యువ కథానాయకుడు శర్వానంద్ కెరీర్ కొన్నేళ్లుగా ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. వరుస డిజాస్టర్లతో సతమతం అయిన అతను.. గత ఏడాది చివర్లో ఒకే ఒక జీవితంతో కాస్త ఉపశమనం పొందాడు. ఈ సినిమా కూడా కమర్షియల్గా పెద్ద సక్సెస్ ఏమీ కాలేదు కానీ.. ఫెయిల్యూర్ కూడా కాకపోవడం శర్వాకు సంతోషాన్నిచ్చింది.
ఈ సినిమా రిలీజ్ కాకముందే శర్వా.. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్యతో ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నితిన్తో క్యాన్సిల్ అయిన పవర్ పేటనే శర్వాతో కృష్ణచైతన్య తీయబోతున్నట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. ఐతే తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో శర్వా స్థానంలోకి విశ్వక్సేన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ సినిమా నుంచి బయటికి వచ్చిన శర్వా.. ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అతను సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కేవీ గుహన్ దర్శకత్వంలో నటించనున్నాడట. తమిళంలో హ్యాపీడేస్ రీమేక్తో దర్శకుడిగా పరిచయం అయిన గుహన్.. ఆపై తెలుగులో 118 మూవీతో హిట్టు కొట్టాడు. కానీ తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయాడు. హైవే, డబ్ల్యూడబ్ల్యూ, డబ్ల్యూ చిత్రాలతో నిరాశపరిచాడు. ఇప్పుడతను శర్వాకు ఒక థ్రిల్లర్ కథ చెప్పి ఒప్పించాడట. ఈ సినిమాను నిర్మించడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చాడట.
మొత్తానికి కాంబినేషన్ బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు శర్వాకు యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతోనూ ఒక కమిట్మెంట్ ఉంది. ముందు గుహన్ సినిమా చేశాకే ఆదిత్య సినిమాను పట్టాలెక్కించనున్నాడు శర్వా. ఇటీవలే రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న శర్వా.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.
This post was last modified on January 31, 2023 10:09 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…