Honey Rose
ఇటీవలే సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డిలో పెద్ద బాలయ్యకు మరదలిగా జైసింహారెడ్డికి తల్లిగా రెండు పాత్రల మధ్య విపరీతమైన వ్యత్యాసమున్నప్పటికీ మెప్పించిన హానీ రోజ్ మెల్లగా టాలీవుడ్ లోనే కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది.
నిజానికి అఖండలోనే తను హీరోయిన్ గా నటించాల్సింది. కొంత స్క్రీన్ టెస్ట్ చేశాక దర్శకుడు బోయపాటి శీనుకి సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆమె స్థానంలో ప్రగ్య జైస్వాల్ ని తీసుకున్నారు. అయితే హానీలో విషయముందని గుర్తించిన మైత్రి మేకర్స్, గోపిచంద్ మలినేనిలు తనను బాలయ్య పక్కన జోడిగా లాక్ చేశారు. కట్ చేస్తే శృతి హాసన్ కన్నా తనకే ఎక్కువ గుర్తింపు దక్కింది
ఫస్ట్ హాఫ్ లో తెల్లబడ్డ జుత్తుతో కనిపించినా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గ్లామర్ రోల్ లో బాగానే మెప్పించింది. అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ని హానీ రోజ్ నే తీసుకోవాలనే ప్రతిపాదన మొదట వచ్చింది.
అయితే కాజల్ అగర్వాల్ కూడా బెటర్ ఛాయస్ గా ఫీలవుతున్న అనిల్ ఇంకా ఈ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదని వినికిడి. వీళ్ళ కన్నా ముందు త్రిష, హ్యూమా ఖురేషిలను ట్రై చేసినప్పటికీ ఏవో కారణాల వల్ల వాళ్ళు నో చెప్పేశారు. వీలైనంత త్వరగా ఎన్బికె 108కి హీరోయిన్ ని లాక్ చేయాల్సి ఉంది.
ఎప్పుడో 2005 మలయాళంలో లాంచ్ అయిన హానీ రోస్ అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది కానీ తెలుగు ఎంట్రీకి మాత్రం పదిహేడేళ్లు పట్టింది. వయసు మరీ లేత కాకపోయినా అందాల అరోబోత విషయంలో పెద్దగా మొహమాటపడదని పేరుంది. వీరసింహారెడ్డిలో ఆ అవకాశం లేకపోయినా చేయబోయే వాటిలో ఏదైనా గ్లామర్ షో ఉండకపోదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది ఓకే అయినా కాకపోయినా టాలీవుడ్ లో చాలా సీనియర్ హీరోలకు జోడి దొరకడం మహా కష్టంగా ఉన్న టైంలో హానీ రోజ్ మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది కాబట్టి ఇక్కడే సెటిలయ్యే ప్రయత్నాలు చేయొచ్చు
This post was last modified on January 24, 2023 1:37 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…