మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ కి సమంత హెల్త్ కారణం చేత కాస్త పెద్ద బ్రేక్ పడింది. ఇప్పటికే రెండు నెలలపైనే బ్రేక్ వచ్చేసింది. ఫిబ్రవరి నుండి సమంత ఘాట్ లో పాల్గొననుందని అంటున్నారు కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సమంత ఫిట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా కనిపిస్తుంది. ఆమె ఆరోగ్య పరంగా పూర్తిగా కొలుకున్నాకే ఘాట్ లో జాయిన్ అయ్యే ఆలోచనలో ఉంది.
ఇక విజయ్ కి ‘లైగర్’ తర్వాత ‘ఖుషి’ రూపంలో బిగ్ బ్రేక్ వచ్చేసింది. ఇప్పటికే చాలా రోజులు బ్రేక్ తీసుకున్న విజయ్ తాజాగా మైత్రి నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరి నుండి ఖుషి ఘాట్ మొదలు కాకపోతే తను గౌతం తిన్ననూరి మూవీకి సంబందించి ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకొస్తానని చెప్తున్నాడట.
విజయ్ దేవరకొండ ఒత్తిడితో మైత్రి నిర్మాతలు సమంతను ఫిబ్రవరి నుండి షూటింగ్ కి ఒప్పించే పనిలో ఉన్నారట. ఫిబ్రవరిలో సమంత ‘శాకుంతలం’ కి సంబంధించి ప్రమోషన్ చేయాల్సి ఉంది. తన పాన్ ఇండియా సినిమా కోసం సమంత కొన్ని రోజులు ఓపిక తెచ్చుకొని ప్రమోషన్స్ చేయనుందని తెలుస్తుంది. ఎక్కువ ప్రదేశాలు కాకపోయినా చెన్నై , ముంబై, బెంగళూర్ వెళ్ళే ప్లానింగ్ లో ఉందట. సామ్ ‘శాకుంతలం’ రిలీజ్ తర్వాతే ‘ఖుషి’ కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు విజయ్ సమంత డేట్స్ కోసం వెయిట్ చేస్తాడా లేదా గౌతం తిన్ననూరి సినిమాకి షిఫ్ట్ అవుతాడా ? చూడాలి.
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…