Movie News

సోషల్ మీడియా నుంచి రోడ్ల దాకా వెళ్లిపోయారు

ఏదైనా మితంగా ఉండాలి. అతిగా మారితే అనర్థాలు జరుగుతాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్ యుద్ధాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇప్పటిదాకా కేవలం ఆన్ లైన్ ట్రోల్స్ కే పరిమితమైన దురాభిమానులు ఇప్పుడు ఏకంగా రోడ్లకు వచ్చేస్తున్నారు.

అర్థం లేని ఛాలెంజులతో కవ్వించుకుంటూ వీడియోలు మీమ్స్ తో మరికొందరిని రెచ్చగొడుతున్నారు. ఇది ఎంత దూరం వెళ్లిందంటే సరదా కోసమో సీరియస్ గా చేద్దామనో, ఉద్దేశం ఏదైనా సరే హద్దులు మీరి వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లేలా ఉంది. హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటే గ్రౌండ్ లెవెల్ లో ఫ్యాన్స్ ఇంకో రకంగా ఉంటున్నారు.

నిన్న ట్విట్టర్ లో ప్రభాస్ మహేష్ బాబు అభిమానులు పరస్పరం రెచ్చగొట్టుకునేలా ట్వీట్లు పెట్టుకున్నారు. వీళ్ళలో ఒకడు నేరుగా కలుసుకుని కొట్టుకుందామని రెచ్చగొట్టి ఓ షాపింగ్ మాల్ కు వెళ్లి ఫోటో పెట్టాడు. దీనికి స్పందించిన అవతలి హీరో ఫ్యాన్ వస్తున్నా కాచుకో మంటూ ఏకంగా లొకేషన్ కూడా షేర్ చేశాడు.

ఇదంతా బెంగళూరులో జరిగింది. ఈ ఇద్దరిని చూసి అచ్చం ఇదే తరహా సీన్ ని హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ దగ్గర రిపీట్ చేశారు. ట్విస్టు ఏంటంటే రెండు సందర్భాల్లోనూ రెండో వాడు రాలేదు. ఒక్కరే వచ్చి హంగామా చేయడం మీసాలు తిప్పి తొడలు కొట్టడం జరిగిపోయింది.

ఇదంతా పనీపాటా లేని వ్యవహారమే. ఒకప్పుడు పోస్టర్ల మీద పేడ కొట్టి లేదా వాటిని చింపేసి తమ ఈగోలను సంతృప్తి పరుచుకునే స్టేజి నుంచి ఏకంగా ఆన్ లైన్ లో రారా చూసుకుందాం అనే స్టేజి దాకా ఎదిగిపోయారు. ఆయా సందర్భాలకు తగ్గట్టు చరణ్ తారక్ పవన్ బన్నీ ఇలా అందరి అభిమానులు ఒక్కోసారి ఇలాంటి వార్స్ లో భాగమైనవాళ్లే. స్క్రీన్ పైనేమో స్టార్లు కలిసి డాన్సులు చేస్తున్నారు, ఫైట్లు చేస్తున్నారు, ఒకే స్టేజి మీద కౌగిలించుకుని ఆప్యాయత చూపిస్తున్నారు. కానీ వీళ్ళను ఇష్టపడే వాళ్ళ తీరేమో ఇలా ఉంది. అయినా చదువు కెరీర్ మీద దృష్టి పెట్టక ఇవేం బుద్దులని నెటిజెన్లు ఈసడించుకుంటున్నారు

This post was last modified on January 28, 2023 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

49 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago