మైత్రి మూవీ మేకర్స్ లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ కి సమంత హెల్త్ కారణం చేత కాస్త పెద్ద బ్రేక్ పడింది. ఇప్పటికే రెండు నెలలపైనే బ్రేక్ వచ్చేసింది. ఫిబ్రవరి నుండి సమంత ఘాట్ లో పాల్గొననుందని అంటున్నారు కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సమంత ఫిట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా కనిపిస్తుంది. ఆమె ఆరోగ్య పరంగా పూర్తిగా కొలుకున్నాకే ఘాట్ లో జాయిన్ అయ్యే ఆలోచనలో ఉంది.
ఇక విజయ్ కి ‘లైగర్’ తర్వాత ‘ఖుషి’ రూపంలో బిగ్ బ్రేక్ వచ్చేసింది. ఇప్పటికే చాలా రోజులు బ్రేక్ తీసుకున్న విజయ్ తాజాగా మైత్రి నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరి నుండి ఖుషి ఘాట్ మొదలు కాకపోతే తను గౌతం తిన్ననూరి మూవీకి సంబందించి ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకొస్తానని చెప్తున్నాడట.
విజయ్ దేవరకొండ ఒత్తిడితో మైత్రి నిర్మాతలు సమంతను ఫిబ్రవరి నుండి షూటింగ్ కి ఒప్పించే పనిలో ఉన్నారట. ఫిబ్రవరిలో సమంత ‘శాకుంతలం’ కి సంబంధించి ప్రమోషన్ చేయాల్సి ఉంది. తన పాన్ ఇండియా సినిమా కోసం సమంత కొన్ని రోజులు ఓపిక తెచ్చుకొని ప్రమోషన్స్ చేయనుందని తెలుస్తుంది. ఎక్కువ ప్రదేశాలు కాకపోయినా చెన్నై , ముంబై, బెంగళూర్ వెళ్ళే ప్లానింగ్ లో ఉందట. సామ్ ‘శాకుంతలం’ రిలీజ్ తర్వాతే ‘ఖుషి’ కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు విజయ్ సమంత డేట్స్ కోసం వెయిట్ చేస్తాడా లేదా గౌతం తిన్ననూరి సినిమాకి షిఫ్ట్ అవుతాడా ? చూడాలి.
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…