మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ కి సమంత హెల్త్ కారణం చేత కాస్త పెద్ద బ్రేక్ పడింది. ఇప్పటికే రెండు నెలలపైనే బ్రేక్ వచ్చేసింది. ఫిబ్రవరి నుండి సమంత ఘాట్ లో పాల్గొననుందని అంటున్నారు కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సమంత ఫిట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా కనిపిస్తుంది. ఆమె ఆరోగ్య పరంగా పూర్తిగా కొలుకున్నాకే ఘాట్ లో జాయిన్ అయ్యే ఆలోచనలో ఉంది.
ఇక విజయ్ కి ‘లైగర్’ తర్వాత ‘ఖుషి’ రూపంలో బిగ్ బ్రేక్ వచ్చేసింది. ఇప్పటికే చాలా రోజులు బ్రేక్ తీసుకున్న విజయ్ తాజాగా మైత్రి నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరి నుండి ఖుషి ఘాట్ మొదలు కాకపోతే తను గౌతం తిన్ననూరి మూవీకి సంబందించి ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకొస్తానని చెప్తున్నాడట.
విజయ్ దేవరకొండ ఒత్తిడితో మైత్రి నిర్మాతలు సమంతను ఫిబ్రవరి నుండి షూటింగ్ కి ఒప్పించే పనిలో ఉన్నారట. ఫిబ్రవరిలో సమంత ‘శాకుంతలం’ కి సంబంధించి ప్రమోషన్ చేయాల్సి ఉంది. తన పాన్ ఇండియా సినిమా కోసం సమంత కొన్ని రోజులు ఓపిక తెచ్చుకొని ప్రమోషన్స్ చేయనుందని తెలుస్తుంది. ఎక్కువ ప్రదేశాలు కాకపోయినా చెన్నై , ముంబై, బెంగళూర్ వెళ్ళే ప్లానింగ్ లో ఉందట. సామ్ ‘శాకుంతలం’ రిలీజ్ తర్వాతే ‘ఖుషి’ కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు విజయ్ సమంత డేట్స్ కోసం వెయిట్ చేస్తాడా లేదా గౌతం తిన్ననూరి సినిమాకి షిఫ్ట్ అవుతాడా ? చూడాలి.
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…