తమిళంలో ఎంత గొప్ప గుర్తింపు ఉన్నా తెలుగులో ఆడపాదడపా హిట్లు కొడుతున్న ధనుష్ కు రఘువరన్ బిటెక్ తర్వాత ఆ స్థాయి హిట్టు లేదు. మధ్యలో నవ మన్మథుడు లాంటివి ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకున్నా కోలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ గా చెప్పుకునే వడ చెన్నయ్, అసురన్, కర్ణన్ లు ఇక్కడ డబ్బింగ్ కాకపోవడం ఫ్యాన్స్ ఇప్పటికీ వెలితిగా ఫీలవుతూ ఉంటారు. అందుకే ఈసారి మన మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేశాడు ధనుష్. సితార లాంటి పెద్ద సంస్థ, వెంకీ అట్లూరి లాంటి పక్కా టాలీవుడ్ డైరెక్టర్ తో జట్టు కట్టి సార్ గా రాబోతున్నాడు. ఇందాకే హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది
ఎందులోనూ రానంత డబ్బు ఒక్క విద్యా రంగంలోనే వస్తుందని గుర్తించిన మేకతోలు బిజినెస్ మెన్(సముతిరఖని) కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు నడుపుతూ ఉంటాడు. స్వార్థంతో సర్కారీ బడులను దత్తత తీసుకుని తన స్టాఫ్ ని అక్కడికి పంపిస్తాడు. అతని ఉద్దేశాలు తెలియని వాళ్ళలో ఓ మంచి టీచర్(ధనుష్) ఉంటాడు. ఓ పల్లెటూరికి డ్యూటీ మీద వెళ్తాడు. అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని ఎన్నో కుటుంబాలు పిల్లలను చదువు కోసం పంపడం లేదని అర్థం చేసుకుని రంగంలోకి దిగుతాడు. స్వంత యజమానినే ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధంలో ఎలా గెలిచాడు అనేదే స్టోరీ
కథను చక్కగా అరటిపండు ఒలిచినట్టు రెండున్నర నిమిషాల వీడియోలో క్లియర్ గా చూపించారు. ఎంత స్కూల్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా వెంకీ అట్లూరి అన్నీ పొందుపరిచాడు. ముఖ్యంగా ఇది అనువాద రూపంలో కాకుండా రెండు భాషలకు విడివిడిగా షూట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఫ్రెష్ గా ఉండగా యువరాజ్ ఛాయాగ్రహణం రిచ్ నెస్ కి తోడైంది. వచ్చే 17న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథతో పాటు అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదాతో సార్ పోటీ పడబోతున్నాడు
This post was last modified on February 8, 2023 10:04 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…