరోనాకు పెద్దగా భయపడట్లేదని అంటున్నారు చూపరులు.
నిజానికి కరోనా ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ తరహాలో చాలామంది రావడమే కాదు, చాలామందికి నయం అయిపోతోంది కూడా. అలాగే సదరు వైరస్ న మనం తేలికగా తీసుకోలేం కాని, మన టాలీవుడ్లో మాత్రం నిధానంగా జనాలు భయపడటం అనేది తగ్గుతోందట. ముఖ్యంగా హీరోలు ఒక్కరొక్కరుగా భయాన్ని పక్కనపెడుతున్నారని నితిన్ పెళ్ళికి వచ్చిన గెస్టులను చూస్తుంటే తెలుస్తోంది.
వరుణ్ తేజ్, కార్తికేయ, సాయిధరమ్ తేజ్ మొదలగు హీరోలు అలాగే హైదరాబాదులోనే ఉంటున్న కొందరు హీరోయిన్లు నితిన్ పెళ్ళికి వెళ్ళినట్లు టాక్ వస్తోంది. చక్కగా మాస్కు పెట్టుకుని చేతిలో శానిటైజర్ బాటిల్ పెట్టుకుని వీళ్లు నితిన్ కు కంగ్రాట్స్ చెప్పడానికి ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారట.
ఆల్రెడీ కొందరు స్టార్లు పార్టీలు మొదలుపెట్టేశారు. కొందరేమో మీటింగులు కూడా పెడుతున్నారు. ఇక కొందరు షూటింగులు కూడా పెడుతున్నారు కాని ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెనకంజ వేస్తున్నారు. షూటింగుల పరిస్థితి అటుంచితే, తదుపరి రానా పెళ్ళికి అలాగే నిహారిక ఎంగేజ్మెంట్ కు ఎంతమంది వస్తారో చూడాలి మరి.
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…