తమిళంలో ఎంత గొప్ప గుర్తింపు ఉన్నా తెలుగులో ఆడపాదడపా హిట్లు కొడుతున్న ధనుష్ కు రఘువరన్ బిటెక్ తర్వాత ఆ స్థాయి హిట్టు లేదు. మధ్యలో నవ మన్మథుడు లాంటివి ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకున్నా కోలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ గా చెప్పుకునే వడ చెన్నయ్, అసురన్, కర్ణన్ లు ఇక్కడ డబ్బింగ్ కాకపోవడం ఫ్యాన్స్ ఇప్పటికీ వెలితిగా ఫీలవుతూ ఉంటారు. అందుకే ఈసారి మన మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేశాడు ధనుష్. సితార లాంటి పెద్ద సంస్థ, వెంకీ అట్లూరి లాంటి పక్కా టాలీవుడ్ డైరెక్టర్ తో జట్టు కట్టి సార్ గా రాబోతున్నాడు. ఇందాకే హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది
ఎందులోనూ రానంత డబ్బు ఒక్క విద్యా రంగంలోనే వస్తుందని గుర్తించిన మేకతోలు బిజినెస్ మెన్(సముతిరఖని) కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు నడుపుతూ ఉంటాడు. స్వార్థంతో సర్కారీ బడులను దత్తత తీసుకుని తన స్టాఫ్ ని అక్కడికి పంపిస్తాడు. అతని ఉద్దేశాలు తెలియని వాళ్ళలో ఓ మంచి టీచర్(ధనుష్) ఉంటాడు. ఓ పల్లెటూరికి డ్యూటీ మీద వెళ్తాడు. అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని ఎన్నో కుటుంబాలు పిల్లలను చదువు కోసం పంపడం లేదని అర్థం చేసుకుని రంగంలోకి దిగుతాడు. స్వంత యజమానినే ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధంలో ఎలా గెలిచాడు అనేదే స్టోరీ
కథను చక్కగా అరటిపండు ఒలిచినట్టు రెండున్నర నిమిషాల వీడియోలో క్లియర్ గా చూపించారు. ఎంత స్కూల్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా వెంకీ అట్లూరి అన్నీ పొందుపరిచాడు. ముఖ్యంగా ఇది అనువాద రూపంలో కాకుండా రెండు భాషలకు విడివిడిగా షూట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఫ్రెష్ గా ఉండగా యువరాజ్ ఛాయాగ్రహణం రిచ్ నెస్ కి తోడైంది. వచ్చే 17న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథతో పాటు అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదాతో సార్ పోటీ పడబోతున్నాడు
2026 సంవత్సరంలో ఆరు నెలలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకో రెండు వారాలు బాలన్స్ ఉంది. ఈ ఏడాది మొత్తంలో పదమూడు…
ఈ ఏడాది మోస్ట్ అవైడెట్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు…
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…