మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ కి సమంత హెల్త్ కారణం చేత కాస్త పెద్ద బ్రేక్ పడింది. ఇప్పటికే రెండు నెలలపైనే బ్రేక్ వచ్చేసింది. ఫిబ్రవరి నుండి సమంత ఘాట్ లో పాల్గొననుందని అంటున్నారు కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సమంత ఫిట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా కనిపిస్తుంది. ఆమె ఆరోగ్య పరంగా పూర్తిగా కొలుకున్నాకే ఘాట్ లో జాయిన్ అయ్యే ఆలోచనలో ఉంది.
ఇక విజయ్ కి ‘లైగర్’ తర్వాత ‘ఖుషి’ రూపంలో బిగ్ బ్రేక్ వచ్చేసింది. ఇప్పటికే చాలా రోజులు బ్రేక్ తీసుకున్న విజయ్ తాజాగా మైత్రి నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరి నుండి ఖుషి ఘాట్ మొదలు కాకపోతే తను గౌతం తిన్ననూరి మూవీకి సంబందించి ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకొస్తానని చెప్తున్నాడట.
విజయ్ దేవరకొండ ఒత్తిడితో మైత్రి నిర్మాతలు సమంతను ఫిబ్రవరి నుండి షూటింగ్ కి ఒప్పించే పనిలో ఉన్నారట. ఫిబ్రవరిలో సమంత ‘శాకుంతలం’ కి సంబంధించి ప్రమోషన్ చేయాల్సి ఉంది. తన పాన్ ఇండియా సినిమా కోసం సమంత కొన్ని రోజులు ఓపిక తెచ్చుకొని ప్రమోషన్స్ చేయనుందని తెలుస్తుంది. ఎక్కువ ప్రదేశాలు కాకపోయినా చెన్నై , ముంబై, బెంగళూర్ వెళ్ళే ప్లానింగ్ లో ఉందట. సామ్ ‘శాకుంతలం’ రిలీజ్ తర్వాతే ‘ఖుషి’ కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు విజయ్ సమంత డేట్స్ కోసం వెయిట్ చేస్తాడా లేదా గౌతం తిన్ననూరి సినిమాకి షిఫ్ట్ అవుతాడా ? చూడాలి.
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…