ఈ లాక్ డౌన్ లో అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే మలయాళ సినిమా రీమేక్ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. అయితే అందులో చాలా వరకు నిజం కాలేదు. కాకపోతే ఈ సినిమా పట్ల మన హీరోలు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. పురుషాహంకారం అంశంతో రూపొందిన సదరు మలయాళ చిత్రంలో ఇద్దరు హీరోల పాత్రలు నువ్వా, నేనా అన్నట్టుంటాయి. అందుకే బాలకృష్ణ. వెంకటేష్ చేయడం లేదని తెలియగానే రవితేజ అడిగి మరీ చేస్తానని చెప్పాడట. రవితేజ, రానాతో ఓకే అయిపోయిందనే అనుకున్నారు కానీ ఇప్పుడో కొత్త ట్విస్ట్ వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ రీమేక్ చేయడానికి ఒక బడా స్టార్ ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్. ఒకవేళ అతను ఈ సినిమా చేసేట్టయితే అన్ని లెక్కలు మారిపోతాయి. అటువైపు హీరో కూడా మారాల్సి రావచ్చు. అలాగే దర్శకుడిగా ఎవరైనా ప్రముఖుడు రావచ్చు. మలయాళంలో ఒక మాదిరి బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో బడా ప్రాజెక్ట్ గా మారేట్టుంది. ఇదిలావుంటే ఈ సినిమాను ఇప్పటికే చాలామంది తెలుగు వాళ్ళు చూసేసిన నేపథ్యంలో తెలుగు వెర్షన్ పై ఎంత ఆసక్తి ఉంటుందనేది ఆసక్తికరం.
This post was last modified on July 22, 2020 12:46 am
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…