ఈ లాక్ డౌన్ లో అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే మలయాళ సినిమా రీమేక్ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. అయితే అందులో చాలా వరకు నిజం కాలేదు. కాకపోతే ఈ సినిమా పట్ల మన హీరోలు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. పురుషాహంకారం అంశంతో రూపొందిన సదరు మలయాళ చిత్రంలో ఇద్దరు హీరోల పాత్రలు నువ్వా, నేనా అన్నట్టుంటాయి. అందుకే బాలకృష్ణ. వెంకటేష్ చేయడం లేదని తెలియగానే రవితేజ అడిగి మరీ చేస్తానని చెప్పాడట. రవితేజ, రానాతో ఓకే అయిపోయిందనే అనుకున్నారు కానీ ఇప్పుడో కొత్త ట్విస్ట్ వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ రీమేక్ చేయడానికి ఒక బడా స్టార్ ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్. ఒకవేళ అతను ఈ సినిమా చేసేట్టయితే అన్ని లెక్కలు మారిపోతాయి. అటువైపు హీరో కూడా మారాల్సి రావచ్చు. అలాగే దర్శకుడిగా ఎవరైనా ప్రముఖుడు రావచ్చు. మలయాళంలో ఒక మాదిరి బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో బడా ప్రాజెక్ట్ గా మారేట్టుంది. ఇదిలావుంటే ఈ సినిమాను ఇప్పటికే చాలామంది తెలుగు వాళ్ళు చూసేసిన నేపథ్యంలో తెలుగు వెర్షన్ పై ఎంత ఆసక్తి ఉంటుందనేది ఆసక్తికరం.
This post was last modified on July 22, 2020 12:46 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…