ఈ లాక్ డౌన్ లో అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే మలయాళ సినిమా రీమేక్ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. అయితే అందులో చాలా వరకు నిజం కాలేదు. కాకపోతే ఈ సినిమా పట్ల మన హీరోలు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. పురుషాహంకారం అంశంతో రూపొందిన సదరు మలయాళ చిత్రంలో ఇద్దరు హీరోల పాత్రలు నువ్వా, నేనా అన్నట్టుంటాయి. అందుకే బాలకృష్ణ. వెంకటేష్ చేయడం లేదని తెలియగానే రవితేజ అడిగి మరీ చేస్తానని చెప్పాడట. రవితేజ, రానాతో ఓకే అయిపోయిందనే అనుకున్నారు కానీ ఇప్పుడో కొత్త ట్విస్ట్ వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ రీమేక్ చేయడానికి ఒక బడా స్టార్ ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్. ఒకవేళ అతను ఈ సినిమా చేసేట్టయితే అన్ని లెక్కలు మారిపోతాయి. అటువైపు హీరో కూడా మారాల్సి రావచ్చు. అలాగే దర్శకుడిగా ఎవరైనా ప్రముఖుడు రావచ్చు. మలయాళంలో ఒక మాదిరి బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో బడా ప్రాజెక్ట్ గా మారేట్టుంది. ఇదిలావుంటే ఈ సినిమాను ఇప్పటికే చాలామంది తెలుగు వాళ్ళు చూసేసిన నేపథ్యంలో తెలుగు వెర్షన్ పై ఎంత ఆసక్తి ఉంటుందనేది ఆసక్తికరం.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…