తమిళంలో ఎంత గొప్ప గుర్తింపు ఉన్నా తెలుగులో ఆడపాదడపా హిట్లు కొడుతున్న ధనుష్ కు రఘువరన్ బిటెక్ తర్వాత ఆ స్థాయి హిట్టు లేదు. మధ్యలో నవ మన్మథుడు లాంటివి ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకున్నా కోలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ గా చెప్పుకునే వడ చెన్నయ్, అసురన్, కర్ణన్ లు ఇక్కడ డబ్బింగ్ కాకపోవడం ఫ్యాన్స్ ఇప్పటికీ వెలితిగా ఫీలవుతూ ఉంటారు. అందుకే ఈసారి మన మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేశాడు ధనుష్. సితార లాంటి పెద్ద సంస్థ, వెంకీ అట్లూరి లాంటి పక్కా టాలీవుడ్ డైరెక్టర్ తో జట్టు కట్టి సార్ గా రాబోతున్నాడు. ఇందాకే హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది
ఎందులోనూ రానంత డబ్బు ఒక్క విద్యా రంగంలోనే వస్తుందని గుర్తించిన మేకతోలు బిజినెస్ మెన్(సముతిరఖని) కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు నడుపుతూ ఉంటాడు. స్వార్థంతో సర్కారీ బడులను దత్తత తీసుకుని తన స్టాఫ్ ని అక్కడికి పంపిస్తాడు. అతని ఉద్దేశాలు తెలియని వాళ్ళలో ఓ మంచి టీచర్(ధనుష్) ఉంటాడు. ఓ పల్లెటూరికి డ్యూటీ మీద వెళ్తాడు. అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని ఎన్నో కుటుంబాలు పిల్లలను చదువు కోసం పంపడం లేదని అర్థం చేసుకుని రంగంలోకి దిగుతాడు. స్వంత యజమానినే ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధంలో ఎలా గెలిచాడు అనేదే స్టోరీ
కథను చక్కగా అరటిపండు ఒలిచినట్టు రెండున్నర నిమిషాల వీడియోలో క్లియర్ గా చూపించారు. ఎంత స్కూల్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా వెంకీ అట్లూరి అన్నీ పొందుపరిచాడు. ముఖ్యంగా ఇది అనువాద రూపంలో కాకుండా రెండు భాషలకు విడివిడిగా షూట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఫ్రెష్ గా ఉండగా యువరాజ్ ఛాయాగ్రహణం రిచ్ నెస్ కి తోడైంది. వచ్చే 17న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథతో పాటు అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదాతో సార్ పోటీ పడబోతున్నాడు
This post was last modified on February 8, 2023 10:04 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…